logo

‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’

వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్‌ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

Published : 28 Mar 2024 06:25 IST

మాట్లాడుతున్న పెమ్మసాని చంద్రశేఖర్‌, పక్కన రామాంజనేయులు
పెదనందిపాడు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్‌ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని నాగులపాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రామాంజనేయులు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొర్రపాటి నాగేశ్వరరావులతో కలసి ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం పెదనందిపాడు తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలలో తెదేపాకు  ఆదరణ పెరుగుతుందన్నారు. ఉపాధి కల్పనకు, పేదరిక నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, ఖలీల్‌, నాయకులు హర్ష, చెంచయ్య, ప్రసాద్‌, రాకేష్‌, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, నాగబాబు, జనసేన నాయకులు త్రినాథ్‌, నరేంద్ర, మాజీ సర్పంచి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. తొలుత నాయకులకు రెండు గ్రామాలలో ప్రజలు ఘన స్వాగతం పలికారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని