సిఫార్సు లేఖలు చెల్లలే..!
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల సంక్షేమ అధికారులకు మంగళవారం సంక్షేమ భవనంలో ఆయా శాఖల సాధికారత అధికారులు విశ్వమోహన్రెడ్డి, కుష్బు కొఠారి, అన్నాదొర ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ నిర్వహించారు.
93 మంది వసతి గృహ సంక్షేమ అధికారులకు స్థానచలనం
బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంక్షేమ శాఖల సాధికారత అధికారులు విశ్వమోహన్రెడ్డి,
కుష్బూ కొఠారి, అన్నాదొర
అనంత సంక్షేమం, న్యూస్టుడే: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల సంక్షేమ అధికారులకు మంగళవారం సంక్షేమ భవనంలో ఆయా శాఖల సాధికారత అధికారులు విశ్వమోహన్రెడ్డి, కుష్బు కొఠారి, అన్నాదొర ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 93 మంది వసతి గృహ సంక్షేమ అధికారులకు స్థానచలనం కలిగింది. మరో 22 మందిని విజ్ఞప్తి మేరకు బదిలీ చేశారు. మూడు శాఖల పరిధిలో ఏకంగా 60 మంది వరకు సిఫార్సు లేఖలను అధికారులకు అందించారు. బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహించాలని, లేనిపక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు హెచ్చరించారు. దీంతో సిఫార్సు లేఖలన్నీ పక్కన పెట్టేశారు. స్పౌజ్, వికలాంగ, సీనియార్టీ ప్రాతిపదికన బదిలీల ప్రక్రియ నిర్వహించారు.
వెనక్కి తగ్గిన స్పౌజ్ కేటగిరీ
స్పౌజ్ (భార్య, భర్తలు ఉద్యోగులు) కేటగిరి అభ్యర్థులు ఇప్పటికే స్పౌజ్ వాడుకున్నా మళ్లీ వాడుకోవాలని ప్రయత్నించి ఆఖరి నిమిషంలో తప్పుకొన్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా 2014 తర్వాత స్పౌజ్ వాడుకొని ఉంటే అనర్హులని, ఒకవేళ ఉపయోగించుకుంటే విచారణలో తేలితే క్రిమినల్ కేసులు ఉంటాయని ఆ మేరకు అంగీకార పత్రాన్ని భార్యాభర్తలు ఇద్దరూ అందివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది అడ్డ దారిలో చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ముందుగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినా కౌన్సెలింగ్ సమయంలో ఆ కేటగిరిని ఉపయోగించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేనేతలను ఆదుకుంటాం: నిమ్మల కిష్టప్ప
[ 27-04-2024]
తెదేపా చేనేతలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. -
పయ్యావుల కేశవ్ ప్రచారంలో వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు
[ 27-04-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా నాయకులు గొడవలకు తవిచ్చేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరహా చర్యలకు మండలంలోని కాలువపల్లిలో శుక్రవారం వైకాపా కార్యకర్తలు పూనుకున్నారు. -
వైకాపా మోసపూరిత మాటలు నమ్మొద్దు: సునీత
[ 27-04-2024]
గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి ఎంత తప్పుచేశారో మీరే ఆలోచించాలి. ఆ తప్పు మళ్లీ చేయొద్దు. ఒక్క ఛాన్స్ అంటూ మళ్లీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు. -
సొంత చెల్లి చీరపైనా దిగజారుడు మాటలా?
[ 27-04-2024]
ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత చెల్లెలు ధరించిన చీర గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం జగన్ దిగుజారుడు తనానికి పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. -
నిలువ నీడేదీ జగన్?
[ 27-04-2024]
అసలే మండేఎండలు.. పట్టణంలోని బస్టాప్లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు పేరుకు మాత్రమే ఉండగా బస్సులన్నీ పాత బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. -
‘వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడదాం’
[ 27-04-2024]
వైకాపా నాయకులు ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, వారి అరాచక పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, రాయదుర్గం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం..
[ 27-04-2024]
ప్రజల నుంచి పన్ను కట్టించుకొంటున్నారే తప్పా అభివృద్ధి చేయలేకపోయారని, తనకు అవకాశం కల్పిస్తే కళ్యాణదుర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 27-04-2024]
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయనకు పూలమాలవేసి, శాలువాతో ఘనస్వాగతం పలికారు. -
నిండా మునిగినా.. రైతుకు తప్పని నిరీక్షణ
[ 27-04-2024]
తమది రైతు ప్రభుత్వమని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది. -
లోక్సభకు 9, అసెంబ్లీకి 45 నామపత్రాల తిరస్కరణ
[ 27-04-2024]
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా హిందూపురం పార్లమెంటు స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామపత్రాలను అధికారులు పరిశీలన చేశారు. -
28న ఏపీసెట్
[ 27-04-2024]
సహాచార్య ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఏపీ సెట్-2024 ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య వెంకట రమణ తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
[ 27-04-2024]
ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో నిర్వహిస్తున్న 4వ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థిని డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. -
ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-04-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.మోహన్ మురళి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్