ప్రజాసేవకే అంకితమవుతా..
విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన భగవాన్ శ్రీసత్యసాయిబాబా స్ఫూర్తితో తాను ప్రజాసేవకే అంకితమవుతానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ప్రతిజ్ఞ చేశారు.
సత్యసాయి స్ఫూర్తితో కార్యక్రమాలు
ప్రతిజ్ఞ చేసిన యువనేత నారా లోకేశ్
అభివాదం చేస్తూ ..
ఈనాడు డిజిటల్, అనంతపురం, పుట్టపర్తి, గోరంట్ల, న్యూస్టుడే: విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన భగవాన్ శ్రీసత్యసాయిబాబా స్ఫూర్తితో తాను ప్రజాసేవకే అంకితమవుతానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ప్రతిజ్ఞ చేశారు. పాదయాత్రకు బయలుదేరే ముందు విడిది కేంద్రం వద్ద సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. ప్రపంచానికి ప్రేమతత్వం, సేవాభావాన్ని నేర్పించిన భగవానుడు నడయాడిన నేలలో పాదయాత్ర చేయడం ఆనందంగా ఉందన్నారు. యువగళం పాదయాత్ర 51వ రోజు ఆదివారం ఓడీసీ మండలం రామయ్యపేట నుంచి మొదలైంది. కార్యకర్తల సందడి, అభిమానుల కేరింతల నడుమ పుట్టపర్తి నియోజకవర్గంలో రెండో రోజు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పగడాలవారిపల్లిలో భోజన విరామ సమయంలో బీసీలు, యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారికి భరోసా ఇచ్చారు.
పాదయాత్రకు తరలివచ్చిన అభిమానులు
పెనుకొండలోకి ప్రవేశం
గౌనివారిపల్లి వద్ద పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సరిహద్దు వద్ద కార్యకర్తలు తోరణాలు కట్టి, గజమాలతో లోకేశ్కు స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, యువత, అభిమానులను అప్యాయంగా పలకరించి అందరితో ఫొటోలు దిగుతూ యువనేత ముందుకు సాగారు. ఎస్సీలు యువనేతను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ కళాశాలల యజమానులు, ఆటో కార్మికులు, మహిళలు సమస్యలు చెప్పుకొన్నారు.
నేటి వివరాలు..
భారీ గజమాలతో పెనుగొండ నియోజకవర్గానికి లోకేశ్కు స్వాగతం
గోరంట్ల, న్యూస్టుడే: సోమవారం ఉదయం 9.00 గంటలకు కొండాపురం పంచాయతీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం. ఉదయం 9.15 గంటలకు రెడ్డిచెరువుకట్ట వద్ద స్థానికులతో మాటామంతీ, 10.05 చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజిక వర్గీయులతో భేటీ, 11.15 జీనవాండ్లపల్లిలో నాయీబ్రాహ్మణులతో సమావేశం, 12.10 తిప్పరాజుపల్లి వద్ద బోజన విరామం, 2.25 గోరంట్లలో స్థానికులతో సమావేశం, 3.40 గోరంట్లలోని పంచాయతీ బస్టాండు కూడలిలో స్థానికులతో మాటామంతీ, 4.30 గుమ్మయ్యగారిపల్లి వద్ద బహిరంగసభలో లోకేశ్ ప్రసంగం, 6.15 గుమ్మయ్యగారిపల్లికి సమీపంలో ఏర్పాటుచేసిన విడిది కేంద్రంలో బస.
కియా.. విజయం తెచ్చే కిక్..
గౌనివారిపల్లె-కొరెవాండ్లపల్లి మధ్య కియా ప్ల్లాంటు బస్సులో వెళుతున్న ఉద్యోగులతో సెల్ఫీ
సంక్షోభంలో అవకాశాలను సృష్టించడం చంద్రబాబుకే సాధ్యమని లోకేశ్ అన్నారు. లోటు బడ్జెట్లో ఏర్పడిన నవ్యాంధ్రకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోటీపడి మరీ ప్రపంచ ప్రఖ్యాత కార్ల కంపెనీ కియాను సాధించుకొచ్చారన్నారు. కరవు నేల అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడంతో ఇక్కడ తలసరి ఆదాయం గతంతో పోలిస్తే రూ.25 వేలు పెరిగిందన్నారు. యువగళం పాదయ్రాత ఓడీసీ నుంచి గోరంట్ల మార్గంలో సాగుతున్న సమయంలో అటువైపుగా వెళ్తున్న కియా ఉద్యోగుల బస్సును లోకేశ్ గమనించి సెల్ఫీ తీసుకుని ఆనందపడ్డారు. విజయం ఇచ్చే కిక్ ఇలానే ఉంటుందని పేర్కొన్నారు. పాదయాత్రలో నారా లోకేశ్ వెంట మాజీ మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, బీటీ నాయుడు, రాష్ట్ర తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి సవిత, పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారమిచ్చినా.. నిర్లక్ష్యమే అడుగడుగునా..!
[ 27-04-2024]
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. రచ్చ సంగతి దేవుడెరుగు వారు నివాసముంటున్న ప్రాంతాలనూ గాలికొదిలేశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఉమ్మడి అనంత జిల్లాలో 14 సీట్లకుగాను 12 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఇక తమ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని కలలుగన్న ప్రజల ఆశలు ఐదేళ్లుగా నిరాశలయ్యాయి. -
‘అరాచక పాలన అంతం.. కూటమి పంతం’
[ 27-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా, భాజపా జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య పేర్కొన్నారు. -
రూ.50 లక్షలు.. నీళ్ల పాలు
[ 27-04-2024]
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం బుక్కరాయసముద్రం వాసుల పాలిట శాపంగా మారింది. ఈ మేజరు పంచాయతీలో 35 కాలనీల్లో 30 వేల జనాభా ఉంది. -
లోక్సభకు 21... అసెంబ్లీకి 136
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టంలో రెండో ప్రక్రియగా భావించే పరిశీలన సజావుగా ముగిసింది. ఎక్కడా పెద్దగా వివాదాలు, అభ్యంతరాలు చోటు చేసుకోలేదు. చిన్నాచితకా మౌఖిక ఫిర్యాదులు మినహా ఏ సమస్య తలెత్తలేదు. -
నెగ్గేందుకు సిగ్గులేకుండా బరితెగింపు
[ 27-04-2024]
ఓటర్లకు డబ్బు చేరవేసేందుకు అధికార వైకాపా ముందస్తుగా బరితెగించింది. తమ పార్టీ నాయకులపై ఎన్నికల యంత్రాంగం పూర్తి నిఘా ఉంటుందన్న అనుమానంతో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. -
పెద్దలకు తారురోడ్డు.. పేదలకు మోకాలడ్డు!
[ 27-04-2024]
ఇక్కడ కన్పిస్తున్న పై చిత్రంలో పెద్దలు వెళ్లే రాచమార్గం.. దానిపక్కనే పేదలు వెళ్లే దారి ఉంది. నగరంలోని జన్మభూమి రోడ్డు నడిమి వంక నుంచి ప్రారంభమై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసం, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా కోవూరునగర్ ప్రధాన రోడ్డులోకి చేరుతుంది. -
భవన నిర్మాణ కార్మిక జీవనం.. జగన్ పాలనలో ఛిద్రం
[ 27-04-2024]
రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న ఆన్లైన్ ఇసుక విధానంతో భవన నిర్మాణ కుటుంబాలను రోడ్డున పడేసింది. ఐదేళ్ల వైకాపా పాలన వారి బతుకులను ఛిద్రం చేసింది. -
చేనేతలను ఆదుకుంటాం: నిమ్మల కిష్టప్ప
[ 27-04-2024]
తెదేపా చేనేతలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. -
పయ్యావుల కేశవ్ ప్రచారంలో వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు
[ 27-04-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా నాయకులు గొడవలకు తవిచ్చేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరహా చర్యలకు మండలంలోని కాలువపల్లిలో శుక్రవారం వైకాపా కార్యకర్తలు పూనుకున్నారు. -
వైకాపా మోసపూరిత మాటలు నమ్మొద్దు: సునీత
[ 27-04-2024]
గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి ఎంత తప్పుచేశారో మీరే ఆలోచించాలి. ఆ తప్పు మళ్లీ చేయొద్దు. ఒక్క ఛాన్స్ అంటూ మళ్లీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు. -
సొంత చెల్లి చీరపైనా దిగజారుడు మాటలా?
[ 27-04-2024]
ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత చెల్లెలు ధరించిన చీర గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం జగన్ దిగుజారుడు తనానికి పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. -
నిలువ నీడేదీ జగన్?
[ 27-04-2024]
అసలే మండేఎండలు.. పట్టణంలోని బస్టాప్లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు పేరుకు మాత్రమే ఉండగా బస్సులన్నీ పాత బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. -
‘వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడదాం’
[ 27-04-2024]
వైకాపా నాయకులు ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, వారి అరాచక పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, రాయదుర్గం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం..
[ 27-04-2024]
ప్రజల నుంచి పన్ను కట్టించుకొంటున్నారే తప్పా అభివృద్ధి చేయలేకపోయారని, తనకు అవకాశం కల్పిస్తే కళ్యాణదుర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 27-04-2024]
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయనకు పూలమాలవేసి, శాలువాతో ఘనస్వాగతం పలికారు. -
నిండా మునిగినా.. రైతుకు తప్పని నిరీక్షణ
[ 27-04-2024]
తమది రైతు ప్రభుత్వమని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది. -
లోక్సభకు 9, అసెంబ్లీకి 45 నామపత్రాల తిరస్కరణ
[ 27-04-2024]
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా హిందూపురం పార్లమెంటు స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామపత్రాలను అధికారులు పరిశీలన చేశారు. -
28న ఏపీసెట్
[ 27-04-2024]
సహాచార్య ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఏపీ సెట్-2024 ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య వెంకట రమణ తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
[ 27-04-2024]
ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో నిర్వహిస్తున్న 4వ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థిని డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. -
ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-04-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.మోహన్ మురళి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్