రూ.66 కోట్లు ఎక్కడ జగన్?
విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది.
ఏటిగట్టు రోడ్డు హామీ గాలికే..
నిడదవోలు, న్యూస్టుడే: విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది. పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు ఏటిగట్టు రహదారి తరహాలో విజ్జేశ్వరం నుంచి బియ్యపుతిప్ప వరకు ఏటిగట్టు రోడ్డును విస్తరించి బస్సులు, ఇతర వాహనాలు తిరిగేలా తారు రోడ్డు నిర్మించాలి. దీంతో దూరాభారం తగ్గడంతో పాటు, రవాణా సదుసాయం మరింత మెరుగవుతుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఎంతో ప్రయోజనం. వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు పూర్తిగా వదిలేశారు. గతేడాది సాక్షాత్తూ సీఎం జగనే హామీ ఇచ్చినా అడుగు కూడా పడలేదు. ఏటిగట్టు రక్షణ పూర్తిగా వదిలేశారు.
భయపెడుతున్న తవ్వకాలు..
1986లో గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో ఎక్కడికక్కడ ఏటిగట్లు తెగిపోయాయి. వందల గ్రామాలు నీట మునిగాయి. 2006లో కూడా ఇంచుమించు అదే స్థాయిలో వరదనీరు ప్రవహించింది. ఆ సమయాల్లో ఉభయగోదావరి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మళ్లీ ఎప్పుడైనా అదేస్థాయిలో వరదలొస్తే ఏ విధమైన ఇబ్బందులు రాకూడదని ఏటిగట్టు ఆధునికీకరణ చేపట్టారు. పనుల్లో నాణ్యతా లోపంతో ఇబ్బందులు తప్పట్లేదు. నిబంధనల ప్రకారం ఏటిగట్టుకు సుమారు కి.మీ దూరంలో తవ్వకాలు చేయకూడదు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన తవ్వకాలు జరిగాయి. ఏటిగట్టును చేర్చి ఉన్న లంకల్లోనే మట్టిని మీటరు నుంచి మూడు మీటర్ల లోతు తవ్వేశారు. దీంతో గట్టు అనేక చోట్ల జారుతోంది. 2020లో అత్యధికంగా 22.58 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించింది. ఆ సమయంలో తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు. నాయకుల హడావుడి తప్ప చేసిందేం లేదు.
యథేచ్ఛగా ఇసుక లారీలు..
ఏటిగట్టుపై ఏ విధమైన వాహనాలు రాకపోకలు సాగించరాదు. అధికార పార్టీ పుణ్యమా అని ఇసుక లారీలు ఏటిగట్టుపై నుంచే యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో చాలాచోట్ల గట్టు బలహీన పడింది. పెండ్యాల, పందలపర్రు ఇసుకర్యాంపుల నుంచి ఇసుక లారీలు రాకపోకలు సాగించడంతో ఏటిగట్టు చిత్తడిగా మారింది.
గోదావరికి వరదలొచ్చిన ప్రతిసారీ తీరప్రాంత ప్రజలు, రైతులు వణికిపోతారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఏటిగట్టు అభివృద్ధి పనులు నాణ్యత లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో గట్టు జారిపోతోంది. ఏటిగట్టును ఆధునికీకరించినా పలుచోట్ల ప్రమాదకరంగానే ఉంది. ఏటిగట్టుపై రహదారి నిర్మాణానికి గతేడాది సెప్టెంబరు 16న కాపునేస్తం పథకం కింద లబ్ధిదారులకు నగదు జమ చేసేందుకు నిడదవోలు వచ్చిన సీఎం జగన్ విజ్జేశ్వరం ఆనకట్ట నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు రూ.66 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గోదావరి హెడ్వర్క్స్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, అనుమతులు మాత్రం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరాల దేవుడు..వరుడాయే..!
[ 19-05-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెడ్లి కుమార్తెలుగా చేసే ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. -
పిల్లలూ.. గ్రంథాలయానికి పోదాం పదండి
[ 19-05-2024]
కథ చెబుతామంటే పిల్లలు ఎక్కడున్నా వచ్చి వాలిపోతారు.. బొమ్మలు గీయడం అంటే మరికొందరికి బోలెడంత ఆసక్తి.. సంగీతం.. నృత్యం... చదరంగం... యోగా.. అబ్బో ఒకటేంటి... చిన్నారులు ఇష్టపడే ఎన్నో అంశాలు. -
రైతుకు నిరాశ.. ఎవరికి భరోసా!
[ 19-05-2024]
రైతులకు అవసరమైన అన్ని సేవలు ‘రైతు భరోసా’ కేంద్రాల్లోనే అందిస్తాం. ఆ పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఎరువులు, పురుగు మందుల విక్రయాలు మొదలు ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని సేవలు అక్కడే. -
నదీమతల్లికి గాయం
[ 19-05-2024]
వేల ఊళ్ల దాహార్తిని తీర్చే నదీమతల్లి గోదావరి.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు భరోసానిచ్చే పావని.. కోట్లాది జలచరాలకు, జీవరాశులకు అమ్మ..నదిని నమ్ముకొన్నవారు నష్టపోయింది లేదని చరిత్ర చెబుతోంది..ఛిద్రం చేస్తే గమనం మార్చుకొని ప్రళయతాండవమూ చేస్తోంది. -
నగరానికే ప్రధానం.. తీరు ఘోరం
[ 19-05-2024]
నగరంలో మెయిన్ రోడ్డు.. ఇటు శ్యామలాసెంటర్ నుంచి అటు కోటగుమ్మం వరకు సాగే ఈ మార్గంలో జనసందోహంతో నిండిపోతుంది. -
కాకినాడ గ్రామీణంలో 19.. పెద్దాపురంలో 15
[ 19-05-2024]
కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 4న కాకినాడ జేఎన్టీయూకేలో ఓట్లు లెక్కించనున్నారు. -
ఇద్దరి మృత్యువాత కన్నోళ్లకు కడుపుకోత
[ 19-05-2024]
రావులపాలెంలోని గౌతమి గోదావరిలో శనివారం సాయంత్రం స్నానానికి దిగి స్థానికులు సబ్బెళ్ల ఈశ్వరరెడ్డి (20), పెంటా జయకుమార్ (19) మృతిచెందారు. విజయనగరానికి చెందిన సత్తి అజయ్ సంపత్రెడ్డి గల్లంతయ్యాడు. -
నన్నయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు
[ 19-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ కె.మాధవీలత ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్ లు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లు నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
బోధనలో మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి
[ 19-05-2024]
ఉన్నత విద్య బోధన విధానంలో వస్తున్న మార్పులను అధ్యాపకులు అందిపుచ్చుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు చప్పిడి కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు నిర్వహిస్తున్న మూడు రోజుల క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. -
పోలింగ్ రోజు ఘర్షణలపై పరస్పరం ఫిర్యాదు
[ 19-05-2024]
పోలింగ్ రోజైనా ఈ నెల 13న కాకినాడ నగరంలో జరిగిన ఘర్షణలపై వైకాపా, తెదేపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం