లారీలతో తొక్కిపడేశారు..
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు.
నేటి నుంచి ఒకవైపే రాకపోకలు
బేరింగ్ అమరిక పనుల కోసం ఒకవైపు రాకపోకలకు ఏర్పాట్లు
కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. ఎన్నికల సమయంలో కూడా అదే ధోరణి కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించడంతో పాటు గోదావరిపై వంతెనలకు చేటు తెచ్చేలా తవ్వకాలు జరుగుతున్నాయి. గామన్ వంతెన సమీపంలో కాతేరు, కొవ్వూరు వైపు, రోడ్కం రైలు వంతెన సమీప ర్యాంపుల్లో రాత్రివేళల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం వంతెనపై పడుతోంది. నెలక్రితం ఓవైపు బేరింగ్ కుంగడంతో పనులు చేపట్టారు. ఇప్పుడు రెండోవైపు బేరింగ్ కుంగినట్లు గుర్తించారు.
గామన్ వంతెన సమీపంలోని గోదావరి ఒడ్డున డ్రెడ్జింగ్ వ్యవస్థ, యంత్రాలు
ఇప్పుడేం చేస్తారంటే..
రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వచ్చే వరుసలో 28వ స్తంభం వద్ద రాపిడి (ఫ్రిక్షన్) సరిగా లేదని గుర్తించడంతో ఆ బేరింగ్ను మార్చాలని నిపుణులు సూచించారు. దాన్ని మార్చేందుకు పాత్ ఇండియా సంస్థ (టోల్ప్లాజా నిర్వాహక సంస్థ) సిద్ధమైంది. ఆర్డీసీ అధికారులు పర్యవేక్షణలో ఈ పనుల కోసం శుక్రవారం నుంచి ఆ లైనులో రాకపోకలను నిషేధించడంతో మళ్లీ ఓ వైపు రాకపోకలు తప్పవు.
మొన్నటి వరకు ఇలా...
గామన్ వంతెనపై 52వ యాక్షన్ జాయింట్ వద్ద వాహనాలు తిరిగే క్రమంలో బేరింగ్ కుంగింది. అంగుళంన్నర మేర ఆ బ్లాక్ కిందికి దిగబడింది. దీంతో రాజమహేంద్రవరం వెళ్లే వైపు రెండు లైన్ల మార్గాన్ని నిలిపివేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వచ్చే రెండో లైనులో ప్రయాణాలకు అనుమతించారు. నెలపాటు రాకపోకలను ఆపి బేరింగ్లు మార్చారు. పనులు పూర్తవ్వడంతో ఈనెల 23న రెండువైపులా రాకపోకలు పునరుద్ధరించారు. అయితే మరోవైపు స్పాన్లు ఎలా ఉన్నాయో తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు.
వంతెన సమీపంలోనే తవ్వకాలు
ఓపెన్ ర్యాంపుల్లో బోట్స్మెన్ సొసైటీల పేరుతో జిల్లా పరిధిలో 25 ర్యాంపుల్లో దందా నడిచింది. డీసిల్టేషన్ ర్యాంపుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా వంతెనలకు సమీపంలో యంత్రాలతో తవ్వుతున్నారు. గతంలో రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనుల శాఖ అధికారులు దాడులు చేసేవారు. వాహనాలు సీజ్ చేసి, భారీగా జరిమానాలు విధించేవారు. ఇపుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. దీనికి తోడు అనుమతికి మించి భారీ వాహనాల రాకపోకలు కూడా వంతెన ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 50 టన్నుల లోపు వాహనాలనే అనుమతిస్తున్నారు. భూపాల్ నుంచి 16 అదనపు బేరింగులను తెప్పించడంతో 10 రోజుల్లోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. -
కాకినాడను ‘మరో పులివెందుల’ చేస్తారా?
[ 05-05-2024]
కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. -
అయిదేళ్లూ.. మద్యం ఏరులై పారించారు..
[ 05-05-2024]
ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్రెడ్డి ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు. -
అధికార పార్టీకి డీఎస్పీ దన్ను..!
[ 05-05-2024]
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు. -
కూటమి విజయం అవసరం: పురందేశ్వరి
[ 05-05-2024]
ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కూటమి విజయం అవసరమని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
వరద బాధితులకు కుచ్చుటోపీ
[ 05-05-2024]
‘‘2022 జులై 26న గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలైన ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటించారు. -
విజయ శంఖారావం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ‘విజయ శంఖారావం’ సభకు రాజమహేంద్రవరంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. -
తెదేపాతోనే బీసీలకు స్వాతంత్య్రం
[ 05-05-2024]
రాష్ట్రంలోని బీసీలకు తెదేపా ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. -
ఓటేద్దాం.. అవినీతిపరులపై వేటు వేద్దాం
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ఈఓ వాసుదేవరావు కోరారు. -
పోస్టల్ బ్యాలెట్ @ 18,715
[ 05-05-2024]
ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈనెల 8వ తేదీ వరకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జె.నివాస్ తెలిపారు. -
మామిడి రారాజు... వైకాపా తీరుతో బేజారు
[ 05-05-2024]
ఫలాల్లో మామిడి రారాజే అయినా వాటిని సాగుచేసే రైతులకు సర్కారు తీరుతో తిప్పలు తప్పడం లేదు. -
బీమా.. జగన్ డ్రామా..!
[ 05-05-2024]
ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. -
శిరోముండనం కేసుపై అప్పీలుకు వెళ్లాలి
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్ చేశారు. -
నేడు తునిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
[ 05-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్ తునిలో ఆదివారం నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన, తెదేపా, భాజపా నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైకాపా ఎమ్మెల్యే స్టేటస్ పెట్టిన యువకుడు.. చంపుతామని బెదిరించిన అనుచరులు
[ 05-05-2024]
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపైనే చరవాణిలో స్టేటస్ పెడతావా అంటూ వైకాపా వర్గీయుడు జనసేనకు చెందిన ఒక యువకుడిపై దాడికి దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని గొడ్డలితో నరికిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!