ప్రతి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి: మంత్రి
సీఎం జగన్మోహన్రెడ్డి పేదల కోసం పని చేస్తున్నారని, ప్రతి కుటుంబానికి బటన్ నొక్కి ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, చిత్రంలో మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులు
గుంతకల్లు పట్టణం, న్యూస్టుడే: సీఎం జగన్మోహన్రెడ్డి పేదల కోసం పని చేస్తున్నారని, ప్రతి కుటుంబానికి బటన్ నొక్కి ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణ సమీపంలోని కొనకొండ్ల రోడ్డులో సోమవారం భీమా పార్కు, మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి భీమరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి భీమా పార్కును ప్రారంభించి వెళ్లిపోయారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డితోపాటు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం విగ్రహావిష్కరణ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి కార్యక్రమాన్ని కొనసాగించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ ఎల్లారెడ్డి భీమరెడ్డి కుటుంబంలో ముగ్గురు కుమారులు ఎమ్మెల్యేలు, ఒకరు ఎమ్మెల్సీ కావడం విశేషమని చెప్పారు. చంద్రబాబునాయుడు హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవి, వారు చెప్పిన వారికే పింఛన్లు వచ్చేవి, జగన్ ప్రభుత్వం వచ్చాక లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్నీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పామిడి, గుంతకల్లు, గుత్తి మండలాలకు చెందిన లబ్ధిదారులకు రెవెన్యూ డివిజన్ అధికారి రవీంద్ర మంత్రి చేతుల మీదుగా డిపట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, జడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రతాప్రెడ్డి, భీమరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కోటంరెడ్డి పార్టీని వీడేందుకే ఫోన్ ట్యాపింగ్ సాకులు
పెద్దవడుగూరు: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైకాపాను వీడేందుకు ఫోన్ ట్యాపింగ్ సాకులు అనే ఆయుధాన్ని ఎంచుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పార్టీలో ఇమడలేక ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సోమవారం పెద్దవడుగూరు మండలంలో చేస్తున్న పాదయాత్రలో మంత్రి పాల్గొని సంఘీభావం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం