సాంకేతికత తోడుగా.. అమ్మకు అండ
ప్రతి మహిళ తన జీవితంలో మాతృత్వం ఓ వరంగా భావిస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తల్లి, బిడ్డల సంరక్షణకు కేంద్రం పలు పథకాలను అమలు చేస్తున్నా, ఇంకా మాతా శిశు మరణాల శాతం ఆశించిన మేరకు తగ్గడం లేదు.
కిల్కారీ విధానంలో గర్భిణులు, బాలింతలకు సేవలు
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
శావల్యాపురం, వినుకొండ, న్యూస్టుడే
గర్భిణికి వైద్య పరీక్షలు చేస్తున్న జిల్లా వైద్యాధికారిణి శోభారాణి (పాతచిత్రం)
ప్రతి మహిళ తన జీవితంలో మాతృత్వం ఓ వరంగా భావిస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తల్లి, బిడ్డల సంరక్షణకు కేంద్రం పలు పథకాలను అమలు చేస్తున్నా, ఇంకా మాతా శిశు మరణాల శాతం ఆశించిన మేరకు తగ్గడం లేదు. గర్భం దాల్చిన, బాలింత సమయాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ కొరవడంతో వైద్య పరీక్షలు, సలహాలు, టీకాలు పరంగా అందకపోవడమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యలో కిల్కారీ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు దీన్ని అమలు చేస్తున్నారు. గర్భిణులకు సరైన సమయంలో వైద్యసేవలు అందేలా చర్యలు చేపడతారు. ఈ క్రమంలో గర్భిణి త్రైమాసికం నుంచి 72 వారాల (చిన్నారికి ఏడాది వచ్చే వరకు) వారికి ఒక ఆడియో వాయిస్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ దశల్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఆ సందేశం ద్వారా వినవచ్చు.
సందేశం ఎలా వస్తుందంటే..
నమోదైన ప్రతి గర్భిణి నుంచి సిబ్బంది చరవాణి నెంబరు తీసుకుంటారు. వారికి (0124-468800) నంబరు నుంచి ఫోన్ చేస్తారు. వారికి అందిన వివరాల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్యం గురించి వివరిస్తారు. ఆ సమయంలో మాట్లాడటం కుదరకపోతే 14423 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు. ఆండ్రాయిడ్ ఫోన్తో పాటు కీప్యాడ్ ఫోన్ ఉన్నా సేవలు వినియోగించుకోవచ్చు.
మారుమూల గ్రామాల్లో సైతం
మారుమూల గ్రామాల్లో సైతం గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవగాహన పెరుగుతుంది. మాతా శిశు మరణాలను చాలా వరకు నివారించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వైద్య అధికారులు పేర్కొంటున్నారు.
ఎంతో ప్రయోజనం
- సయ్యద్ ఇబ్రహీమ్ వైద్యాధికారి శావల్యాపురం
కిల్కారీ విధానం గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం. గర్భిణికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా చరవాణి నంబరు ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. స్థానిక ఆరోగ్య, ఆశ కార్యకర్తలు కూడా కీలకంగా పని చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితిపై వారు సమగ్ర నివేదిక అందించాలి. అప్పుడే వారిక సరైన వైద్యసేవలు అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం