logo

ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక గ్రామ వాలంటీర్లు శివయ్య, రమేశ్‌, మహబూబ్‌ బాషాలను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఎంపీడీవో విజయలలిత ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 28 Mar 2024 04:43 IST

వజ్రకరూరు, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక గ్రామ వాలంటీర్లు శివయ్య, రమేశ్‌, మహబూబ్‌ బాషాలను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఎంపీడీవో విజయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రచార బాటలో ఎంఎల్‌ఓలు’ శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమవ్వడంతో ఎంపీడీఓ విజయలలిత, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌ స్పందించి విచారణ జరిపి పైవిధంగా చర్యలు తీసుకున్నారు. ఎంఎల్‌ఓల విషయం తమ పరిధిలోకి రాదని, దానిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని ఎంపీడీవో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని