బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది.
ఏజెంట్లను పెంచుకునేందుకు అధికారపక్షం వ్యూహం
స్వతంత్ర అభ్యర్థులను బరిలో నిలిపి లబ్ధికి కుట్ర
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. సామదాన దండోపాయాలను ఉపయోగించి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలని.. లెక్కింపులో బలప్రదర్శన ద్వారా అధికారులపై ఒత్తిడి పెంచాలని యోచిస్తోంది. కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులతో అధికార పార్టీ నేతలు నామినేషన్లు వేయించారు. అధికార పార్టీకి చెందిన ఏజెంట్లతో పాటు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను సైతం తామే నియమించుకోవడం ద్వారా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో బలం పెంచుకోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా ఒత్తిడి చేసేందుకు..
పొటో ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఓటేసే వారిని వివిధ కారణాలు చూపి పోలింగ్లో పాల్గొనకుండా అడ్డుకోడానికి అధికార పార్టీ తన ఏజెంట్లను వినియోగించుకోనుంది. ఓటర్లు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటారు. వీరు మరెక్కడా ఓటు నమోదు చేసుకోరు. సొంత ఊరులో ఓటు ఉండేలా చూసుకుంటారు. వీరు ఓటేసే క్రమంలో అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెంట్ల ఒత్తిడితో పోలింగ్ అధికారులు వెనక్కి తగ్గే అవకాశ లేకపోలేదు. ఇలా అన్ని విధంగా వారికి అనుకూలంగా మార్చుకోడానికి అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో వ్యూహాలు రచిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,637 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు ఒక్కో పార్టీకి ఒక్కో ఏజెంట్ను నియమించుకునే అవకాశం ఉంది. పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఈ లెక్కన అధికార పార్టీ ఎక్కువ మంది ఏజెంట్లు ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటోంది.
లెక్కింపు రోజు..
- కాకినాడ పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రం కాకినాడలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు రోజున పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లును నియమించుకోవచ్చు. అధికార పార్టీ నేతలు నామినేషన్లు వేయించిన స్వతంత్ర అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లను వారికి అనుకూలమైన వారిని నియమించుకునేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్కోసారి పదుల ఓట్ల తేడాతో గెలుపు, ఓటములు తేలే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఫలితాలు తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదు.
- కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి అధికార పార్టీ నేత ఒకరు కాకినాడకు చెందిన కార్మిక నేతతో ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఇంకా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అధికార పార్టీ నేతలు కొందరు స్వతంత్ర అభ్యర్థులతో నామపత్రాలు దాఖలు చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమిదే విజయం
[ 05-05-2024]
రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీలదే విజయం అంటూ వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక గ్రామాల్లో ఆదివారం తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించారు. -
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. -
కాకినాడను ‘మరో పులివెందుల’ చేస్తారా?
[ 05-05-2024]
కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. -
అయిదేళ్లూ.. మద్యం ఏరులై పారించారు..
[ 05-05-2024]
ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్రెడ్డి ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు. -
అధికార పార్టీకి డీఎస్పీ దన్ను..!
[ 05-05-2024]
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు. -
కూటమి విజయం అవసరం: పురందేశ్వరి
[ 05-05-2024]
ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కూటమి విజయం అవసరమని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
వరద బాధితులకు కుచ్చుటోపీ
[ 05-05-2024]
‘‘2022 జులై 26న గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలైన ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటించారు. -
విజయ శంఖారావం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ‘విజయ శంఖారావం’ సభకు రాజమహేంద్రవరంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. -
తెదేపాతోనే బీసీలకు స్వాతంత్య్రం
[ 05-05-2024]
రాష్ట్రంలోని బీసీలకు తెదేపా ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. -
ఓటేద్దాం.. అవినీతిపరులపై వేటు వేద్దాం
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ఈఓ వాసుదేవరావు కోరారు. -
పోస్టల్ బ్యాలెట్ @ 18,715
[ 05-05-2024]
ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈనెల 8వ తేదీ వరకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జె.నివాస్ తెలిపారు. -
మామిడి రారాజు... వైకాపా తీరుతో బేజారు
[ 05-05-2024]
ఫలాల్లో మామిడి రారాజే అయినా వాటిని సాగుచేసే రైతులకు సర్కారు తీరుతో తిప్పలు తప్పడం లేదు. -
బీమా.. జగన్ డ్రామా..!
[ 05-05-2024]
ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. -
శిరోముండనం కేసుపై అప్పీలుకు వెళ్లాలి
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్ చేశారు. -
నేడు తునిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
[ 05-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్ తునిలో ఆదివారం నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన, తెదేపా, భాజపా నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైకాపా ఎమ్మెల్యే స్టేటస్ పెట్టిన యువకుడు.. చంపుతామని బెదిరించిన అనుచరులు
[ 05-05-2024]
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపైనే చరవాణిలో స్టేటస్ పెడతావా అంటూ వైకాపా వర్గీయుడు జనసేనకు చెందిన ఒక యువకుడిపై దాడికి దిగారు.