logo

కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తాం : నాదెండ్ల

పట్టణంలోని యడ్లలింగయ్య, ఫులె కాలనీల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాగునీటి, డ్రైనేజీ సమస్య ఆయనకు తెలియజేయగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Published : 05 May 2024 05:40 IST

వృద్ధురాలితో మాట్లాడుతున్న మనోహర్‌

తెనాలి టౌన్‌ : పట్టణంలోని యడ్లలింగయ్య, ఫులె కాలనీల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాగునీటి, డ్రైనేజీ సమస్య ఆయనకు తెలియజేయగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఓ వృద్ధురాలి పింఛను సమస్యను మనోహర్‌ మోకాలిపై కూర్చుని విని, కొత్త ప్రభుత్వంలో ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి శ్రీరత్న గుడివాడ గ్రామస్థులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

కొల్లిపర: నాదెండ్ల మనోహర్‌ భార్య మనోహరం శనివారం మండలంలోని హనుమాన్‌పాలెం, అన్నవరం, దావులూరిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు.  నాయకులు యోగానందచటర్జి, సర్పంచి జోగేంద్ర, శివరామిరెడ్డి పాల్గొన్నారు.

మనోహర్‌ కుమారుడు మిథుల్‌ తూములూరు లో శనివారం పర్యటించారు. నాయకులు కట్టాశ్రీహరి, కొల్లి కోటిరెడ్డి, కొండాకిశోర్‌రెడ్డి పాల్గొన్నారు.బీ మండలంలోని నందివెలుగులో నిర్వహించిన రోడ్‌షోలో నాదెండ్ల మనోహర్‌, పెమ్మసాని సతీమణి శ్రీరత్న పాల్గొని మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని