logo

రేవంత్‌రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం అత్తాపూర్‌లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు.

Published : 26 Apr 2024 01:36 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం అత్తాపూర్‌లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే తన ప్రసంగాన్ని ఆపిన రేవంత్‌రెడ్డి అతడికి నీళ్లివ్వాలంటూ కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి వాహనంపైనే ఉన్న ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి వెంటనే కిందికి నీటి సీసాలను విసిరారు. పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాలంటూ ఆదేశించడంతో సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అతనిని ఖైరతాబాద్‌కు చెందిన ఖలీంఖాన్‌గా గుర్తించినట్లు రాజేంద్రనగర్‌ ఎస్సై రవికిరణ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని