ఎన్నాళ్లీ ఎదురు చూపులు ?
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యానతోటలు సాగుచేసిన రైతులకు రెండేళ్లుగా సొమ్ము అందలేదు. ఉద్యానతోటల పెంపకాన్ని ప్రోత్సాహించాలనే లక్ష్యంతో రైతులకు మొక్కల కొనుగోలు నుంచి పెంపకం వరకు ఉపాధి హామీ పథకం కింద ప్రోత్సాహం అందించేవారు.
రెండేళ్లయినా అందని ప్రోత్సాహకం
ఉద్యాన రైతుల పరిస్థితి దయనీయం
ఈనాడు-గుంటూరు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యానతోటలు సాగుచేసిన రైతులకు రెండేళ్లుగా సొమ్ము అందలేదు. ఉద్యానతోటల పెంపకాన్ని ప్రోత్సాహించాలనే లక్ష్యంతో రైతులకు మొక్కల కొనుగోలు నుంచి పెంపకం వరకు ఉపాధి హామీ పథకం కింద ప్రోత్సాహం అందించేవారు. అయితే గత రెండేళ్లుగా రైతులకు సొమ్ము చెల్లించకపోవడంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీటికి సామగ్రి విభాగం కింద సొమ్ము చెల్లించాలి. అయితే రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న భవనాల నిర్మాణానికి మాత్రమే చెల్లింపులు చేస్తోంది. సామగ్రి విభాగం కింద సమకూరే సొమ్ము మొత్తం గ్రామీణ ఆరోగ్యకేంద్రాలు, డిజిటల్ గ్రంథాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామసచివాలయాలు, బీఎంసీయూలు నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నారు. వీటికి కాకుండా సామగ్రి విభాగం సొమ్ము ఇతర పనులకు చెల్లించవద్దని మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వాటికి చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలంటే రాబోయే ఏడాది వచ్చే సామగ్రి విభాగం కింద సమకూరే సొమ్ము కూడా సరిపోతుంది. ఈనేపథ్యంలో రైతులకు ఎప్పుడు చెల్లింపులు చేస్తారోనన్న ఆందోళనతో ప్రస్తుత ఏడాది ఉద్యానతోటల పెంపకానికి ఎవరూ ముందుకురాకపోవడం గమనార్హం.
రూ.20కోట్లకుపైగా బకాయిలు
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో 2021వ సంవత్సరం నుంచి ఉద్యానతోటలు సాగుచేసిన రైతులకు ప్రోత్సాహకాలు అందించలేదు. అంతకుముందు 2020లో సాగుచేసిన రైతులకు కొందరికీ ఇప్పటికీ సొమ్ము చెల్లించలేదు. మూడు జిల్లాల పరిధిలో రూ.20కోట్లకుపైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. మొక్కలు నాటడానికి గోతులు తవ్వడం, మొక్కల కొనుగోలు, రవాణా, నీరు పోయడంతోపాటు మూడేళ్లపాటు సంరక్షణకు ఉపాధి హామీ నిధులు ఇస్తారు. తొలిఏడాది మొక్కలు నాటిన వెంటనే అప్పటివరకు వెచ్చించిన సొమ్ములో నిబంధనల మేరకు సొమ్ము చెల్లిస్తారు. ప్రతినెలా క్షేత్రస్థాయి సిబ్బంది మొక్కల సంఖ్యను అనుసరించి వారికి బిల్లులు చెల్లిస్తారు. ఇలా మూడేళ్లపాటు రైతులకు ప్రోత్సాహకంగా అందిస్తారు. వ్యవసాయ పంటలతో పోల్చితే ఉద్యానపంటలు లాభదాయకంగా ఉండటంతో ఎక్కువమంది రైతులు వీటిసాగుకు మొగ్గుచూపుతున్నారు. సూక్ష్మ సేద్య పరికరాలైన బిందు, తుంపర్ల పరికరాలు అందుబాటులోకి రావడంతో ఉద్యానతోటల సాగుకు ఏటికేడు విస్తరిస్తోంది. ఈక్రమంలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే ప్రోత్సాహం కోసం చిన్న, సన్నకారు రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సాగుచేసినవారు అప్పులు తెచ్చి మొక్కలు కొనుగోలు, ఎరువులు, సంరక్షణకు వెచ్చించారు. ఏళ్లు గడస్తున్నా సొమ్ము చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. బిల్లులు చెల్లించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తామేమి చేయలేమని, ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రాధాన్యత భవనాలకే చెల్లింపులు చేస్తున్నామన్నారు. దీంతో చేసేదిలేక రైతులు నిస్సహాయస్థితిలో వెనుదిరిగిపోతున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో అడ్డుకట్ట
ఉద్యానతోటలు సాగుచేసిన రైతుల వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సేకరించి ప్రత్యక్షంగా పరిశీలించి ఏపీవో బిల్లులు పథక అధికారి ఎంపీడీవోకు సమర్పిస్తారు. ఎంపీడీవో ఆమోదిస్తే సంబంధిత రైతు ఖాతాకు నేరుగా సొమ్ము జమవుతుంది. అయితే ఉన్నతాధికారుల సూచన మేరకు ఏపీవోలు సమర్పించిన బిల్లులు పథక అధికారి స్థాయిలో ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో రైతులకు చెల్లింపులు ఆగిపోయాయి. ప్రాధాన్యత భవనాలకు కాకుండా ఉద్యానతోటల పెంపకం, సీసీరోడ్లు, మురుగునీటి కాలువలకు పొరపాటున ఎవరైనా బిల్లులు ఆమోదిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. గతేడాది నుంచి డ్రాగన్ తోటల పెంపకానికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించడంతో పలువురు రూ.లక్షలు వెచ్చించి తోటలు వేశారు. ఇలా సాగుచేసిన రైతులు అప్పులు తెచ్చి సాగుచేస్తే బిల్లులు ఎప్పుడిస్తారని ఉపాధి హామీ అధికారులను నిలదీస్తున్నారు. ఈవిషయాన్ని రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా యంత్రాంగంపై రైతులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యత భవనాలు పూర్తిచేయాలని గడువు విధించడంతో ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొందని జిల్లా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రైతులకు ఉపయోగపడే పని చేయలేకపోతున్నామని, బకాయిలు పేరుకుపోవడంతో రైతులు ఆసక్తి ఉన్నా తోటల సాగుకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. రైతులకు ఎప్పటికి సొమ్ము చెల్లిస్తారో తెలియని పరిస్థితి కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం