logo

న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు

ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి అన్నారు.

Published : 26 Apr 2024 01:41 IST

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి అన్నారు. జిల్లా కోర్టుల నుంచి ఇటీవల బదిలీ అయిన న్యాయమూర్తులు నర్సిరెడ్డి, భవానీచంద్ర, పంచాక్షరి, ఇందిర, మాధవీలతకు న్యాయవాదుల సంఘం గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమర్థంగా పనిచేస్తే బదిలీ తర్వాత కూడా ఆ అధికారిని అంతా గుర్తుంచుకుంటారన్నారు. రంగారెడ్డి జిల్లాలో పనిచేసే న్యాయమూర్తులకు అపార అనుభవం వస్తుందని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి పట్టాభి రామారావు అన్నారు. బదిలీ అయిన వారిని న్యాయవాదులు సత్కరించారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల సహకార సంఘ సంచాలకులు బాచిరెడ్డి శాయిరెడ్డి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు అనంతసేనారెడ్డి, న్యాయవాదుల సంఘ ప్రతినిధులు కె.కొండల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, కృష్ణ, రాధాకృష్ణ, మీనాక్షి, కెరిత్‌ కుమారి, అశోక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని