logo

‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’

కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.

Updated : 26 Apr 2024 05:49 IST

కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. గురువారం మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎల్బీనగర్‌ నుంచి మెట్రోలో ప్రయాణం చేసి ప్రయాణికులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కూకట్‌పల్లి మెట్రోస్టేషన్‌ వరకు ప్రచారం చేశారు. అనంతరం అక్కడ దిగి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో రికార్డు మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ..డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ తుంగలో తొక్కి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కె.పి.వివేకానంద్‌, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, దయానంద్‌గుప్తా, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని