చేర్చుకుని..నిర్ణయం మార్చుకుని..
ఏపీ పీజీసెట్ రాయకుండా విశ్వవిద్యాలయాల్లో తక్షణ(స్పాట్) ప్రవేశాల్లో సీటు పొందిన పీజీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాధారణ కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పీజీ క్యాంపస్లు, పీజీ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులో సీట్లు మిగిలిపోయాయి. వాటి భర్తీకి ఏపీ ఉన్నత విద్యా మం
నన్నయ వర్సిటీ
న్యూస్టుడే, నన్నయ విశ్వవిద్యాలయం(రాజానగరం) : ఏపీ పీజీసెట్ రాయకుండా విశ్వవిద్యాలయాల్లో తక్షణ(స్పాట్) ప్రవేశాల్లో సీటు పొందిన పీజీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాధారణ కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పీజీ క్యాంపస్లు, పీజీ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులో సీట్లు మిగిలిపోయాయి. వాటి భర్తీకి ఏపీ ఉన్నత విద్యా మండలి గత నెల 4న తక్షణ ప్రవేశాలకు ప్రకటన ఇచ్చింది. దానిని అనుసరించి నన్నయ విశ్వవిద్యాలయం ఆ నెల 11న నోటిఫికేషన్ జారీ చేసింది. పీజీ సెట్ రాసిన, రాయని అభ్యర్థులు హాజరు కావొచ్చని అందులో పేర్కొన్నారు. ఆ మేరకు ఏప్రిల్ 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించారు. వీరిలో సెట్ రాయని వారు వర్సిటీలో 85 మంది వరకు ప్రవేశాలు పొందారు. పీజీ సెంటర్లలో మరికొందరు ఉన్నారు. ఈ నెల అయిదో తేదీ వరకు తరగతులకు హాజరయ్యారు. ఇంతలో పీజీ సెట్ రాయని వారికి సీట్లు కేటాయించవద్దని, వారు ప్రవేశాలకు అర్హులు కాదని ఏపీ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆ విద్యార్థుల ప్రవేశాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు.
ఇప్పుడు ఏం చేయాలి..?
వర్సిటీలో నిర్వహించిన కౌన్సెలింగ్లో పీజీ సెట్ రాయని పలువురు విద్యార్థులు సీట్లు పొందారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యా సంవత్సరం కోల్పోతున్నామని, ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకూ ఈ నెల రెండో తేదీ నాటికి సమయం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్య రుసుంతో ప్రవేశం పొందాలంటే మే 2 నుంచి రోజుకు రెండు వేలు చెల్లించవలసి ఉందని అంత సొమ్ము ఎలా కట్టగలమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జూన్ నెలాఖరున మొదటి సెమిస్టర్ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికీ ప్రవేశాల గురించి తేలని పరిస్థితిలో పరీక్షలు ఎలా రాయగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెట్ రాయలేకపోయా..
ఏపీ పీజీ సెట్ రాసేందుకు ఫీజు కట్టా. అనివార్య కారణాల వల్ల పరీక్షకు హాజరుకాలేక పోయా. ఏటా సెట్ రాయని వారికి సైతం తక్షణ ప్రవేశాల సమయంలో సీట్లు ఇచ్చారు. ఈ ఏడాది సైతం అలాగే ఇచ్చారని, విద్యా సంవత్సరం వృథా కాదని సంతోషించా. సీట్లు ఇచ్చి విద్యాభ్యాసం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి. - చంద్రశేఖర్
విద్యా సంవత్సరం వృథా కానివ్వొద్దు
ఎంతో ఆశతో పీజీ కోర్సులో చేరాం. ఇప్పుడు ప్రవేశాలు రద్దు చేస్తామనే ప్రభుత్వం నిర్ణయం వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు. ఎంతో విలువైన ఒక విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. - రాధాకృష్ణ
అనుమతి కోసం లేఖ రాశాం
తక్షణ ప్రవేశాల్లో పీజీసెట్ రాయని వారికి సైతం సీట్లు కేటాయించే విధంగా అనుమతి ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఉన్నతా విద్యామండలికి లేఖ రాశాం. దీనివల్ల విద్యార్థులకు మేలు జరగడంతోపాటు విశ్వవిద్యాలయాలు, పీజీ కళాశాలల్లో సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉండదు. - ఆచార్య టి.అశోక్, రిజిస్ట్రార్, నన్నయ విశ్వవిద్యాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం