పల్లె కలలకు... జగన్ తూట్లు
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది.
వైకాపా పాలనలో పంచాయతీలు నిర్వీర్యం
విద్యుత్తు బిల్లుల పేరుతో ఆర్థిక సంఘం నిధులు ఖాళీ
ప్రత్తిపాడు, మేడికొండూరు, తుళ్లూరు, తాడికొండ, ఫిరంగిపురం గ్రామీణం, మంగళగిరి, న్యూస్టుడే
చెప్పిందిదీ..!
‘పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి చూపుతాం. గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.’ ఇవీ వేదికలపై సీఎం జగన్ నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకు తమ ఊకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పే మాటలు.
చేసిందిదీ..!
‘పంచాతీయలను నిర్వీర్యం చేశారు. వైకాపా ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది. కనీసం బ్లీచింగ్ చల్లేందుకు కూడా నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది.’ ఇవీ సర్పంచుల ఆవేదన
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి, తాగునీరు, మురుగు కాలువలు, వీధి దీపాలు, విద్యుత్తు బల్బులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు వంటి పనులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం పని చేస్తుంది. జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తారు. ఈ విధంగా మంజూరైన డబ్బులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలన్న నిబంధన ఉంది. అయితే వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ బిల్లు పేరిట లాగేసుకుంది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలన్నా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
ఇక్కడ వింత పరిస్థితి..
ముఖ్యంగా తుళ్లూరు మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లు గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు లేకపోవడంతో అసలు పాలకవర్గాలే ఏర్పడలేదు. దీంతో నిధుల్లేక ఆయా చోట్ల ప్రగతి పూర్తిగా పడకేసింది.
బ్లీచింగ్ కూడా కొనలేని పరిస్థితి..
- పూల నాగమణి, సర్పంచి, మేడికొండూరు
గతంలో ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఆర్థిక సంఘం నిధులను కనీస సమాచారం లేకుండా విద్యుత్తు బకాయిలకు మళ్లించారు. బ్లీచింగ్ కూడా కొనలేని పరిస్థితికి తెచ్చారు.
గళం వినిపించినా ఫలితం లేదు..
- కల్లూరి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు, సర్పంచుల సంఘం
మార్చి, 2024లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ రూ.900 కోట్ల నిధులు ఇచ్చింది. ఈ నిధులను జగన్ ప్రభుత్వం దారిమళ్లీంచింది. మళ్లీ సర్పంచులు నిరసన తెలిపాల్సి వచ్చింది. చివరకు ఎన్నికల కమిషన్ను కలిసి వినతి పత్రం అందిస్తే ఏప్రిల్ 18న జీవో ఇచ్చింది. కానీ నిధులు ఇంకా గ్రామ పంచాయతీ ఖాతాలకు రాలేదు.
సొంత డబ్బులు వెచ్చిస్తున్నాం..
- కంభం పెద్దబాబు, సర్పంచి, గుండాలపాడు
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు 2019 నుంచి 2024 మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంఘం నిధులు రూ.8,629 కోట్లు విడుదల చేసింది. వీటిని వైకాపా ప్రభుత్వం సర్పంచుల ప్రమేయం లేకుండా నేరుగా విద్యుత్తు బిల్లు రూపేణా మొత్తం లాగేసుకుంది. సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది.
అభివృద్ధి ఎలా చేయగలం
- పాటిబండ్ల కృష్ణప్రసాద్, సర్పంచి, పెదపాలెం
మా పంచాయతీకి విద్యుత్తు బిల్లు నెలకు రూ. 50 వేలు వస్తుంది. నిర్వహణ ఖర్చులతో కలిపి ఏడాదికి రూ. 10.8 లక్షలు ఖర్చవుతుంది. ఆర్థిక సంఘ నిధులు రూ. 10 లక్షలు వీటికే సరిపోతున్నాయి. ఇక అభివృద్ధి ఎలా చేయగలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోం ఓటింగ్ నిలిపివేత
[ 04-05-2024]
వట్టిచెరుకూరు మండలంలోని లేవల్లపాడు గ్రామంలో సీలు లేకుండా జరుగుతున్న హోం ఓటింగ్ను తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు శనివారం నిలిపివేశారు. -
జగన్, జవహర్రెడ్డికి వృద్ధుల ఉసురు తగులుతుంది: వర్ల రామయ్య
[ 04-05-2024]
జగన్ను అదికారంలో ఉంచడమే సీఎస్ జవహర్రెడ్డి లక్ష్యమని తెదేపా సీనియర్నేత వర్ల రామయ్య ఆరోపించారు. -
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
[ 04-05-2024]
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు
[ 04-05-2024]
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
‘పేదకు నరకం’.. లేదే కనికరం..
[ 04-05-2024]
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. -
‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
[ 04-05-2024]
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. -
రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
[ 04-05-2024]
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. -
372 సమస్యాత్మక కేంద్రాలు
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
[ 04-05-2024]
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు. -
తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్
[ 04-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. -
జగన్.. మాపై ఎందుకీ కక్ష?
[ 04-05-2024]
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. -
జగన్ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం
[ 04-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’