మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. ప్రధానంగా రాజమహేంద్రవరం నగరంలో బరిలో నిలిచిన అధికార పార్టీకి చెందిన నేత తాయితాల పంపిణీకి తెరలేపారు. ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నగరంలో పలు వర్గాలను స్వయంగా ఇంటికి పిలిచి నగదు రూపంలో పంపిణీ చేస్తున్నారు. దీన్ని కొందరు వ్యతిరేకించి ఆయన ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడకపోవడం గమనార్హం. ఇన్నాళ్లూ ఏం చేయలేని ప్రభుత్వం, నాయకులు ఇప్పుడు డబ్బులు ఆశ చూపితే ఎలా వస్తామంటూ పలువురు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
కులాలు, వర్గాలవారీగా..
కులాలు, వర్గాల వారీగా ఇంటికి పిలిపించి ఎంతో కొంత ముట్టచెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికులు, ఒప్పంద ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు జాబితాను సిద్ధం చేశారు. వారందరికీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి కార్యాలయానికి రప్పించి రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకూ పంపిణీ చేస్తున్నారు. నగరంలో ఆయా డివిజన్లలో ద్వితీయ శ్రేణి నాయకులకూ బేేరాలు పెడుతున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేసే విధంగా ఓటర్లను ప్రభావితం చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరంతా ఛోటా నాయకులను గుర్తించి నేత వద్దకు తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలి.
మేము రాం..
ఇన్నాళ్లూ తమ సమస్యలు పట్టించుకోకపోగా.. ఇప్పుడు పిలిస్తే ఎలా వస్తామా అంటూ కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అంగన్వాడీ సిబ్బందిని రావాల్సిందిగా సంబంధిత నాయకుడి కార్యాలయం నుంచి రెండు రోజుల క్రితం సమాచారం అందించారు. అయితే వారు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. అంగన్వాడీల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న వారంతా డబ్బులకు ఆశపడి వచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదే కోవలో మరికొన్ని కార్మిక వర్గాలు వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో విస్మయం చెందిన నేతలు ఇంకా ఎక్కువ మొత్తంలో ఆశచూపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వెళ్లేదిలేదని వారంతా నాయకుల ముఖం మీదే చెప్పేస్తున్నారు.
ఇంటివద్ద యథేచ్ఛగా పంపిణీ
నగరంలోని అధికార పార్టీ నేత ఇంటి వద్ద రెండు రోజులుగా హడావుడి కనిపిస్తోంది. ప్రతీ రోజు రాత్రి సమయంలో ఆయా వర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. చారిత్రక రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తరుణంలో ఎన్నికల్లో గెలుపునకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నగరంలో పలు వర్గాల వ్యతిరేకతను మూటగట్టుకొన్న అధికార పార్టీ నేత.. ఇప్పుడు సొమ్ములు ఆశ చూపుతున్నారు. ఎన్నికల కోడ్ రాక ముందు నగరంలో సామాజిక భవనాల పేరుతో ప్రభుత్వ స్థలాలను పంచిపెట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో సొమ్ములు ఆశ చూపి ఓట్లు రాబట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
[ 18-05-2024]
కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. -
సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం
[ 18-05-2024]
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. -
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ