ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు.
రెండువందలని చెప్పి.. పదులసంఖ్యలోనూ ఏర్పాటు చేయని వైనం
విద్యార్థులు, సందర్శకులు లేక బోసిపోయిన స్టాళ్లు
న్యూస్టుడే, గాంధీనగర్(కాకినాడ): వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. నగర వాసులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు తరలిరావాలన్నారు. తీరా జేఎన్టీయూకేలో జరుగుతున్న ఇన్నోవేషన్ ఫెయిర్కు వెళ్లి చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎంతోఖర్చుతో ఏర్పాటు చేసిన స్టాళ్లన్నీ బోసిపోయాయి.
ఏం జరిగిందంటే..: జేఎన్టీయూకే ప్రాంగణంలో బుధవారం జేఎన్టీయూకే డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో కేంద్రవిద్యా శాఖలోని నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డిజైన్ ఇన్నోవేషన్ సహకారంతో రెండురోజుల పాటు జరిగే ఇన్నోవేషన్ ప్రదర్శన ప్రారంభించారు. జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, అక్ను వీసీ కె.పద్మరాజు అతిథులుగా హాజరయ్యారు. వందకు పైగా స్టాళ్లను భారీ ఖర్చుతోనే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమాచారాన్ని ముందుగా మీడియాకు చెప్పకపోవడం గమనార్హం. ఫెయిర్ ప్రారంభించాక సాయంత్రం తీరిగ్గా మీడియాకు సమాచారం విడుదల చేశారు. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నా.. కనీస స్థాయిలో కానరాని దుస్థితి కనిపించింది. దీనిపై సంబంధిత కన్వీనర్ ఎ.గోపాలకృష్ణను ‘న్యూస్టుడే’ ఆరా తీయగా నిన్ననే వచ్చి వెళ్లిపోయారన్నారు. రెండు రోజుల పాటు జరుగుతుందన్నారు.. కదా అని ప్రశ్నిస్తే బయటకు వెళ్లి ఉంటారని మాటమార్చారు. ఈ విషయాన్ని వీసీ ప్రసాదరాజు వద్ద ప్రస్తావించగా.. ఇన్నోవేషన్ ఫెయిర్ జరుగుతోందని ప్రాజెక్టుల గురించి కన్వీనర్ను అడగాలని పేర్కొన్నారు.
అంత గోప్యం ఎందుకో..?
జేఎన్టీయూకేలో రాష్ట్ర, జాతీయ స్థాయి సదస్సులు, సెమినార్లు వంటివి జరుగుతున్నా కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి కార్యక్రమాల పేరిట భారీగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థులను నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు వైపు నడిపించేలా ఇన్నోవేషన్ ఫెయిర్ వంటి కార్యక్రమాలకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా, ఆవిష్కరణల గురించి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్న తీరుతో ఫలితం ఉండటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం