జగన్ తెచ్చిన నల్లచట్టంపై తిరుగుబాటు చేయాలి: ముప్పాళ్ల
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు.
ముమ్మిడివరంలోని తెదేపా కార్యాలయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల సుబ్బారావు
ముమ్మిడివరం, న్యూస్టుడే: రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. ముమ్మిడివరంలోని తెదేపా కార్యాలయం వద్ద బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు, మేధావులతో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశంలో సుబ్బారావు మాట్లాడారు. ప్రజల ఆస్తి హక్కుకు భంగం కలిగేలా ఈ చట్టంలో పొందుపర్చారన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోసైతం అమలు చేయకుండా వదిలేసిన ఈ నల్ల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడమేంటని ముప్పాళ్ల ప్రశ్నించారు. నీతి ఆయోగ్ నుంచి డ్రాప్ట్ రెజల్యూషన్ రాకుండా ఐదు నెలల ముందుగానే రాష్ట్రంలో బిల్లు పాస్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా చేస్తున్న తప్పు.. నేడు బహిర్గతం కావడంతో ప్రజలు తమ ఆస్తి హక్కును కాపాడుకోవాలని ముందుకు రావడంతో భయపడి ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని చెబుతున్నారంటే పాలకుల కుట్రను అర్థం చేసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేయకపోతే 512 జీవోను ఎలా ఇచ్చారని సుబ్బారావు ప్రశ్నించారు. ఇది 2023 అక్టోబరు 31 నుంచి అమలులోకి వస్తుందని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఎలా చెప్పారన్నారు. ప్రభుత్వం అధికారులను నియమించి.. చట్టబద్ధత కల్పిస్తే.. బడుగు, బలహీన, సామాన్య, ఆదివాసీ, మధ్యతరగతి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందన్నారు. ఇప్పటికీ ప్రజలకు న్యాయస్థానాలపైనే గౌరవం ఉంది. రాష్ట్రంలో ఇసుక, మూడు రాజధానుల విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించడం పరిపాటిగా మారిందన్నారు.
ఐఏఎస్లు సైతం అయ్యా ఎస్ అనే పరిస్థితికి వచ్చి.. న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నాయకులు అయ్యాజీవేమా, ఆనందసాగర్, శ్రీనివాసరావు, న్యాయవాదులు అభిప్రాయాలు వెల్లడించారు. కుచ్చర్లపాటి తాతంరాజు, చింతపల్లి అజయ్కుమార్, రెడ్డి సత్యనారాయణమూర్తి, బీర ప్రసాద్, రామాయణ మణేశ్వరరావు, తాడి నరసింహారావు, ఈఎస్ బాబు, రేవు సుబ్రహ్మణ్యం, బొంతు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి