మా దురదృష్టం.. ఆర్థిక సంఘం నిధులు పొందలేకున్నాం
‘ఆర్థిక సంఘం నిధులను పొందటం, వార్డులను అభివృద్ధి పరచటం కౌన్సిలర్ల హక్కు. మా దురదృష్టమేమో ఇటీవల ఆర్థిక సంఘం నిధులు పొందలేకున్నాం.
అధికార పార్టీ కౌన్సిలర్ల ఆందోళన
కౌన్సిల్లో మాట్లాడుతున్న సభ్యుడు కల్యాణ్
నేలపై బైఠాయించిన కౌన్సిలర్ దిల్షాద్ఉన్నిసా
కదిరి, న్యూస్టుడే : ‘ఆర్థిక సంఘం నిధులను పొందటం, వార్డులను అభివృద్ధి పరచటం కౌన్సిలర్ల హక్కు. మా దురదృష్టమేమో ఇటీవల ఆర్థిక సంఘం నిధులు పొందలేకున్నాం. వార్డుల అభివృద్ధి చేయలేకున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు.’ అంటూ అధికార పార్టీ ఏడో వార్డు కౌన్సిలర్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కదిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఛైర్పర్సన్ నజిమున్నిసా అధ్యక్షతన నిర్వహించారు. కౌన్సిల్ ఆమోదానికి పెట్టిన అజెండాలోని ఆర్థిక సంఘం నిధులను ముందే చేసిన పనులకు చెల్లించాలన్న ప్రతిపాదనపై కౌన్సిలర్ కల్యాణ్ పై విధంగా స్పందించారు. మున్సిపాలిటీ వార్డుల్లో కౌన్సిలర్లు తలెత్తుకుని తిరిగేలా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. పదో వార్డు కౌన్సిలర్ దిల్షాద్ఉన్నిసా ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి పైపులైను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె నేలపై కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన కమిషనర్ శ్రీహరిబాబు తగిన చర్యలు చేపడతామని తెలిపారు. పురపాలికల్లో లీజు కాలం ముగిసిన దుకాణ గదులకు కాల పరిమితి పెంచాల్సిన అంశాన్ని వాయిదా వేయాలని సభ్యులు కోరారు. చెత్తసేకరణకు ఈ-ఆటోలను కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో వైస్ ఛైర్ పర్సన్ గంగాదేవి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
పన్నులు వసూలు చేస్తారు.. పనులు చేయరు
సమస్యలను వివరిస్తున్న కౌన్సిలర్ పురుషోత్తంరెడ్డి
మాట్లాడుతున్న ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి
ధర్మవరం పట్టణం, న్యూస్టుడే : ‘పన్నుల రూపేణ ధర్మవరం పట్టణంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. కానీ ప్రజలకు కనీస వసతులు కల్పించడం లేదు. ప్రగతి పనులు చేయడంలేదు.’ అంటూ ఇన్ఛార్జి ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, మరి కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేయగా.. పై విధంగా ఆమె స్పందించారు. ‘వార్డు సమస్యలు పరిష్కరించాలని చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఏప్రిల్ 14న సూర్య పాఠశాల వద్ద ప్రమాదకరంగా ఉన్న వంతెన పనులు చేపట్టాలని విన్నవించినా కమిషనర్ మల్లికార్జున, ఇంజినీరింగ్ అధికారులు స్పందించలేదు. సమస్య పరిష్కరించనప్పుడు కౌన్సిల్ సమావేశానికి ఎందుకు రావాలి...? ఇక కౌన్సిల్ సమావేశానికి హాజరుకాను..’ అని కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీటి శుద్ధి కేంద్రాలు అనుమతి లేకుండా సరఫరా చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కోఆప్షన్ సభ్యుడు రామకృష్ణ ఆరోపించారు. వీధి దీపాలు లేక కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారని పలువురు కౌన్సిలర్లు వాపోయారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు విన్నవించడమే కానీ వాటికి పరిష్కారం లభించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో వైస్ఛైర్మన్ నాగరాజు, కౌన్సిలర్లు, అదనపు కమిషనర్ మధుసూదన్రెడ్డి, ఈఈ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం