ఇప్పిస్తారా.. మీరిస్తారా..!
ప్రజలకు ఐటీ, జీఎస్టీ టాక్సుల గురించే తెలుసు. కానీ గుంటూరు నగరంలో ప్రజలకు మాత్రం కొత్తగా సీ టాక్స్ అనే పేరు వినిపిస్తోంది. ఇది తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈనాడు, అమరావతి
ప్రజలకు ఐటీ, జీఎస్టీ టాక్సుల గురించే తెలుసు. కానీ గుంటూరు నగరంలో ప్రజలకు మాత్రం కొత్తగా సీ టాక్స్ అనే పేరు వినిపిస్తోంది. ఇది తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. సీ టాక్స్ అంటే అదేనండీ కార్పొరేటర్ టాక్స్ అని అధికారులు విడమరిచి చెబితే వామ్మో ఇదేమిటని బెంబేలెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో గుంటూరు నగరంలో కొందరు టీపీఎస్లు, రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్ఐలు ఇంటి నిర్మాణం చేపడుతున్నా, చేపట్టిన దానికి పన్ను వేయాలన్నా తొలుత సీ టాక్స్ సమర్పించుకోమని ప్రజలను కార్పొరేటర్ల గుమ్మం తొక్కించడం వివాదాస్పదమవుతోంది.
నగరంలో కొన్ని డివిజన్లలో ఇళ్లు కట్టుకోవాలన్నా.. దానికి ఆస్తి పన్ను వేయించుకోవాలన్నా, పేరు మార్చుకోవాలన్నా (టైటిల్ ట్రాన్స్ఫర్) ఏదైనా తమకు చెప్పి చేయాలి. ప్రతిదీ మా కనుసనల్లోనే జరగాలని ప్రణాళిక, రెవెన్యూ విభాగం ఉద్యోగులకు కార్పొరేటర్లు హుకుం జారీ చేయడం, వాటిని యంత్రాంగం పాటించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇంటి ప్లాన్ ఆన్లైన్లో మంజూరైనా నిర్మాణం చేసుకోనీయకుండా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, ఏసీపీలను ఆ నిర్మాణం వద్దకు పంపి మరీ అడ్డుపడుతున్నారని కొందరు కార్పొరేటర్లపై బహిరంగంగానే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్లాన్ తీసుకుని ఉల్లంఘనలు లేకుండా నిర్మాణం చేసుకుంటున్నా నిర్మాణదారుడి నుంచి ఎంతో కొంత ఇప్పించాలి. వారివ్వకపోతే మీరైనా ఇవ్వాలని (అధికారులను ఉద్దేశించి) స్పష్టం చేసి ఒకవైపు ప్రజలు, మరోవైపు ఉద్యోగులను ముప్పతిప్పలు పెడుతున్నారనే అపవాదును కొందరు కార్పొరేటర్లు మూటగట్టుకున్నారు. అయినా ఈ వ్యవహారంపై మేయర్, కమిషనర్గానీ నోరు మెదపడం లేదు. పండరీపురంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆయన్ని సీ టాక్స్ సమర్పించుకోవాలని లేదంటే నిర్మాణం ఆపేయాలని సూచించారు. మరో కంటి వైద్యుడిని ఇలాగే బెదిరించారు. వీరిద్దరూ వారికున్న పలుకుబడితో చివరకు తమ జోలికి రాకుండా చూసుకున్నారని ఉద్యోగవర్గాల సమాచారం.
ఓడినోళ్లదీ అదే బాట..
వైకాపా తరఫున గెలిచిన వారిలో కొందరు కార్పొరేటర్లు, ఆ పార్టీ తరఫున ఓటమిపాలైన వారిలో కొందరు ఉద్యోగులను గుప్పిట్లో పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు తమ పరిధులను దాటి ఎక్కడ నిర్మాణం చేసినా తనకు కప్పం కట్టాల్సిందేనని భయపెడుతున్నారు. బృందావన్గార్డెన్స్ 8వ లైను, చంద్రమౌళీనగర్ ఒకటో లైను, పట్టాభిపురం మెయిన్రోడ్లో-2, పండరీపురం 2, అశోక్నగర్ 1 దేవాపురంలో 2, కొత్తపేటలో 4, పట్నంబజార్, పాతగుంటూరు, ఏటీ అగ్రహారం, చుట్టుగుంట, నల్లపాడు, గుజ్జనగుండ్ల, జేకేసీ రోడ్డు, గోరంట్ల, రెడ్డిపాలెంలో పలు భవనాలకు అనుమతులు ఉన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని కొందరు కార్పొరేటర్లు టీపీఎస్లను పంపి నిర్మాణాలు నిలుపుదల చేయించారని కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల ఆమె ప్రణాళికాధికారులతో సమీక్ష చేశారు. ఆ క్రమంలో ఓ టీపీఎస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ఉద్యోగుల్లో ప్రచారం నడుస్తోంది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సస్పెండ్ అవుతారని హెచ్చరించినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై మేయర్, కమిషనర్లు స్పందించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.
సెలవులో ఉద్యోగులు
కార్పొరేటర్లను మెప్పించలేక.. ప్రజలను డబ్బులు ఇవ్వమని ఒప్పించలేక ప్రణాళిక, రెవెన్యూ విభాగాలకు చెందిన ఉద్యోగులు కొందరు ఇప్పటికే సెలవులోకి జారుకోగా మరికొందరు తమను కార్యాలయ విధులకు మార్చాలని కమిషనర్ ఆయా విభాగాల అధిపతులకు లేఖలు పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్ఛు నగర ప్రణాళిక విభాగానికి పెద్ద దిక్కుగా భావించే ఇన్ఛార్జి సీపీ మధుకుమార్ వారం క్రితమే సెలవులోకి వెళ్లిపోయారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) స్రవంతి సెలవులో ఉన్నారు. రేపో, మాపో ఒకరిద్దరు టీపీఎస్లు సెలవులోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లు అడిగే నెలవారీ మామూళ్లు ఇవ్వలేమని, తమను అవుట్డోర్ విధుల నుంచి తప్పించి కార్యాలయ విధులకు సర్దుబాటు చేయాలని రెవెన్యూ విభాగానికి చెందిన ముగ్గురు ఆర్.ఐలు, ఒక ఆర్వో రాతపూర్వకంగా కోరారు. మరో ఆర్వో ఈ బాధలు భరించలేక ఇప్పటికే మూడుసార్లు సెలవులోకి వెళ్లారు. ప్రణాళిక విభాగంలో కీలకమైన సీపీ, డీసీపీలు లేరు. రాష్ట్రంలో అత్యధిక ప్లాన్లు మంజూరయ్యేది గుంటూరులోనే. ఇక్కడ సాలీనా 1400 నుంచి 1600 ప్లాన్లు జారీ అవుతున్నాయి. ఏటా నగరపాలకకు భవన అనుమతుల ఫీజుల ఆదాయం రూ.60-70 కోట్లు వసూలవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం