logo

పవన్‌ కల్యాణ్‌ను అసెంబ్లీకి పంపిద్దాం

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని ఖండించిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా మరో వీడియో సందేశం విడుదల చేశారు.

Published : 06 May 2024 06:14 IST

ముద్రగడ కుమార్తె క్రాంతి

జనసేనానితో మాట్లాడుతున్న క్రాంతి, ఆమె భర్త

ఈనాడు, రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని ఖండించిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం కచ్చితంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పవన్‌కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టమని పేర్కొన్నారు. పవన్‌ సారథ్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. దశాబ్దకాలంగా సొంత డబ్బులతో పార్టీ నడిపిస్తూ ఎంతో మందికి ఆయన అండగా నిలిచారన్నారు. ఏ అధికారం లేకపోయినా అనేక సమస్యలపై స్పందించిన ఆయన్ను, అసెంబ్లీకి పంపిస్తే ఎలా ఉంటుందో ఊహించాలని ప్రజలకు సూచించారు. పాజిటివ్‌ పాలిటిక్స్‌ చేసే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అంతా అండగా నిలిచి భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దామని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని