logo

కలిసి పనిచేయండి.. విజయం సాధించండి

అనంత నగరం ఆర్‌.కన్వెన్షన్‌ హాలులో సోమవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

Published : 07 May 2024 05:35 IST

సోమవారం ఉదయం కర్నూలు జిల్లాకు వెళ్తూ విడిది కేంద్రం వద్ద అభిమానులకు అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు): అనంత నగరం ఆర్‌.కన్వెన్షన్‌ హాలులో సోమవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బొకేలు, పుష్పగుచ్ఛాలు అందించేందుకు వేచి చూశారు. ముఖ్య నాయకులను మాత్రమే చంద్రబాబు కలిశారు. ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేయండి. భారీ మెజారిటీతో విజయం సాధించాలని సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అనంతరం చంద్రబాబు బస్సు దిగి, కారెక్కి వెళ్లిపోయారు. ప్రసన్నాయపల్లికి హెలీకాఫ్టర్‌లో నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభకు వెళ్లిపోయారు. బస్సులో ప్రత్యేకంగా మాట్లడిన వారిలో తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌, దగ్గుపాటి శ్రీలక్ష్మి, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జకీవుల్లా, శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని