మళ్లీ బాదేస్తున్నారు!
మరో పన్నుల మోతకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి పట్టణ, నగర పంచాయతీల్లోని నివాస, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలపై పన్ను మోత మోగనుంది. ఇప్పుడున్న పన్నుపై 15 శాతం చొప్పున పెంపుదల ఉండనుంది. దీనికి సంబంధించి నోటీసుల్ని మున్సిపాల్టీలు సిద్ధం చేస్తున్నాయి.
ఆస్తి, ఖాళీస్థలాల పన్ను 15 శాతం పెంపు
ఒకటి నుంచి అమలుకు సన్నాహాలు
సత్తెనపల్లి, పిడుగురాళ్ల, న్యూస్టుడే
సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయం
మరో పన్నుల మోతకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి పట్టణ, నగర పంచాయతీల్లోని నివాస, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలపై పన్ను మోత మోగనుంది. ఇప్పుడున్న పన్నుపై 15 శాతం చొప్పున పెంపుదల ఉండనుంది. దీనికి సంబంధించి నోటీసుల్ని మున్సిపాల్టీలు సిద్ధం చేస్తున్నాయి. 5నుంచి నోటీసులు ఇవ్వనున్నారు. జిల్లా వాసులపై రూ.కోట్ల భారం పడనుంది.
రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా..: గతంలో రెవెన్యూ జోన్లకు అనుగుణంగా చదరపు అడుగుకు పన్ను పెంపుదల ఉండేది. 2020-21 నుంచి పన్ను పెంపుదలలో ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసింది. జీవో 198 ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పెంపుదల నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విధానంలో రెండేళ్ల నుంచి ఏడాదికి 15 శాతం చొప్పున పన్నులు పెంచుతూ వస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈక్రమంలో నోటీసులు సిద్ధం చేస్తున్నారు.
అభ్యంతరాలు వ్యక్తమైనా..
ఆస్తి మూలధనం విలువ ఆధారంగా పన్నుల పెంపుదలపై పట్టణ ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆస్తిపన్ను భారం మోయలేకున్నామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ప్రజాప్రతినిధుల్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. సత్తెనపల్లిలో 20వ వార్డుతోపాటు 24వ వార్డులో ఆస్తిపన్ను పెంపుదలపై మంత్రి అంబటి రాంబాబును భవన యజమానులు ప్రశ్నించగా పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు.
* వచ్చే నెల 1 నుంచి ఆస్తిపన్ను పెంచితే ఆ భారం అద్దెలకు ఉండే వారిపై పడుతుంది. కొవిడ్ తర్వాత చాలా కుటుంబాలు పట్టణాల నుంచి గ్రామాలకు వలస వెళ్లాయి. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడిప్పుడే ఆయా కుటుంబాలు వస్తున్నాయి. పన్నుల భారం కోణంలో అద్దెలు పెంచితే పేద, మధ్యతరగతి వర్గాల జీవనంపై పరోక్షంగా ప్రభావం చూపించే అవకాశముంది.
రూ.కోట్లలో భారం
పల్నాడు జిల్లాలో ఆరు పట్టణాలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. 1,32,258 అసెస్మెంట్లకు ఆస్తిపన్ను విధిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి అన్ని కలిపి రూ.46.74 కోట్లు డిమాండుగా ఉంది. 15 శాతం పెంపుదలతో రూ.7.01 కోట్ల అదనపు భారం పడనుంది. అత్యధికంగా నరసరావుపేట పట్టణంలో రూ.14.22 కోట్లు ప్రస్తుతం డిమాండుగా ఉంటే రూ.2.13 కోట్లు, చిలకలూరిపేటలో రూ.11.53 కోట్లకు అదనంగా రూ.1.73 కోట్లు, సత్తెనపల్లిలో రూ.5.57 కోట్లతోపాటు అదనంగా రూ.83.55 లక్షలు భారం పడబోతుంది.
* ఖాళీ స్థలాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 4,653 అసెస్మెంట్లు ఉన్నాయి. వాటికి రూ.2.49 కోట్లు డిమాండుగా ఉంది. వీటిపై 15 శాతం పెంపుదలతో అదనంగా రూ.37.35 లక్షల భారం మోపనున్నారు.
* నివాస గృహాలపై 15 శాతం భారం తప్పనిసరి అని, వాణిజ్య భవనాలతోపాటు నూతన అసెస్మెంట్లపై భారం కొంతమేరకు తగ్గవచ్చని అధికారులు చెబుతున్నారు.
* వచ్చే నెల 5 నుంచి పన్నుల పెంపుదలకు అనుగుణంగా సిద్ధం చేసిన డిమాండు నోటీసులు అందజేయనున్నారు. అన్ని మున్సిపాల్టీల్లో సన్నాహాలు పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
స్వతంత్ర అభ్యర్థిని.. కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.