అంతా అడ్డగోలు.. ఆపై పదోన్నతులు!
ఎస్కేయూలో అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా నియామకాలు, పదోన్నతులు చేపడుతున్నారు. అభ్యర్థులతో భారీగా ముడుపులు స్వీకరించి అర్హతలేకపోయినా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 10వ ఆర్థిక సంఘం కింద నియమితులైన సహాయాచార్యులకు ఉద్యోగోన్నతి కల్పిస్తుండమే ఇందుకు నిదర్శనం.
ఎస్కేయూలో ఇష్టారాజ్యం
అధికారుల తీరుపై విమర్శలు
న్యూస్టుడే: ఎస్కేయూ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
ఎస్కేయూలో అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా నియామకాలు, పదోన్నతులు చేపడుతున్నారు. అభ్యర్థులతో భారీగా ముడుపులు స్వీకరించి అర్హతలేకపోయినా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 10వ ఆర్థిక సంఘం కింద నియమితులైన సహాయాచార్యులకు ఉద్యోగోన్నతి కల్పిస్తుండమే ఇందుకు నిదర్శనం. 2005లో తాత్కాలికంగా చేపట్టిన నియామకాలను కొంతకాలానికి రెగ్యులర్ చేశారు. తాజాగా పదోన్నతులు కల్పిస్తున్నారు. అప్పట్లో రోస్టర్ పాటించకుండానే నియామకాలు చేపట్టారు. దీంతో అన్యాయం జరుగుతోందని ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదో ఆర్థిక సంఘం.. ఏమాకథ
10వ ఆర్థిక సంఘం కింద యూజీసీ నుంచి 2003లో ఎస్కేయూకు రూ.70.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటిని ఖర్చు చేయడానికి కొన్ని విభాగాల్లో సహాయాచార్యులను ఒప్పంద పద్ధతిలో నియమించాలని నిర్ణయించారు. ఎనిమిది మంది నియామకానికి 2005 ఏప్రిల్ 6న ప్రకటన జారీ చేశారు. అదే సంవత్సరం జూన్ 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 2005 నుంచి 2007 మార్చి 31 వరకు మాత్రమే సహాయాచార్యులను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బయోటెక్నాలజీలో 2, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 2, ఫిజిక్స్లో 2, తెలుగు 1, వ్యాయామ విద్యవిభాగంలో ఒకటి చొప్పున పోస్టులు భర్తీ చేశారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ విభాగంలో విద్యార్హత లేకపోయినా ఇద్దరిని నియమించారు. అప్పట్లోనే అభ్యంతరాలు వచ్చాయి. అర్హత ఉన్న అభ్యర్థులు లేనందున నియమించినట్లు అధికారులు తెలియజేశారు. ఆ ఇద్దరు 2007లోపు విద్యార్హత పూర్తిచేయడానికి యూజీసీ అవకాశం కల్పించింది. గడువులోపు విద్యార్హత సాధించలేదు. ఓ అభ్యర్థి 18-2-2009 నాటికి, మరో అభ్యర్థి 6-11-2011 నాటికి విద్యార్హత పొందారు. యూజీసీ గడువు ఇచ్చిన మూడేళ్ల తర్వాత వారు విద్యార్హత సాధించారు. అయినా సహాయాచార్యులుగానే కొనసాగిస్తూ వచ్చారు. వాస్తవానికి నియామకాలే తప్పు. ఆపై రెగ్యులర్ చేశారు. మళ్లీ పదోన్నతులు కల్పించేందుకు సిద్ధం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆడిట్శాఖ అభ్యంతరం
8 మంది సహాయాచార్యుల్లో ఏడుగురు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. వారిని 17-12-2008వ తేదీన రెగ్యులర్ చేశారు. అరియర్స్ కూడా చెల్లించారు. నిబంధనలకు విరుద్ధంగా బకాయిలు చెల్లించారని ప్రిన్సిపల్ అకౌంట్స్ జనరల్ ఆడిట్ (రాష్ట్రఆడిట్శాఖ) అభ్యంతరం తెలిపింది. తీసుకున్న సొమ్ము వెనక్కు ఇవ్వాలని సూచించింది. దీంతో యూనివర్సిటీ అధికారులు సహాయాచార్యులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలా అనేక వివాదాలున్నా సహాయాచార్యులకు ఆచార్యులుగా పదోన్నతులు కల్పించే విషయంపై చర్చ జరుగుతోంది.
రోస్టర్ ఉల్లంఘన
ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల సంక్షేమశాఖల నుంచి రోస్టర్ అప్రూవల్ లేకుండానే నియామకాలు చేపట్టారు. రోస్టర్ పుస్తకంలో ఖాళీలు చూపించి, అవసరమున్న చోట మాత్రమే రోస్టర్ పొందుపరిచారు. నియామక కమిటీలో కోరం కూడా లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఈ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. వర్సిటీ అధికారులే నియమించుకున్నారు.
నిబంధనల ప్రకారమే
- ఆచార్య రామకృష్ణారెడ్డి, ఉపకులపతి, ఎస్కేయూ
ఆచార్యులుగా పదోన్నతులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన జారీ చేశాం. ఇందులో 10వ ఆర్థిక సంఘం అని ప్రత్యేకంగా లేదు. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. యూజీసీ నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం