అతిథుల హాహాకారాలు
సంతానోత్పత్తికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా నుంచి చిలమత్తూరు మండలం వీరాపురం వచ్చిన పక్షులకు ఆహారం దొరకడం గగనంగా మారింది.
వట్టిపోయిన చెరువులు
రోజూ వందల కిలోమీటర్లు తిరిగినా లభించని ఆహారం
ఎండిన చెట్టుపై విదేశీ పక్షులు
హిందూపురం అర్బన్, చిలమత్తూరు, న్యూస్టుడే: సంతానోత్పత్తికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా నుంచి చిలమత్తూరు మండలం వీరాపురం వచ్చిన పక్షులకు ఆహారం దొరకడం గగనంగా మారింది. గడిచిన ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులతో ఒక్క చెరవుకు నీరు చేరలేదు. దీంతో పరిసరాల్లో చెరువులన్నీ ఎండి పోయాయి. రోజూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించినా ఆహారం (చేపలు) దొరకక హాహాకారాలు చేస్తున్నాయి. కనీసం చిన్నపిల్ల పక్షుల గొంతు తడిపేందుకైనా సమీప ప్రాంతాల్లో నీరులేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఎండల దాటికి నీరులేక పిల్ల పక్షులు కింద పడి చనిపోతున్నాయి. దాదాపు నెల రోజులుగా పక్షులు ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నా కనీస సంరక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పక్షులు గుడ్లు పొదిగేందుకు గూళ్లు ఏర్పాటు చేయకపోయినా కనీసం చెరువుల్లో బోర్లు వేసి నీటి సౌకర్యం కల్పించటం, సమీపంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేసి అందులో నీటిని నిల్వచేయటం, రోజూ ఇతర ప్రాంతాల నుంచి చేపలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే ఇవి అహారంగా తీసుకొంటాయి. గ్రామంలో ఉన్నచెట్లు అంతరించి పోతుంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఒక్క మొక్కైనా పెంచకపోవటం వీటి సంక్షణకు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో అర్థమవుతోంది. దీనిపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా వీరి బాధలు పట్టించుకొన్న నాథుడే లేడు.
పచ్చదనం తరిగిపోతోందని ఆందోళన
గ్రామ సమీపంలో చెట్లు నరికివేస్తుండంతో పచ్చదనం తరిగిపోతోందని పర్యావరణ పరిరక్షణ నాయకుడు భాస్కరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కొట్టేసేందుకు అధికారులు అనుమతించటమే కాకుండా అనధికారికంగా నరికేస్తున్నారని ఫిర్యాదు చేసినా అటవీ అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రాంతంలో పచ్చదనం కనుమరుగయ్యే అవకాశాలున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వట్టిపోయిన చెరువులో సైబీరియా పక్షులు
నీటి సదుపాయం కల్పించాలి
పిల్ల పక్షులకు పెద్దవి నీరు అందించాలన్నా సమీప ప్రాంతాల్లో అందుబాటులో లేవు. అందువల్ల ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు వెంటనే బోర్లు తవ్వి కుంటలు ఏర్పాటు చేసి అందులోకి నీటిని వదిలితే వెంటనే చిన్న పిల్ల పక్షులకు నీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రామంలో ఉన్న చెట్లు దెబ్బతిని ఎండిపోతున్నాయి. అందువల్ల గ్రామంలో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో మొక్కలు పెంచితే అవి భవిష్యత్తులో చెట్లుగా పెరిగి ఈ పక్షులకు ఆవాసంగా మారే అవకాశం కలుగుతుంది.
శివారెడ్డి, వీరాపురం, చిలమత్తూరు మండలం
సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం..
సైబీరియా నుంచి పక్షులు ఇక్కడికి కొన్ని వందల సంవత్సరాలనుంచి వస్తుండటంతో ఈ గ్రామానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం వీటికి నీరు, ఆహారం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు వీటికి సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో ఘోరంగా విఫలమయ్యారు. వెంటనే చర్యలు తీసుకొని నీరు, ఆహారం ఏర్పాటు చేయాలి. లేదంటే వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద సుప్రీం కోర్టునైనా ఆశ్రయిస్తాం.
ఆచార్య భాస్కర్నాయుడు, పర్యావరణ పరిరక్షణ వేత్త
తగిన చర్యలు తీసుకుంటాం
ఎక్కడినుంచో ఈ ప్రాంతాన్ని నమ్ముకొని వస్తున్న పక్షులకు నీరు, ఆహారం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకొంటాం. గత సంవత్సరం ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం. కిందపడిన చిన్న పక్షులకు అన్నివిధాలా సంరక్షణ చర్యలు తీసుకొంటున్నాం. గ్రామస్థులు సొంతబిడ్డల వలే ఈ పక్షులను చూస్తున్నారు.
అక్బర్, అటవీశాఖ అధికారి, హిందూపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారమిచ్చినా.. నిర్లక్ష్యమే అడుగడుగునా..!
[ 27-04-2024]
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. రచ్చ సంగతి దేవుడెరుగు వారు నివాసముంటున్న ప్రాంతాలనూ గాలికొదిలేశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఉమ్మడి అనంత జిల్లాలో 14 సీట్లకుగాను 12 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఇక తమ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని కలలుగన్న ప్రజల ఆశలు ఐదేళ్లుగా నిరాశలయ్యాయి. -
‘అరాచక పాలన అంతం.. కూటమి పంతం’
[ 27-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా, భాజపా జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య పేర్కొన్నారు. -
రూ.50 లక్షలు.. నీళ్ల పాలు
[ 27-04-2024]
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం బుక్కరాయసముద్రం వాసుల పాలిట శాపంగా మారింది. ఈ మేజరు పంచాయతీలో 35 కాలనీల్లో 30 వేల జనాభా ఉంది. -
లోక్సభకు 21... అసెంబ్లీకి 136
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టంలో రెండో ప్రక్రియగా భావించే పరిశీలన సజావుగా ముగిసింది. ఎక్కడా పెద్దగా వివాదాలు, అభ్యంతరాలు చోటు చేసుకోలేదు. చిన్నాచితకా మౌఖిక ఫిర్యాదులు మినహా ఏ సమస్య తలెత్తలేదు. -
నెగ్గేందుకు సిగ్గులేకుండా బరితెగింపు
[ 27-04-2024]
ఓటర్లకు డబ్బు చేరవేసేందుకు అధికార వైకాపా ముందస్తుగా బరితెగించింది. తమ పార్టీ నాయకులపై ఎన్నికల యంత్రాంగం పూర్తి నిఘా ఉంటుందన్న అనుమానంతో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. -
పెద్దలకు తారురోడ్డు.. పేదలకు మోకాలడ్డు!
[ 27-04-2024]
ఇక్కడ కన్పిస్తున్న పై చిత్రంలో పెద్దలు వెళ్లే రాచమార్గం.. దానిపక్కనే పేదలు వెళ్లే దారి ఉంది. నగరంలోని జన్మభూమి రోడ్డు నడిమి వంక నుంచి ప్రారంభమై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసం, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా కోవూరునగర్ ప్రధాన రోడ్డులోకి చేరుతుంది. -
భవన నిర్మాణ కార్మిక జీవనం.. జగన్ పాలనలో ఛిద్రం
[ 27-04-2024]
రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న ఆన్లైన్ ఇసుక విధానంతో భవన నిర్మాణ కుటుంబాలను రోడ్డున పడేసింది. ఐదేళ్ల వైకాపా పాలన వారి బతుకులను ఛిద్రం చేసింది. -
చేనేతలను ఆదుకుంటాం: నిమ్మల కిష్టప్ప
[ 27-04-2024]
తెదేపా చేనేతలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. -
పయ్యావుల కేశవ్ ప్రచారంలో వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు
[ 27-04-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా నాయకులు గొడవలకు తవిచ్చేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరహా చర్యలకు మండలంలోని కాలువపల్లిలో శుక్రవారం వైకాపా కార్యకర్తలు పూనుకున్నారు. -
వైకాపా మోసపూరిత మాటలు నమ్మొద్దు: సునీత
[ 27-04-2024]
గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి ఎంత తప్పుచేశారో మీరే ఆలోచించాలి. ఆ తప్పు మళ్లీ చేయొద్దు. ఒక్క ఛాన్స్ అంటూ మళ్లీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు. -
సొంత చెల్లి చీరపైనా దిగజారుడు మాటలా?
[ 27-04-2024]
ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత చెల్లెలు ధరించిన చీర గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం జగన్ దిగుజారుడు తనానికి పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. -
నిలువ నీడేదీ జగన్?
[ 27-04-2024]
అసలే మండేఎండలు.. పట్టణంలోని బస్టాప్లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు పేరుకు మాత్రమే ఉండగా బస్సులన్నీ పాత బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. -
‘వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడదాం’
[ 27-04-2024]
వైకాపా నాయకులు ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, వారి అరాచక పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, రాయదుర్గం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం..
[ 27-04-2024]
ప్రజల నుంచి పన్ను కట్టించుకొంటున్నారే తప్పా అభివృద్ధి చేయలేకపోయారని, తనకు అవకాశం కల్పిస్తే కళ్యాణదుర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 27-04-2024]
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయనకు పూలమాలవేసి, శాలువాతో ఘనస్వాగతం పలికారు. -
నిండా మునిగినా.. రైతుకు తప్పని నిరీక్షణ
[ 27-04-2024]
తమది రైతు ప్రభుత్వమని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది. -
లోక్సభకు 9, అసెంబ్లీకి 45 నామపత్రాల తిరస్కరణ
[ 27-04-2024]
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా హిందూపురం పార్లమెంటు స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామపత్రాలను అధికారులు పరిశీలన చేశారు. -
28న ఏపీసెట్
[ 27-04-2024]
సహాచార్య ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఏపీ సెట్-2024 ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య వెంకట రమణ తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
[ 27-04-2024]
ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో నిర్వహిస్తున్న 4వ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థిని డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. -
ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-04-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.మోహన్ మురళి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..