వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు.
న్యూస్టుడే, వి.ఎల్.పురం
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. సమస్యలు, డిమాండ్లకు పరిష్కారం లభించడంలేదు. అనేకసార్లు ఆందోళనలు చేస్తూ వస్తున్నా యాజమాన్యం దిగిరాలేదు. గత మూడేళ్లలో 40 సార్లు సమావేశాలు జరిపినా ఫలితంలేదు. వీరి గోడును అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. మెరుగైన వేతన ఒప్పందం జరిగేలా చూస్తామంటూ హామీలిస్తూ వచ్చారేతప్ప పరిష్కారం చూపలేకపోయారు. యాజమాన్యంతో చర్చించి డిమాండ్ల పరిష్కారానికి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 26న సమ్మె నోటీసు ఇచ్చారు. వేతన సవరణ ఒప్పందం అమలుతో పాటు 23 డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టారు. సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ నెల 2 నుంచి మిల్లు లోపలే బైఠాయించి సమ్మెకు దిగారు. అధికారులు ఇరువర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు.
కలెక్టరేట్కు వచ్చిన పేపరుమిల్లు కార్మికులు
సీఎం దృష్టికి తీసుకెళ్లినా..
ఈ నెల 18న నగరంలో బస్సు యాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో యాజమాన్యం బుధవారం నుంచి అర్ధాంతరంగా లాకౌట్ ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్పందించిన ఉన్నతాధికారులు మళ్లీ ఇరువర్గాల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరపగా ఇటు కార్మికులు సమ్మె విరమించేందుకు.. అటు యాజమాన్యం మిల్లు తెరిచేందుకు అంగీకారం తెలిపాయి. కార్యకలాపాలు, ఉత్పత్తి యథాస్థితికి చేరుకున్న తర్వాత కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చర్చలు జరిపేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపినప్పటికీ ఎంతవరకు న్యాయం చేస్తారనేది వేచి చూడాల్సి ఉందని పలువురు కార్మికులు అంటున్నారు. చర్చల సందర్భంగా కలెక్టరేట్ వద్దకు వచ్చిన పలువురు కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
న్యాయం చేయాలంటూ జగన్ కాన్వాయ్ దగ్గరకు చేరుకున్న కార్మికులు (పాత చిత్రం)
ఎంపీ కనీసం పట్టించుకోలేదు..
ఇటీవల ఇక్కడ దివంగత నేత వై.ఎస్.ఆర్. విగ్రహావిష్కరణకు వచ్చిన ఎంపీ భరత్రామ్ కార్మికులకు వేతన ఒప్పందం చేయించేస్తామని చెప్పుకొచ్చినా ఇప్పటివరకు జరగలేదు. 24 రోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం పలకరించిదిలేదు. మా గురించి పట్టించుకున్నదీ లేదు. కాంట్రాక్టు వర్కర్లకు రూ.9 వేలు, శాశ్వత ఉద్యోగులకు రూ.30 వేలకు మించి జీతం రావడంలేదు. కొన్ని పోస్టులు రూ.15 లక్షలు, రూ.20 లక్షలకు అమ్ముకున్నారు. తండ్రి పోస్టుల్లో వచ్చిన వారు ట్రైనీలుగా పనిచేస్తున్నప్పటికీ వారికి ఇచ్చేది రూ.8 వేలు మాత్రమే. క్యాంటీన్ సౌకర్యాలు, అలవెన్సులు, సిక్ లీవులు ఇవ్వడంలేదు. పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోయి మంచాన పడినవారికి మందుల ఖర్చులకు డబ్బులు ఇవ్వడంలేదు. కరోనాతో 29 మంది చనిపోతే యాజమాన్యం ఆదుకోలేదు. కరోనా అలవెన్సులు ఇప్పటివరకు ఇవ్వలేదు.
సీహెచ్వీ దుర్గారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమిదే విజయం
[ 05-05-2024]
రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీలదే విజయం అంటూ వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక గ్రామాల్లో ఆదివారం తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించారు. -
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. -
కాకినాడను ‘మరో పులివెందుల’ చేస్తారా?
[ 05-05-2024]
కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. -
అయిదేళ్లూ.. మద్యం ఏరులై పారించారు..
[ 05-05-2024]
ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్రెడ్డి ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు. -
అధికార పార్టీకి డీఎస్పీ దన్ను..!
[ 05-05-2024]
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు. -
కూటమి విజయం అవసరం: పురందేశ్వరి
[ 05-05-2024]
ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కూటమి విజయం అవసరమని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
వరద బాధితులకు కుచ్చుటోపీ
[ 05-05-2024]
‘‘2022 జులై 26న గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలైన ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటించారు. -
విజయ శంఖారావం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ‘విజయ శంఖారావం’ సభకు రాజమహేంద్రవరంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. -
తెదేపాతోనే బీసీలకు స్వాతంత్య్రం
[ 05-05-2024]
రాష్ట్రంలోని బీసీలకు తెదేపా ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. -
ఓటేద్దాం.. అవినీతిపరులపై వేటు వేద్దాం
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ఈఓ వాసుదేవరావు కోరారు. -
పోస్టల్ బ్యాలెట్ @ 18,715
[ 05-05-2024]
ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈనెల 8వ తేదీ వరకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జె.నివాస్ తెలిపారు. -
మామిడి రారాజు... వైకాపా తీరుతో బేజారు
[ 05-05-2024]
ఫలాల్లో మామిడి రారాజే అయినా వాటిని సాగుచేసే రైతులకు సర్కారు తీరుతో తిప్పలు తప్పడం లేదు. -
బీమా.. జగన్ డ్రామా..!
[ 05-05-2024]
ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. -
శిరోముండనం కేసుపై అప్పీలుకు వెళ్లాలి
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్ చేశారు. -
నేడు తునిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
[ 05-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్ తునిలో ఆదివారం నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన, తెదేపా, భాజపా నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైకాపా ఎమ్మెల్యే స్టేటస్ పెట్టిన యువకుడు.. చంపుతామని బెదిరించిన అనుచరులు
[ 05-05-2024]
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపైనే చరవాణిలో స్టేటస్ పెడతావా అంటూ వైకాపా వర్గీయుడు జనసేనకు చెందిన ఒక యువకుడిపై దాడికి దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి