పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది
అధ్వానంగా కృష్ణా కరకట్ట రోడ్డు
ఈ రహదారిలో వాహనాలు ఎదురైతే ఇంతే
కొల్లూరు, న్యూస్టుడే: దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది. దీంతో వాహనాలు ఆ రహదారిలో గంటల కొద్దీ సమయం నిలిచిపోవడం నిత్యకృతంగా మారింది. ఈ రహదారి వల్ల ఏటా గాలిలో కలిసిపోయే ప్రాణాలు కొన్నైతే, క్షతగాత్రులు ఎందరో లెక్కే లేదు. ఆరేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కొల్లూరు - ఈపూరు కరకట్ట రహదారి దుస్థితి ఇది. కేవలం కిలోమీటరు మేర దెబ్బతిన్న ఈ రహదారి నిర్మాణానికి సంబంధిత నదీపరిరక్షణ శాఖ న్యాయపరమైన అడ్డంకులను సాకుగా చూపి కాలం గడుపుతోంది. ప్రజాప్రతినిధులు సైతం కనీసం స్పందించక పోవడం విస్మయం కలిగిస్తోంది. 15సంవత్సరాల క్రితం కృష్ణానది పశ్చిమ కరకట్టపై విజయవాడ నుంచి కొల్లూరు మండలం దోనేపూడి వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర నదీ పరిరక్షణ శాఖ తారు రోడ్డు నిర్మాణం చేసింది. దీంతో కొల్లూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు దూరం 60 నుంచి 40 కిలోమీటర్లకు తగ్గింది. ఈ రహదారి గుండా ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతోంది. ఎనిమిదేళ్ల క్రితం దీన్ని డబుల్ రోడ్డుగా నిర్మాణం చేశారు. అయితే కొల్లూరు - ఈపూరు మధ్య కరకట్ట, కాలువ నడుమ ఉన్న భూమిని ఓ మాజీ సైనికుడికి కేటాయించారు. కరకట్ట రహదారి విస్తరణలో భాగంగా కొల్లూరు లాకుల వంతెన నుంచి ఈపూరు వైపు కిలోమీటరు పొడవునా డబుల్ రోడ్డు నిర్మాణం చేసేందుకు నదీ పరిరక్షణశాఖ పనులు ప్రారంభించగా ఈ కరకట్ట రహదారి విస్తరణ జరిగితే తనకు కేటాయించిన భూమిని కోల్పోవాల్సి రావడంతో ఆ మాజీ సైనికుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో ఇక్కడ కిలోమీటరు పొడవున విస్తరణ చేసేందుకు న్యాయపరమైన అవరోధాలు ఏర్పడ్డాయి. న్యాయస్థానంలో ఈ వివాదం కొనసాగుతోంది. నిత్యం ఈ రహదారి వెంట ఇసుక రవాణా చేసే వాహనాలతో పాటు వివిధ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అంచులు దెబ్బతిని క్రమంగా ప్రయాణానికి వీలు లేని విధంగా తయారయింది. దీంతో ఈ కొద్ది దూరం ప్రయాణించేందుకు వాహనదారులు హడలి పోతున్నారు. ఎదురుగా వచ్చిన వాహనాలు తప్పుకోవాలంటే ప్రాణసంకటంగా మారింది. కొంచెం ఆదమరిస్తే తూర్పు వైపున 20 అడుగులకు పైగా లోతు ఉన్న పొలాల్లో లేదంటే పడమర వైపు ఉన్న కృష్ణా పశ్చిమ బ్రాంచి కాలువలోకి పడిపోయే ప్రమాదం ఉంది. కనీసం మరమ్మతులైనా చేపడితే చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయని వాహనదారులు, స్థానికులు మొరపెడుతున్నా ప్రయోజనం లేదు. కనీసం ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వారు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వట్టిచెరుకూరులో తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో శనివారం సూపర్ సిక్స్ పథకాల శంఖారావం కార్యక్రమాలను నిర్వహించారు. -
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి