పెద్దల సభకు ముగ్గురు!
కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి ముగ్గురు పెద్దల సభలో అడుగిడనున్నారు. శాసనమండలిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైకాపా సోమవారం ప్రకటించింది.
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఈనాడు, కాకినాడ - న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్, అమలాపురం పట్టణం, అల్లవరం
కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి ముగ్గురు పెద్దల సభలో అడుగిడనున్నారు. శాసనమండలిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైకాపా సోమవారం ప్రకటించింది. గవర్నర్ కోటాలో కాకినాడ నుంచి కర్రి పద్మశ్రీ (బీసీ/వాడబలిజ).. స్థానిక సంస్థల కోటాలో అమలాపురం నుంచి కుడుపూడి సూర్యనారాయణ (బీసీ/శెట్టిబలిజ).. ఎమ్మెల్యేల కోటా నుంచి బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ/మాదిగ) పేర్లు ఖరారు చేసింది.
‘కుడుపూడి’ని వరించిన అవకాశం
కుడుపూడి సూర్య నారాయణరావు.. మాజీ డీఐజీ గోపాలకృష్ణ గోఖలే, మహాలక్ష్మి కుమారుడు. భార్య డాక్టర్ విజయ. ఏయూ విద్యార్థి సంఘ నాయకుడిగా 12 ఏళ్లు వ్యవహరించారు. ప్రస్తుతం న్యాయవాదిగా ఉన్నారు. 1986లో శెట్టిబలిజ మహానాడు స్థాపించారు. ఉభయ రాష్ట్రాల శెట్టిబజలిజ సంఘ, ఆంధ్రప్రదేశ్ బీసీ కుల సంఘాల కన్వీనర్గా ఉన్నారు. ఈయన మాజీ మంత్రి కుడుపూడి ప్రభాకరరావు అన్న కుమారుడు. మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయ్కి దూరపు బంధువు. 2000లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్గా పనిచేశారు. 2004లో తెదేపా తరఫున రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం తరఫున ముమ్మిడివరం నుంచి బరిలో దిగి ఓటమి చవిచూశారు. 2019లో వైకాపాలో చేరి ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. చిట్టబ్బాయ్ సంస్మరణ సభలో.. వైవీ సుబ్బారెడ్డి పాదాలకు మంత్రి వేణు నమస్కరించడంతో.. శెట్టిబలిజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారనే కోపంతో సూర్యనారాయణరావు పార్టీకి దూరంగా ఉన్నా.. ఇటీవల మారిన సమీకరణాలతో మళ్లీ దగ్గరయ్యారు. మంత్రులు విశ్వరూప్, వేణుకు దూరంగా ఉన్న సుభాష్కు ప్రత్యామ్నాయంగా సూర్యనారాయణరావుకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్ల ఘటనలో అధిక సంఖ్యలో శెట్టిబలిజలపై కేసులు పెట్టడంతో వారు పార్టీకి దూరం అవుతున్నారనే ఉద్దేశంతోనే కుడుపూడికి అవకాశమిచ్చారనే వాదన వినిపిస్తోంది.
ఉపసర్పంచిగా మొదలై...
అల్లవరం మండలం గోడి గ్రామస్థుడు.. బొమ్మి ఇజ్రాయిల్. అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో బీఏ చదివారు. వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ.. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2008-2013 వరకు గోడి ఉప సర్పంచిగా చేశారు. 2021 ఎన్నికల్లో భార్యను గోడి పంచాయతీ ఎన్నికల బరిలో నిలపగా.. ఈమె తెదేపా మద్దతుదారు చేతిలో ఓడిపోయారు. ఇటీవల మాదిగ ఉపకులాలతో అమలాపురంలో బహిరంగ సమావేశం నిర్వహించి.. తమ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఇజ్రాయిల్కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారైందనే ప్రచారం సాగుతోంది.
మత్స్యకార మహిళకు గుర్తింపు
కాకినాడ నగర మత్స్యకార మహిళ.. కర్రి పద్మశ్రీ. ఆంగ్ల మాధ్యమంలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ చేశారు. ఆమె భర్త నారాయణరావు ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రధాన అనుచరుడు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ద్వారంపూడి తరఫున పనిచేశారు. వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. పద్మశ్రీ నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫిషర్మెన్ (ఎన్ఏఎఫ్) మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా, మత్స్యకార సంక్షేమ సమతి మహిళా విభాగం అధ్యక్షురాలిగా, అఖిల భారతీయ కాస్యాప్ మహిళా సంఘ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమె తాత గరికిన సత్తిరాజు కార్గోబోట్స్ వ్యవస్థాపకులుగా పనిచేశారు. మరోతాత డాక్టర్ బర్రి రామచంద్రరావు రాజ్యసభ మాజీ సభ్యులు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్గా ఉన్నారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా పనిచేశారు. ఈమె భర్త వైకాపా నాయకుడిగా ఉన్నా.. పద్మశ్రీ భాజపా నాయకులతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఆమెకు ఈ అవకాశం దక్కినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
[ 04-05-2024]
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ‘మీ మేనమామగా చెబుతున్నా.. అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్ ప్రకటించుకుంటున్నా అప్పుడే పుట్టిన బుజ్జాయిలపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. -
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
[ 04-05-2024]
సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. -
జనం భూముల్లో.. జగన్ బూచోడు
[ 04-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది. -
వైకాపా వంచన.. అభాగ్యుల వేదన
[ 04-05-2024]
గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
అక్కడికెళ్తేనే ఓటరు స్లిప్పులిస్తారట..
[ 04-05-2024]
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. -
వీధుల్లో చీకట్లు.. వైకాపా తెచ్చిన ఇక్కట్లు
[ 04-05-2024]
వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు. -
వేమగిరి.. మోగనుంది విజయ శంఖారావం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ రాజమహేంద్రవరం రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి వేమగిరిలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేడు
[ 04-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు కాకినాడ సిటీ, గ్రామీణ నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి సాయంత్రం 6 గంటలకు చాపర్లో కాకినాడ గ్రామీణ మండలం తూరంగి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
[ 04-05-2024]
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. -
ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ప్రజలదే: యనమల
[ 04-05-2024]
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని, ఓటు హక్కు వినియోగంతోనే అది సాధ్యమని తెదేపా పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గోపాలపురంలో శుక్రవారం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బీసీ సామాజిక నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. -
జగనన్న ఏలు‘బడి’లో ఇంతే..
[ 04-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. -
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైకాపా లక్ష్యం
[ 04-05-2024]
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం మండలం పేరూరులోని బీఆర్కే హాలులో శెట్టిబలిజల ఆత్మీయ సమావేశాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. -
చిన్న పిల్లల సంరక్షణకూ ‘చేతులు రాలేదు’
[ 04-05-2024]
వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది. -
గోరంట్ల ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు
[ 04-05-2024]
రాజమహేంద్రవరం గ్రామీణం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారంలో వైకాపా అనుయాయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం 27వ డివిజన్లో గోరంట్లతో పాటు ఆయన కుమార్తె శిరీష ప్రచారంలో పాల్గొన్నారు. -
రెండు రోడ్లు వేసి అదే అభివృద్ధి అంటారా?
[ 04-05-2024]
రాజధానిని ఏర్పరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కొవ్వూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు అచ్చిబాబుతో కలిసి శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు