సైకో పాలనలో సర్వం నష్టం
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
అధికారంలోకొస్తే 90 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాలిస్తాం
ప్రసంగిస్తున్న చంద్రబాబు, చిత్రంలో అంబిక, కాలవ
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం పట్టణం: ‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కణేకల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకొనే జగన్.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ‘తెదేపా హయాంలోనే రూ.4,500 కోట్లు ఖర్చుపెట్టి హంద్రీనీవా ప్రారంభించాం. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీ నీరు వస్తోంది. హెచ్చెల్సీ ఆధునికీకరణ కోసం కర్ణాటక వెళ్లి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించింది తెదేపానే. పనులు కూడా మేమే ప్రారంభించాం. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించింది. ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. భైరవానితిప్ప, ఉంతకల్లు ప్రాజెక్టులపై ఇచ్చిన హామీలను సీఎం జగన్ తుంగలో తొక్కారు. ఆఖరుకు తాగడానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితిలో జగన్ ప్రభుత్వం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
అన్నీ పక్కనపెట్టేశారు
‘రాయదుర్గంలో కరవు విపరీతంగా ఉండటంతో భైరవానితిప్ప ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. జీడిపల్లి నుంచి భైరవానితిప్పకు కృష్ణా జలాలు తరలించడం కోసం రూ.962 కోట్లతో పనులు ప్రారంభించాం. టెండర్ ఇచ్చి 12 కిలోమీటర్ల మేర కాలువలు పూర్తి చేశాం. 2019లో తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే ఒక సంవత్సరంలోనే భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చేవాళ్లం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్క అంగుళం కూడా పని జరగలేదు. ఉంతకల్లు ప్రాజెక్టుకు రూ.4.5 కోట్లు ఖర్చు పెట్టాం. రూ.1,180 కోట్లతో పూర్తి చేయాలని ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి పనులు ప్రారంభిస్తే వైకాపా అధికారంలోకి వచ్చి పక్కనపెట్టారు. తెదేపా అంటే అభివృద్ధి.. వైకాపా అంటే విధ్వంసం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున.. వైకాపా దొంగలు ఓట్లు అడగడానికి వస్తారు. చొక్కా పట్టుకుని నిలదీయండి. ఎందుకు అభివృద్ధి చేయలేదో ప్రశ్నించండి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కణేకల్లు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు
సామాజిక న్యాయం అంటే ఇదేనా?
‘రాయలసీమలో తెదేపా బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చింది? వైకాపా ఎన్ని సీట్లు ఇచ్చిందో చర్చకు సిద్ధమా? ఉమ్మడి అనంతపురంలో తెదేపా బీసీలకు పెద్దపీట వేసింది. అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథికి ఎంపీ టికెట్లు ఇచ్చాం. రాయదుర్గంలో బోయ సామాజికవర్గానికి చెందిన కాలవ శ్రీనివాసులుకు అవకాశం కల్పించాం. మదనపల్లి, నంద్యాలలో ముస్లింలకు టికెట్లు ఇచ్చాం. ఇలా రాయలసీమలో జనాభాకు అనుగుణంగా దామాషా ప్రకారం బీసీలకు పెద్దపీట వేశాం. జగన్ మాత్రం రాయలసీమలో సొంత సామాజికవర్గానికే అత్యధిక సీట్లు కేటాయించారు. ఇదేనా సామాజిక న్యాయం’ అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కేవలం తెదేపాకే ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాప్తాడు నుంచే మార్పు మొదలు: సునీత
[ 03-05-2024]
ప్రజలంతా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ మార్పు రాప్తాడు నియోజకవర్గం నుంచే మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
ఎంత పని చేశావమ్మా?
[ 03-05-2024]
మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామంలో ఓ తల్లి బిడ్డకు విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
అక్షరాలా మాట తప్పి.. నిస్సిగ్గుగా మడమ తిప్పి
[ 03-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అని ఊదరగొట్టి ప్రజలను మోసం చేసిన జగన్.. నిత్యం ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే రక్షకభటులకు అరచేతిలో స్వర్గం చూపించాడు. -
ఉన్నాయా కళ్లు.. ఏంచేశారు.. ఐదేళ్లు?
[ 03-05-2024]
నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల ప్రభుత్వమని సీఎం జగన్ గొప్పలు చెబుతారు. అలాంటి ఆర్భాటపు ముఖ్యమంత్రి నోరు మూయించే చిత్రమిది. -
మడకశిరలో తెదేపాదే విజయం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నామని, మడకశిర అభ్యర్థి ఎంఎస్ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తెలిపారు. -
ప్రచార లోపం.. ఓటెక్కడ వేయాలో గందరగోళం
[ 03-05-2024]
జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం ఫాం-12 దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 16,150 మంది ఉద్యోగులను నియమించారు. -
వంద పడకలన్నారు.. హామీతో సరిపెట్టారు..
[ 03-05-2024]
ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులను మంచాల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒకదానిపైనే ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్