అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వడిగేపల్లి ప్రచారంలో ప్రసంగిస్తున్న సవిత
గోరంట్ల, న్యూస్టుడే: మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందజేస్తామన్నారు. మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రచారం సాగింది. మండల కన్వీనర్ సోమశేఖర్, రెండు పంచాయతీల నాయకులు మనోహర్, జయచంద్ర, మూర్తి, సర్పంచి నరసింహమూర్తి, చంద్రశేఖర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. చివరిలో దేవులచెరువులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.
సోమందేపల్లి : సోమందేపల్లి, మాగేచెరువు పంచాయతీ కొత్తపల్లిలో చేనేత నాయకుడు సీసీ హరి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణ, సర్పంచి నరసింహులు ప్రచారం చేశారు.
పరిగి : విట్టాపల్లిలో తెదేపా మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.హనుమయ్య, నాగరాజు, బలరాం, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రొళ్ల: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతలకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు పింఛను అందిస్తామని రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎంఎస్ రాజు తెలిపారు. శనివారం రొళ్ల మండలంలోని హులికుంట, గుడ్డుగుర్కి, దొడ్డేరి, కాకి, రత్నగిరి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత ఎంఎస్ రాజు పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర టీఎన్టీయూ కార్యదర్శి గురుమూర్తి, వక్కలిగ సాధికార కన్వీనర్ పాండురంగప్ప, కన్వీనర్ దాసిరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, ఆనంద్, పాండురంగప్ప, రాజకుమార్, మూర్తి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : మద్దనకుంటలో తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మద్దనకుంటకు చెందిన ఈరక్యాతప్ప, హనుమంతరాయప్ప, ఈరన్న, నాగరాజు తదితరులు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. అగళి : మండలంలోని అగళి, ఎంఎం.పాళ్యం గ్రామాల్లో ఎంఎస్ రాజు సతీమణి ఉమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు ఉమేశ్ తెదేపా తరఫున ప్రచారం చేశారు.
హిందూపురం అర్బన్ : ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీకే పార్థసారథికి ఓట్లు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ చంద్రమోహన్ యాదవ్, బూత్ఇన్ఛార్జి రామిరెడ్డి, మిథిలేశ్, సుధాకర్రెడ్డిలు కోరారు. శనివారం పురపాలక సంఘం పరిధిలోని మోతుకపల్లిలో వీరు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చి పథకాలు తీసుకొచ్చారన్నారు.
కేక్ కోసి రాజుకు తినిపిస్తున్న వక్కలిగ సాధికార కన్వీనర్ పాండురంగప్ప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
[ 18-05-2024]
‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
[ 18-05-2024]
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?
[ 18-05-2024]
ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. -
అంతా.. నిశ్శబ్దం
[ 18-05-2024]
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తాడిపత్రిలో నిశబ్ద వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణ వాసులకు వైకాపా మూకల అరాచక పర్వాన్ని గుర్తు చేసుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. -
ఉత్తర మండలాల్లో మోస్తరు వర్షం
[ 18-05-2024]
జిల్లాలోని ఉత్తర మండలాల్లో గురువారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. డి.హీరేహాళ్ మండలంలో 28.8 మి.మీలు అత్యధికంగా వర్షం కురిసింది. -
ఓటర్ల ఓపికకు పరీక్ష
[ 18-05-2024]
సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. -
విద్యుత్తు నియంత్రికల మంజూరులో కీలక అధికారి తీరే వేరప్పా..
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లా విద్యుత్తుశాఖలో ఓ కీలక అధికారి అధికార పార్టీ తొత్తుగా మారిపోయారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే చాలు.. వెంటనే విద్యుత్తు నియంత్రికలు మంజూరు చేసి తన విధేయతను చాటుకుంటున్నారు.రెండేళ్లలో 300 పైగా 25కేవీ సామర్థ్యంగల నియంత్రికలు మంజూరు చేశారంటే ఆయన వైకాపా నేతలతో ఎంత అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. -
బీఎల్ఓలకు రిక్తహస్తం!
[ 18-05-2024]
బూత్ స్థాయి అధికారులపై(బీఎల్ఓ) ఎన్నికల అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. పని చేయించుకుని పైసా పారితోషకం ఇవ్వడం లేదు. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఇంటింటా సర్వే.. ఇలా అనేక కీలక పనులు చేస్తున్న బీఎల్ఓల పట్ల కనికరం చూపడం లేదు. -
అవసరమైతేనే సిజేరియన్ చేయండి
[ 18-05-2024]
పలు ఆసుపత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని, అవసరమైతే తప్ప చేయకూడదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సిజేరియన్ ద్వారా ఎక్కువ ఆపరేషన్లు చేసిన డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. -
‘తాడిపత్రిలో అల్లర్లకు ఆజ్యం పోసింది వైకాపా ఎమ్మెల్యేలే’
[ 18-05-2024]
తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ముఖ్య కారణమని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆరోపించారు. -
తాగునీటి సరఫరా అధ్వానం.. ఎటు చూసినా అపరిశుభ్రం
[ 18-05-2024]
ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
[ 18-05-2024]
ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు రాజు (27) ముదిగుబ్బకు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. అతనికి ఐదేళ్ల కిందట వివాహమైంది. -
రేషన్ పంపిణీకి నేడు ఆఖరు
[ 18-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు. -
చెన్నకేశవుడి రాజసం
[ 18-05-2024]
పట్టణంలో జరుగుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి సింహ వాహనంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. -
భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!
[ 18-05-2024]
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. -
ఇదేంది సారూ.. పారితోషికంలో తేడాలా?
[ 18-05-2024]
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకే ఉందని, వారిని తప్పించి, ఇతరులతో ఈ ప్రక్రియను నిర్వహిస్తే అస్తవ్యస్తమవుతుందని, వారు మాత్రమే కచ్చితంగా నిర్వహించగలరని ఎన్నికల సంఘం కితాబు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు