చేరువలోపాలన..వినేవారు లేక వేదన!
పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో సర్కారు ముందుకు సాగుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
ఈనాడు డిజిటల్, వికారాబాద్: పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో సర్కారు ముందుకు సాగుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఒక వేళ వారికి వివరించినా పరిష్కారం విషయంలో శ్రద్ధ చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, మట్టి తవ్వకాలు, ఇసుక తరలింపు, పట్టాపాసు పుస్తకాలు అందకపోవడం వంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాఖల వారీగా ప్రస్తుత పరిస్థితిపై కథనం.
ఉపాధ్యాయుల గెర్హాజరుపై చర్యలేవి?
భావిపౌరులకు చదువు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అనధికారికంగా విధులకు డుమ్మాకొడుతున్నారు. వారానికి ఒక రోజు వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేస్తున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒకే రోజు 18 మంది ఉపాధ్యాయులు విధులకు అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తించారు. అయినా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఈ ఉపాధ్యాయుడు మాకు వద్దు, పాఠశాలకు రాడు, పాఠాలు చెప్పరని విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా, సంబంధిత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు శూన్యం. దీంతో మిగతా సిబ్బంది అదే తీరున వ్యవహరిస్తున్నారు.
అటకెక్కిన సమీక్షలు: వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై నిరంతరం పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోవడం లేదని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కింది స్థాయి సిబ్బందికి మేం చెప్పేది చెబుతాం. జిల్లా ఉన్నతాధికారులు కనీసం ఒక సారైనా మాట్లాడితే అప్రమత్తంగా వ్యవహరిస్తారని అంటున్నారు. రెవెన్యూ, జిల్లా గ్రామీణాభివృద్ధి, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, వ్యవసాయ అనుబంధ రంగాలు, జలవనరులు, వైద్యారోగ్య, విద్యుత్తు, తదితర శాఖలపై నెలలుగా సమీక్షా సమావేశాలు లేవంటున్నారు. కలెక్టర్ కార్యాలయంలో దశాబ్దాల కిందట నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 100 నుంచి 150 మంది అర్జీలు సమర్పిస్తున్నారు. సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.
కలెక్టరేట్లో అర్జీదారులు
కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులు: వికారాబాద్ ఆర్డీవో దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్ల వల్లే ఆయన వెళ్లారని చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశించగా, నిబంధనలకు విరుద్ధంగా చేయలేనని తెగేసి చెప్పిన ఆర్డీఓ, చివరకు ఆ అధికారి ఉన్నంత వరకు నేను విధులకు హాజరు కాను అంటూ సెలవుపై వెళ్లిపోయారు. మరో తహసీల్దార్ను సైతం వేధింపుల వేడి తాకింది. ఉన్నతాధికారి సహాయకుడు ఓ దస్త్రం పంపించాలని చెప్పడంతో. వివాదం మొదలైంది. పంపించమంటే ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ ఫైల్స్ మొత్తం పంపిస్తానని సమాధానం ఇచ్చారని తెలిసింది.
కబ్జాకు గురవుతున్నా..: జలవనరుల శాఖ పరిధిలో 1,127 చెరువులు, 9 ప్రాజెక్టులున్నాయి. పంచాయతీ, పురపాలక సంఘాలకు మరికొన్ని నీటి వనరులు ఉన్నాయి. సాగు, వరద కాల్వలు వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించాయి. అయితే వీటిల్లో ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవట్), బఫర్ జోన్, శిఖం భూములు కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా కొంతమంది స్థిరాస్తి వ్యాపారుల వద్ద ముడుపులు తీసుకుని జలవనరుల శాఖాధికారులు ఎన్ఓసీలు (నిరభ్యంతర పత్రం) జారీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఫిర్యాదు వచ్చినా ఉన్నతాధికారులు మిన్నకుంటున్నారని సమాచారం.
ఆగని అక్రమ రిజిస్ట్రేషన్ల్లు
తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి అక్రమ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బాధితులు ఫిర్యాదు చేసినా ఇటువంటివారిపై చర్యలు కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిని బాధ్యులు చేస్తున్నారు. వికారాబాద్, మోమిన్పేట, ధారూర్, పరిగి, పూడూరు, తదితర మండలాల్లో ఈ తరహా వ్యవహారాలు జోరుగా నడుస్తున్నాయి. కాసులకు కక్కుర్తిపడి రెవెన్యూ ఉద్యోగులే అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు కార్యాలయ సిబ్బందే తయారు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నా, ఉన్నతాధికారుల్లో చలనం కనిపించడం లేదు. ఫలితంగా రూ.కోట్ల విలువైన భూములను అమాయకులు కోల్పోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా