తీరంలో ఇసుక దొంగలు
సముద్ర తీరంలో ఇసుక దందా ఆగడం లేదు. సీఆర్జెడ్ పరిధిలోనూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పక్ష నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైకాపా పెద్దల అండ.. పట్టించుకోని అధికారులు
న్యూస్టుడే, మలికిపురం
మలికిపురం మండలం తూర్పుపాలెంలో తవ్వుతున్న బొండు ఇసుక
సముద్ర తీరంలో ఇసుక దందా ఆగడం లేదు. సీఆర్జెడ్ పరిధిలోనూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పక్ష నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే ఆక్వా చెరువులను తొలగించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కొంత కాలం క్రితం ఎన్జీటీ ఆదేశాలు జారీ చేయగా కలెక్టరు ఉత్తర్వులతో మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సీఆర్జెడ్ పరిధిలోని చెరువులను ధ్వంసం చేయడానికి తహసీల్దార్లు నోటీసులు జారీ చేసి తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఆందోళన చేసినప్పుడల్లా నాలుగైదు ట్రాక్టర్లను సీజ్ చేసి వదిలేస్తున్నారు. యంత్రాంగం కఠినంగా వ్యవహరించకపోవడంతో ఇసుక, ఆక్వా చెరువుల తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇసుక లోడుతో సిద్ధంగా ట్రాక్టర్లు
అంతర్వేది నుంచి కాట్రేనికోన వరకు..
జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి మలికిపురం, అల్లవరం మండలాలతో పాటు కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర వరకు సుమారు 94 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. సీఆర్జెడ్ పరిధిలో సముద్రం ఒడ్డున కెరటాలు వచ్చే ప్రాంతం వరకూ తీరాన్ని తవ్వేస్తున్నారు. మలికిపురం మండలంలో తూర్పుపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర, కేశవదాసుపాలెం, అంతర్వేది దేవస్థానం, అల్లవరం మండలం కొమరగిరిపట్నం తదితర తీరప్రాంత గ్రామాల్లో ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల తూర్పుపాలెం, కేశనపల్లి గ్రామ సర్పంచులు తెల్లవారుజామున తమ గ్రామాల పరిధిలో కాపు కాసి ఇసుక ట్రాక్టర్లను నిలుపుదల చేసి అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోలేదని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల నుంచి రోజూ 50పైగా ట్రాక్టర్లపై అక్రమంగా బొండు ఇసుకను తరలిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా చెరువులు
తీరంలో ఇసుక దిబ్బలు, రైతుల జిరాయితీ పొలాలు, సొసైటీ భూములను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. సముద్ర తీరానికి, పర్యావరణానికి రక్షణగా ఉన్న సరుగుడు తోటలను కూడా నరికేస్తున్నారు. అక్రమార్కులు కొందరు ట్రాక్టరుకు రూ వెయ్యి నుంచి రూ.1500 వరకు రైతుకు ఇచ్చి ఐదారు అడుగుల లోతు వరకు ఇసుక తవ్వేసి ట్రాక్టరు ఇసుకను రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు