ఇక్కడైనా గందరగోళం లేకుండా చూస్తారా?
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు.
నేటి నుంచి జిల్లాలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్
న్యూస్టుడే, రాజమహేంద్రవరం కలెక్టరేట్
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 11,988 మంది నిర్దేశించిన తేదీల్లో తమకు కేటాయించిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన పలు జిల్లాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తి ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఈ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఎదురైన సమస్యలివి..
- ఓట్లు గల్లంతు కావడం
- ఆయా నియోజకవర్గాలకు జాబితా పంపక పోవడం
- సరైన సమాచారం ఇచ్చేవారు లేకపోవడం
- ఫెసిలిటేషన్ కేంద్రాల్లో సౌకర్యాల లేమి
- చాలామందికి పోస్టల్ బ్యాలట్ ఇవ్వకపోవడం
- నిర్దేశించిన సమయానికి ప్రక్రియ ప్రారంభం కాకపోవడం
- సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.
ఫెసిలిటేషన్ కేంద్రాలివి..
- అనపర్తి: రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల(పీవో, ఏపీవోలకు), జీబీఆర్ కళాశాల(ఇతర పోలింగ్ సిబ్బందికి)
- రాజానగరం: బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల(పాలచర్ల)
- రాజమహేంద్రవరం నగరం: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణ
- రాజమహేంద్రవరం గ్రామీణం: ది ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల కొత్త ప్రాంగణం (కవలగొయ్యి)
- కొవ్వూరు: సుందరశ్రీ కల్యాణ మండపం - నిడదవోలు: వికాస్ జూనియర్, డిగ్రీ కళాశాల(సమిశ్రగూడెం)
- గోపాలపురం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల
వీరికే పోస్టల్ బ్యాలట్ అవకాశం
- పీవో, ఏపీవోలు-3,527 మంది
- ఓపీవోలు-4,865
- ప్రభుత్వ అధికారులు-1,091
- సూక్ష్మ పరిశీలకులు-342
- పోలీసు సిబ్బంది-1,821
- అత్యవసర సేవల సిబ్బంది- 342
ఇబ్బందులు లేకుండా చూడాలి
-జె.డి.ఐ.జె.డేనియల్బాబు, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు
పోస్టల్ బ్యాలట్ వినియోగం విషయంలో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి జిల్లాపరంగా గోకవరం, పెదపూడి మండలాల ఉద్యోగుల్లో గందరగోళం ఉంది. అంగన్వాడీ తదితర సిబ్బందికి ఆలస్యంగా ఎన్నికల విధులు కేటాయించారు. వారిలో చాలామంది ఫారం-12 సమర్పించే సమయం లేదు. వీరుకూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా గడువు పెంచాలి.
ఎవరికి.. ఎక్కడ.. ఎప్పుడు..
ఉద్యోగులకు మొదటి విడత శిక్షణలో మాట్లాడుతున్న కలెక్టర్
- 6వ తేదీన: పీవో, ఏపీవోలకు ఆయా నియోజకవర్గాల్లో కేటాయించిన కేంద్రాల్లో ఎన్నికల శిక్షణ ఇస్తారు. అనంతరం అక్కడి ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలట్ సదుపాయం కల్పిస్తారు.
- 7: పోలీసు సిబ్బందికి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది.
- అదేరోజు వేంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లకు ఉదయం 9 గంటలకు ఎన్నికల శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తారు.
- అత్యవసర సేవల ఉద్యోగులకు రాజమహేంద్రవరం గ్రామీణం కవలగొయ్యి వద్ద ఉన్న ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల కొత్త ప్రాంగణంలో ఉదయం 9 నుంచి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తారు.
- 8న: ఇతర పోలింగ్ సిబ్బంది(ఓపీవో)కి పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది.
గందరగోళానికి గురవుతున్నారు
- మీసాల మాధవరావు, ఏపీ ఎన్జీవో సంఘ నగర ఉపాధ్యక్షుడు, రాజమహేంద్రవరం
ఉద్యోగికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ వేసే అవకాశం కల్పించినప్పుడే ఎక్కువ మంది ఓటు వినియోగించుకోగలరు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని శిక్షణ పూర్తిచేసిన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలట్ ఇవ్వకపోవడంతో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
[ 18-05-2024]
కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. -
సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం
[ 18-05-2024]
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. -
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ