నిధులొచ్చాయి.. రావాల్సింది విధివిధానాలే
‘గడప గడపకు మన ప్రభుత్వం’లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పల్లెలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ఒక్కో గ్రామ/వార్డు సచివాలయం
ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు
కాకినాడ గ్రామీణ మండలం, ఇంద్రపాలెం సచివాలయం
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పల్లెలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ఒక్కో గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే సీఎం అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్) కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2 కోట్లు చొప్పున మంజూరు చేశారు. దీంతో జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.14 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించి ప్రతిపాదనలు కోరుతున్నారు. ఇప్పటి వరకు తుని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా తన పరిధిలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా ప్రణాళిక శాఖ కార్యాలయానికి పంపారు.
జిల్లాకు రూ.124 కోట్లు మంజూరు
కాకినాడ జిల్లాలో 620 గ్రామ/వార్డు సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున రూ.124 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో పల్లెల్లో 445 గ్రామ సచివాలయాల పరిధిలో రూ.89 కోట్లు, పట్టణాల్లోని 175 వార్డు సచివాలయాల పరిధిలో రూ.35 కోట్ల మేర నిధులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో అక్కడ గుర్తించిన అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, తాగునీటి అవసరాలు, విద్యుత్తు సౌకర్యం, సామాజిక భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
బిల్లుల చెల్లింపే ప్రధానం..?
వైకాపా ప్రభుత్వం వచ్చాక.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై గుత్తేదారులు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం వంటి పనులకు బిల్లుల చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. తాజాగా నియోజకవర్గానికి రూ.2 కోట్లు, సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేసిన నిధులతో చేపట్టే పనులు ఒక్కొక్కటి రూ.5 లక్షలలోపు ఉండే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.5 లక్షల లోపు పనులు చేపడితే నామినేషన్ విధానంలో మంజూరు చేసే అవకాశం ఉంది. వీటిని పూర్తి చేసినా బిల్లులు ఏ విధంగా వస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ ల్యాడ్స్ మాదిరిగా కలెక్టర్ ఖాతాలో ఈ నిధులు జమ చేసి, పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించే విధానం అమలు చేస్తే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్గదర్శకాలు రావాల్సి ఉంది..
- కె.శ్రీరమణి, సచివాలయాల నోడల్ అధికారి, కాకినాడ జిల్లా
గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో సచివాలయం పరిధిలో రూ.20 లక్షల చొప్పున కేటాయింపులు చేశారు. వీటి వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనులకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి. పల్లెలు, పట్టణాల్లో మౌలిక వనరులు సమకూరతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం