Hyd: ఉగ్రవాదులుంటున్నా ఉలుకూ పలుకూలేదు
బిహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వెనుక ఇద్దరు ఉగ్రవాదులు నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్లున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఎ) అధికారులు గుర్తించారు. వీరు మల్లేపల్లిలోని ఒక ప్రార్థన మందిరం వద్ద వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు.
వారి కార్యకలాపాలపై పోలీసుల దృష్టి అంతంతే
ఈనాడు, హైదరాబాద్: బిహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వెనుక ఇద్దరు ఉగ్రవాదులు నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్లున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఎ) అధికారులు గుర్తించారు. వీరు మల్లేపల్లిలోని ఒక ప్రార్థన మందిరం వద్ద వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. వారిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని దిల్లీకి తరలించారు.
‘‘బెంగళూరు.. హైదరాబాద్ నగరాల్లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రముఖులను చంపేందుకు హుజీ ఉగ్రవాద సంస్థ కార్యచరణ రూపొందించిందని బెంగళూరు క్రైమ్బ్రాంచ్ పోలీసులు తొమ్మిదేళ్ల క్రితం తెలుసుకున్నారు. హైదరాబాద్లో హుజి సంస్థ తరఫున పనిచేస్తున్న పాతబస్తీ యువకుడు ఉబేద్-ఉర్-రహిమాన్ను బెంగళూరు నుంచి వచ్చి అరెస్ట్ చేశారు.
- రాజధాని నగరంలో ఉగ్రవాదులు, ఉగ్రసంస్థల కార్యకలాపాలకు సజీవ సాక్ష్యాలు ఈ సంఘటనలు. ఈ రెండు ఘటనల్లో ఉగ్రవాదులను హైదరాబాద్ పోలీసులు పట్టుకోలేదు. బయట నుంచి వచ్చిన పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులను అరెస్ట్ చేసేంత వరకు మన పోలీసులకు విషయం తెలీదు.
సమాచారమా? తెలీదు.. దక్షిణాది రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూరు, కోచి పరిసర ప్రాంతాల్లో ఉగ్రసంస్థలు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బెంగళూరు క్రైమ్బ్రాంచ్ పోలీసులు, కేరళ ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక దళం) పోలీసులు ఎప్పటికప్పుడు ఉగ్రకలాపాలపై సమాచారం సేకరిస్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలతో సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో చాపకింది నీరులా ఇండియన్ ముజాహిదీన్, లష్కర్-ఎ-తోయిబా, హుజీ వంటి ఉగ్ర సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ఆయా సంస్థల సభ్యులు రహస్యంగా ఇక్కడ ఉంటున్నా పోలీసులకు తెలీదు. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, జాతీయ దర్యాప్తు సంస్థ పోలీస్ అధికారులు ఇక్కడి వచ్చి ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులను అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే పోలీసులకు తెలుస్తోంది..
అడ్డాగా పాతబస్తీ, మల్లేపల్లి, టోలీచౌకీ.. ఉగ్రసంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు పాతబస్తీ, మల్లేపల్లి, టోలీచౌకీలను కేంద్రాలుగా ఎంచుకున్నాయని నిఘా సంస్థల దర్యాప్తులో తేలింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, సంతోష్నగర్ ప్రాంతాలు, పశ్చిమ మండలంలోని మల్లేపల్లి, టోలీచౌకీల్లో ఎక్కువగా ఉగ్రవాద సంస్థల సభ్యులు నివాసముంటున్నారు. వీరిలో చాలామంది వస్త్రవ్యాపారులు, ఫర్నిచర్ దుకాణాల యజమానులుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ఐటీ సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మల్లేపల్లి ప్రాంతంలో ఎనిమిదేళ్లలో ఆరుగురు ఉగ్రవాదులను కేంద్ర నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. తాజాగా ఎన్.ఐ.ఎ.కు పట్టుబడిన నాసిర్మాలిక్ ఇరవై ఏళ్ల క్రితం నుంచి మల్లేపల్లిలోనే ఉంటున్నాడు. మధ్యలో రెండుసార్లు పాకిస్థాన్ వెళ్లొచ్చాడని విచారణలో తేలింది. పదేళ్లుగా వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న మాలిక్ సోదరులపై మన పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు.
భద్రతలో నిర్లక్ష్యం.. ‘రైల్వే’నే నిదర్శనం
సికింద్రాబాద్ పార్సిల్ బుకింగ్ కార్యాలయం నుంచి వెళ్లిన ఓ పార్సిల్.. బిహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పేలింది. ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర కోణాలున్నాయని ఎన్ఐఏ విచారణలో వెల్లడవుతోంది. ఇప్పటికే సదరు పార్సిల్ను బుకింగ్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా.. రైల్వేపరంగా ఎలాంటి అప్రమత్తత లేదు. పార్సిల్ బుకింగ్ ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా కొనసాగుతోంది. పేలుడు తదితర పదార్థాలను గుర్తించే మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. పార్సిల్ బుకింగ్ కేంద్రం, రైల్వేస్టేషన్లో పటిష్ట బందోబస్తుకే పరిమితమయ్యారు.
అడుగడుగునా భద్రతా లోపాలు.. సికింద్రాబాద్ స్టేషన్లో భద్రత గాలిలో దీపంలా మారింది. స్టేషన్ ప్రవేశ మార్గాల్లోనే సరకులు, బ్యాగులు స్కాన్ అయిపోవాలి. లేని పక్షంలో స్కానర్ యంత్రంలో వాటిని వేసిన తర్వాతే స్టేషన్లోకి అనుమతించాలి. మెట్రోలో మాదిరి ప్రయాణికుల చేతి సంచులూ స్కాన్ చేయాల్సిందే. లక్షలాది ప్రయాణికులను, వారి సామగ్రిని తనిఖీ చేయడం కత్తిమీద సాములాంటిదే. కానీ భద్రత దృష్ట్యా తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ర్యాంకర్లను సత్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
[ 04-05-2024]
భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు మాత్రమే లబిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. -
క్రషర్ క్వారీలో పడి మరో యువకుడు బలి
[ 04-05-2024]
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలోనే మరో యువకుడు క్రషర్ క్వారీలో పడి గౌతమ్ (21)మృతి చెందాడు. -
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
[ 04-05-2024]
సాయంత్రం సమయం.. అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
[ 04-05-2024]
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
[ 04-05-2024]
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మొదటి నుంచి స్థానికేతరులకే పట్టంకడుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు విజయం సాధించలేకపోయారు. -
గడప దాటిస్తే ... గండం గడిచినట్లే
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడటంతో బూత్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచారం ఒకెత్తయితే పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం చాలా కీలకం. -
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
[ 04-05-2024]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
[ 04-05-2024]
తక్కువ ధరకే ప్లాట్లు విక్రయిస్తామంటూ దంపతులు 15 మందికి రూ.12.35 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. తప్పుడు ప్రకటనలు, ఫోర్జరీ పత్రాలతో మోసగించిన వీబీజే క్యాప్స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కందుల వెంకట ప్రసాద్ గుప్తా, ఆయన భార్య అనురాధను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటనలో తెలిపారు. -
నగర ఓటరు.. తీర్పు ఎప్పటికప్పుడు మారు
[ 04-05-2024]
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో నగర ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నినెలల వ్యవధిలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. -
సైబర్సిటీలో భారీగా వాడకం
[ 04-05-2024]
ఐటీ కార్యాలయాలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలకు నిలయమైన సైబర్సిటీ సర్కిల్ పరిధిలో వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సిటీలోని తొమ్మిది సర్కిళ్లలో ఇక్కడే అత్యధిక వాడకం నమోదైంది. -
బంధాన్ని కాదని.. భర్తను బంధించి
[ 04-05-2024]
ఆస్తి కోసం భార్య ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. -
తరుణీ కరుణించు
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల కోసం రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. -
పట్టణ ఓటరుపై పట్టుకు..
[ 04-05-2024]
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గేటర్లో రాజకీయ వేడి మొదలైంది. మహానగరంలో 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. -
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
[ 04-05-2024]
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు బుద్ధిచెప్పాలని మజ్లిస్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
రంజిత్రెడ్డికి ఓట్లతో గుణపాఠం చెప్పాలి
[ 04-05-2024]
రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన భారాసకు ద్రోహం చేసిన రంజిత్రెడ్డికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లిలో శుక్రవారం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. -
తపాలా ఓటులో తడబాటు.. వెనుదిరిగిన ఓటర్లు
[ 04-05-2024]
రాజధానిలో కోటి పదిలక్షల మంది ఓటర్లుండగా.. సుమారు పది వేల పోలింగ్ కేంద్రాల్లో 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. భద్రతా సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిపితే మరో 20వేల మంది ఉంటారు. -
ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్ర
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారాస కుట్రలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పట్టణంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కౌన్సిలర్ భరత్ బృందం పార్టీలో చేరిన సందర్భంగా సభ నిర్వహించారు. -
మా అభ్యర్థులను గెలిపించుకుంటాం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్రావు ప్రకటించారు. -
నక్షత్రాలు,గ్రహాల గుట్టు తెలుసుకుందాం
[ 04-05-2024]
వినూత్న పరిశోధనలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు.. అంతరిక్ష పరిశోధనలపై ప్రోత్సహించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మినీ అబ్జర్వేటరీని ప్రారంభించింది. -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
[ 04-05-2024]
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాదబాటపై నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరిగుట్టకి చెందిన తుమ్మ భావన రుషి (35) రెండేళ్ల క్రితం సుజాత అనే ఉపాధ్యాయురాలిని ప్రేమ వివాహం చేసుకొని వెంకటగిరిలో నివసిస్తున్నాడు. -
ఎవరిదో పైచేయి
[ 04-05-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (టీఆర్ఆర్, గడ్డం ప్రసాద్కుమార్, బుయ్యని మనోహర్రెడ్డి), భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు (ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్) తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు సాధించడంపై దృష్టి నిలిపారు. -
భారాస విజయానికి వ్యూహ రచన
[ 04-05-2024]
తాండూరులో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తాండూరు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ