logo

ఓటేద్దాం.. అవినీతిపరులపై వేటు వేద్దాం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్‌ఈఓ వాసుదేవరావు కోరారు.

Published : 05 May 2024 03:52 IST

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్‌ఈఓ వాసుదేవరావు కోరారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం వద్ద గల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కోటగుమ్మం సెంటర్‌కు చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించారు. తిరిగి అక్కడి నుంచి పుష్కరఘాట్‌ వరకూ సాగింది. సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎస్‌.సుభాషిణి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని