ఓటేసేందుకు వెళ్లారని సచివాలయ సిబ్బందికి వేధింపులు
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్లిన ఏడుగురు సచివాలయ సిబ్బందిని మండల పరిషత్ అధికారులను వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది.
రామకుప్పం, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్లిన ఏడుగురు సచివాలయ సిబ్బందిని మండల పరిషత్ అధికారులను వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. రామకుప్పం మండలం నారాయణపురం, ముద్దనపల్లి, వీర్ణమల, మణేంద్రం, బందార్లపల్లె సచివాలయాల్లో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బంది కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓటేసేందుకు సోమవారం వెళ్లారు. అదే సమయంలో ఈవోపీఆర్డీ రాధాకృష్ణ సచివాలయ పరిశీలనకు రాగా తాళం వేసి కనిపించాయి. వెంటనే సిబ్బందికి ఫోన్ చేసి ఓటేసేందుకు వెళ్లామని చెబుతున్నా వినకుండా మంగళవారం మండల కార్యాలయానికి రావాలని సూచించారు. వీరంతా ఉదయం కార్యాలయానికి వెళ్లగా ఈవోపీఆర్డీ ఛాంబర్లో సిబ్బందిని రెండు గంటల పాటు నిలబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు ఎంపీడీవో దగ్గర అనుమతి తీసుకున్నామని చెబుతున్నా వినిపించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై ఈవోపీఆర్డీ వివరణ కోరగా అలాంటిదేమి లేదని దాటవేశారు. ఎంపీడీవో ఈశ్వరన్ను వివరణ కోరగా ఓటు హక్కు వినియోగంచుకోవడానికి తామే అనుమతి ఇచ్చామన్నారు. అయితే సిబ్బంది కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లారని.. పనిదినాల్లో ఇలా చేయడం తప్పన్నారు. ఆమేరకు పిలిచి మందలించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేణిగుంట సమీపంలో ప్రైవేట్ బస్సుకు మంటలు
[ 19-05-2024]
తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనుకోని ప్రమాదంలో మంటల్లో చిక్కుకుంది. -
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
[ 19-05-2024]
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
[ 19-05-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం. -
ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం
[ 19-05-2024]
జిలాలో జరిగిన హింసాత్మక ఘటనలను తీవ్రంగా తీసుకున్న ఎన్నికల సంఘం శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. -
తీపెక్కిన మామిడి
[ 19-05-2024]
బంగారుపాళ్యం మార్కెట్యార్డులో మామిడి కాయల సీజన్ ప్రారంభమైంది. -
228 మందికి షోకాజ్ నోటీసులు
[ 19-05-2024]
ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ షన్మోహన్.. 228 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
నీరు కావాలంటే.. కొనాల్సిందే
[ 19-05-2024]
మనిషి జీవన ప్రయాణంలో నీటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోవాల్సి వస్తోంది. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి
[ 19-05-2024]
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తితే పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. -
వైకాపా నేతల మెడకు బిగుసుకోనున్న ఉచ్చు!
[ 19-05-2024]
పోలింగ్ రోజు, తర్వాత జరిగిన ఘటనలకు వైకాపా నేతలే ప్రధాన కారణమని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న మురుగు
[ 19-05-2024]
తిరుమలలో కొద్దిపాటి వర్షానికే మురుగు పొంగిపొర్లుతోంది. -
తెలంగాణ ఫలితాల్లో వెంగమాంబాపురం విద్యార్థి ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏడో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబాపురానికి చెందిన వడ్లపూడి ముకేష్ చౌదరి. -
కారుపై మాత్రమే దాడి చేశారు: భానుకుమార్రెడ్డి భార్య రాణి
[ 19-05-2024]
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై మాత్రమే దాడి జరిగిందని రామచంద్రాపురం మండల జడ్పీటీసీ సభ్యురాలు దిల్లీరాణి పేర్కొన్నారు. -
నగరవాసులే ముందంజ
[ 19-05-2024]
చిత్తూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. -
అశ్వవాహనంపై శ్రీసదాశివేశ్వరుడి విహారం
[ 19-05-2024]
పట్టణంలోని శ్రీ కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు శ్రీకామాక్షీ దేవి సమేతుడైన శ్రీసదాశివేశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
‘ఈ ఎన్నికల్లో గెలిచేది తెదేపా కూటమే’
[ 19-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్ పేర్కొన్నారు. -
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై మొదలైన విచారణ
[ 19-05-2024]
జడ్పీలో గతంలో బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతేడాది లోకాయుక్తకు పలువురు పూర్వ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్ కలలు కంటున్నారు
[ 19-05-2024]
సీఎం జగన్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఆయన కల నెరవేరే పరిస్థితి లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు. -
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 19-05-2024]
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది.