వారి వ్యూహం... వీరి సహకారం!
‘సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపురం టవర్క్లాక్ దగ్గరికి వస్తా.. అక్కడి నుంచి రాప్తాడు సర్కిల్ వస్తా.. రామగిరి మండలం వస్తా.. లేదంటే మా గుంటూరోడు మొద్దుశీను.. పరిటాల రవిని చంపిన పార్టీ కార్యాలయం వద్దకు వస్తా.
రెచ్చిపోయిన వైకాపా నాయకుడు
కట్టడి చేయని పోలీసులు
అనంతలో హరికృష్ణారెడ్డి వ్యవహారంపై కలకలం
ఈనాడు డిజిటల్, అనంతపురం -న్యూస్టుడే, అనంత నేరవార్తలు
అనంతపురంలో తెదేపా శ్రేణులను నిలువరిస్తున్న పోలీసులు
‘సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపురం టవర్క్లాక్ దగ్గరికి వస్తా.. అక్కడి నుంచి రాప్తాడు సర్కిల్ వస్తా.. రామగిరి మండలం వస్తా.. లేదంటే మా గుంటూరోడు మొద్దుశీను.. పరిటాల రవిని చంపిన పార్టీ కార్యాలయం వద్దకు వస్తా. ఎవడైనా ఉంటే అక్కడికి రండి చూసుకుందాం’ అంటూ గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు హరికృష్ణారెడ్డి సవాల్ విసురుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఈక్రమంలో అతడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. దీంతో రాప్తాడు, రామగిరి మండలాల్లో తిరిగి.. టవర్క్లాక్ వద్దకు వచ్చి మీసం మెలేసే వరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. తెదేపా శ్రేణుల్ని ముందుస్తుగా కట్టడి చేసిన పోలీసులు.. హరికృష్ణారెడ్డి, వైకాపా శ్రేణుల్ని స్వేచ్ఛగా వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రేక్షకపాత్ర వహించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
రెచ్చగొడుతూ...
ఓ ప్రజాప్రతినిధి అండతో హరికృష్ణారెడ్డి సోమవారం అనంతపురం చేరుకున్నాడు. ముందుగా రాప్తాడులోని తెదేపా కార్యాలయం వద్దకు వెళ్లి పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో చిత్రీకరించాడు. ఈ సమయంలో ఆయన వెంట రాప్తాడు వైకాపా నాయకులు ఉన్నట్లు వీడియోలో స్పష్టమవుతోంది. రాప్తాడు పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో ఉంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడి నుంచి జాకీ పరిశ్రమకు కేటాయించిన భూముల వద్దకు వెళ్లి హల్చల్ చేశాడు. తర్వాత రామగిరి మండలానికి వెళ్లి ఫొటోలు దిగి వాట్సాప్లో పోస్టు చేశాడు. రాప్తాడు మండలానికి చెందిన వైకాపా నాయకుల కార్లలో ప్రధాన రహదారుల్లోనే హరికృష్ణారెడ్డి ప్రయాణం చేశాడు. టవర్క్లాక్ వద్దకు వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడిన తర్వాత గానీ పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. అంతకుముందే టవర్క్లాక్ వద్దకు వచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. వైకాపా నాయకుడిని జీపులో ఎక్కించుకుని జాగ్రత్తగా జిల్లా సరిహద్దు దాటించారు. అంతకుముందు డీఎస్పీ ప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హరికృష్ణారెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. తరువాత అరగంటకే అతడు వైకాపా శ్రేణులతో కలిసి టవర్క్లాక్ వద్దకు చేరుకోవడం గమనార్హం.
ముందస్తుగా ఫిర్యాదు చేసినా..
సామాజిక మాధ్యమాల వేదికగా అనంతపురం వస్తానని సవాల్ చేయడంపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆదివారం రాత్రి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో పోలీసులు అడ్డుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హరికృష్ణారెడ్డితో పాటు అతని వెంట ఉన్న పది మంది వివరాలు తెదేపా నాయకులు ముందుగానే పోలీసులకు అందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారిని కనుగొనే ప్రయత్నం చేయలేదు. రాప్తాడులో తెదేపా నాయకుల్ని అరెస్టు చేసి.. వైకాపా నాయకుడు టవర్క్లాక్ వద్దకు చేరుకునేందుకు మార్గం సుగుమం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434