శుచి లేదు.. శుభ్రతా లేదు!
గ్రేటర్ నగరంలో మినరల్ వాటర్ పేరుతో భారీదందా నడుస్తోంది. శుచి.. శుభ్రత లేకుండా మురికి వాడలు, చిన్నచిన్న గల్లీల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఈ ప్లాంట్లపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా... అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేవని తేలింది. తాగునీటి వ్యాపారం చేయాలంటే భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్)
మినరల్ వాటర్ పేరుతో దందా
అక్రమంగా ఐఎస్ఐ మార్కు వినియోగం
ఈనాడు, హైదరాబాద్
నాంపల్లిలో వాటర్ప్లాంటు చుట్టూ మురుగునీరు
గ్రేటర్ నగరంలో మినరల్ వాటర్ పేరుతో భారీదందా నడుస్తోంది. శుచి.. శుభ్రత లేకుండా మురికి వాడలు, చిన్నచిన్న గల్లీల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఈ ప్లాంట్లపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా... అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేవని తేలింది. తాగునీటి వ్యాపారం చేయాలంటే భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) లైసెన్సు తీసుకోవాలి. గ్రేటర్లో వందల సంఖ్యలో నీటి ప్లాంట్లు ఉంటే... తెలంగాణ వ్యాప్తంగా ఈ కోడ్ పొందిన ప్లాంట్లు కేవలం 154 మాత్రమే. కొన్ని ప్లాంట్లును అక్రమంగా ఐఎస్ఐ కోడ్ను వినియోగిస్తున్నాయి. కొత్తూరులోని ఓ ప్లాంట్ను ఇటీవలే బీఐఎస్ అధికారులు సీజ్ చేశారు.
అనేక రోగాలకు కారణం
అపరిశుభ్రత, కల్తీ నీటిని తాగడం వల్ల అనేక రోగాలు దాడిచేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నాంపల్లి, అమీర్పేట, జియాగూడ, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట.. ఇలా అనేక ప్రాంతాల్లో ఇరుకు గల్లీలు, అపరిశుభ్రమైన ప్రాంతాల్లో తాగు నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కొన్ని మురికి కాల్వల పక్కనే దర్శనమిస్తున్నాయి. ల్యాబొరేటరీ, టెస్ట్ రికార్డులు, లేబుల్, ప్యాకేజీ ఇవన్నీ పక్కాగా జరగడం లేదని ‘ఈనాడు’ పరిశీలనలో తేలింది.
బోరు నీరే సరఫరా
అమీర్పేట: సనత్నగర్, అమీర్పేటల్లో పదికి పైగా మినరల్ వాటర్ ప్లాంట్లకు ఎటువంటి అనుమతి లేదు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, వెంకటేశ్వర ఆలయం, సనత్నగర్, అశోక్ కాలనీల్లో వాటర్ ప్లాంట్లు అక్రమంగా కొనసాగుతున్నాయి. బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి చాలా దుకాణాల్లో ఈ నీటిని విక్రయిస్తున్నారు. ఫతేనగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో మురుగు కాల్వ పక్కనే బోరువేసి, ఆ నీటినే మినరల్ వాటర్గా విక్రయించడంతో గతంలో అధికారులు ప్లాంట్ను సీజ్ చేశారు.
విచ్చలవిడిగా బోర్లు
చాంద్రాయణగుట్ట: ఉప్పుగూడ దానయ్యనగర్, లలితాబాగ్, కందికల్గేట్, బండ్లగూడ, గౌలిపురా శ్రీరాంనగర్ కాలనీ, ఉప్పుగూడ, శివసాయినగర్, చాంద్రాయణగుట్ట, బాబానగర్, తలాబ్కట్ట, మొఘల్పురా, ఇంజన్బౌలి, జంగమ్మెట్ తదితర ప్రాంతాల్లో అక్రమ మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతోంది.
30పైగా ప్లాంట్లు
చిలకలగూడ దోభీఘాట్ బస్తీలో
సికింద్రాబాద్: చిలకలగూడ, ఉప్పర్బస్తీ, తార్నాక, మెట్టుగూడ, అడ్డగుట్ట, సీతాఫల్మండి, పార్శిగుట్ట, వారాసిగూడ, బౌద్ధనగర్ తదితర ప్రాంతాల్లో సుమారు ముప్పైకిపైగా అక్కమ ప్లాంట్లు విస్తరించి ఉన్నట్లు సమాచారం.
బోర్లతో తోడేసి
రెజిమెంటల్ బజారులో
యూసుఫ్గూడ: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారుగా పాతిక అనధికారిక మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. యూసుఫ్గూడ, వెంకటగిరి, సీ-బ్లాకు, హైలంకాలనీ, రహ్మత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెయ్యి అడుగుల లోతు వరకు బోర్లను ఏర్పాటు చేసుకున్నారు.
మూసీ నది ఒడ్డున
గౌలిగూడచమన్లో అపరిశుభ్రత నడుమ
నాంపల్లి: గాంధీ భవన్ పక్కనే, మెయిన్ రోడ్డుకు కూతవేటు దూరంలోనే పటేల్ నగర్లో ఓ వాటర్ ప్లాంటులో నీటి దందా నడుస్తోంది. బజార్ఘాట్, షేర్గల్లీ, దేవీబాగ్, భరత్నగర్, హబీబ్నగర్, జవహర్నగర్, కోమటికుంట, జంగంబస్తీ, ఏడుగుళ్లు, దారుస్సలాం రోడ్, ఏసీ గార్డ్స్ తదితర ప్రాంతాల్లో గల్లీకో అక్రమ మినరల్ వాటర్ ప్లాంటు ఉన్నాయి. జియాగూడ కేశవస్వామినగర్, దరియాబాగ్ మూసీనది ఒడ్డునే రెండు అక్రమ ప్లాంట్లు కొనసాగుతున్నాయి.
శివారుల్లోనూ అదే తీరు
ఇంట్లోనే నిర్వహణ
ఘట్కేసర్: రామంతాపూర్, హబ్సిగూడ, ఉప్పల్, చిలుకానగర్, నాచారం, కాప్రా, ఘట్కేసర్, మేడిపల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, జవహర్నగర్ శామీర్పేట, కీసర తదితర ప్రాంతాల్లోని సామాన్యులు ఫ్లోరిన్ బారిన పడుతుండటంతో తాగునీటికి శుద్ధి కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. రోజుకు రూ.8 లక్షల నుంచి 10లక్షల వరకు వ్యాపారం కొనసాగిస్తున్నట్లు అంచనా.
ఇరుకైన గదుల్లోనే
బేగంబజార్: అఫ్జల్గంజ్ అశోక్బజార్, నాంపల్లి గాంధీ భవన్ వెనక పటేల్ నగర్ బస్తీ, ఏక్మినార్ మసీదు, పురానాపూల్, సిటీ కాలేజీ సమీపంలో అక్రమ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. ఏక్మినార్ మసీదు సమీపంలో, గాంధీ భవన్ వెనుక కొనసాగుతున్న రెండు ప్లాంట్లను గతంలో నాంపల్లి మండల తహసీల్దారు సీజ్ చేసినా రాజకీయ ఒత్తిడితో కొన్ని రోజులకే తెరిచి కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మడతల చొక్కా వేసుకో.. పర్యావరణాన్ని కాపాడుకో
[ 19-05-2024]
ఎండలైనా, వానలైనా అసాధారణంగా ఉంటున్నాయి. ఎందుకిలా అని వాతావరణ శాస్త్రవేత్తలను అడిగితే పర్యావరణ మార్పుల ప్రభావం అంటున్నారు. తగ్గించేందుకు మన వంతుగా ఏమైనా చేయవచ్చా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు.. ఓవైపు ల్యాబ్ల్లో ప్రయోగాలు చేస్తూనే.. -
పట్టుదలతో చదివి.. సత్తా చాటి
[ 19-05-2024]
పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు. -
గంటలో కుంటలా...
[ 19-05-2024]
వరుణుడు మరోసారి నగరంపై ఉరిమాడు. శనివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, హయత్ నగర్లో అరగంట నుంచి గంట వ్యవధిలో కుండపోతగా పడింది. అత్యధికంగా లింగంపల్లిలో 6.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
స్థానిక సంస్థలపై కాంగ్రెస్ గురి
[ 19-05-2024]
నార్సింగి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ దారుగుపల్లి రేఖ, వైస్ఛైర్మన్ వెంకటేశ్యాదవ్(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్రెడ్డి -
పుస్తకాలకు, బల్లలకు ఆకతాయిల నిప్పు
[ 19-05-2024]
జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, బల్లలకు ఆకతాయిలు నిప్పు పెట్టిన సంఘటన తాండూరు మండలం కరణ్కోటలో జరిగింది. శనివారం పాఠశాలలోకి ప్రవేశించిన ఆకతాయిలు సామగ్రి నిల్వ గదిలోకి వెళ్లారు. -
జూలో ఖడ్గమృగాల సంతతి వృద్ధి
[ 19-05-2024]
నగర నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల సంతతి క్రమంగా పెరుగుతోంది. వాటి ప్రదర్శన, విశ్రాంతికి మరో ఎన్క్లోజర్ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి వాటిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) దత్తత తీసుకొంటోంది. -
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
[ 19-05-2024]
నీటి ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది. -
సెప్టెంబరుకు.. ‘సుంకిశాల’ అందేనా?
[ 19-05-2024]
నాగార్జునసాగర్ డెడ్స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి సమాయత్తమవుతోంది. -
చిన్న వర్షం.. అతలాకుతలం
[ 19-05-2024]
నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. -
మానసిక కుంగుబాటుతో చందు బలవన్మరణం
[ 19-05-2024]
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) అలియాస్ చందు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. త్రినయని సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న చందు శుక్రవారం మణికొండలో బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. -
సైబర్ నేరస్థులకు.. ‘మ్యూల్’ ఖాతాలు తెరుస్తూ..
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి ముమ్మర ఏర్పాట్లు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్శర్మ తెలిపారు. -
నాసిరకం ముప్పు.. కావాలి కనువిప్పు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ దగ్గర పడుతోంది. పొలాలను శుభ్రం చేసే పనులు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా నాసిరంక విత్తనాలు కూడా విపణిలోకి తెచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. -
పర్యవేక్షణ శూన్యం.. ఇసుక మాయం
[ 19-05-2024]
ప్రభుత్వ లక్ష్యానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నిర్మాణాలు సాగాలి. గుత్తేదారు దానికి తగినట్లుగా పనులు చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. -
12 శాతం రిజర్వేషన్ కోసం మాదిగ జన సభలు
[ 19-05-2024]
తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మాదిగ జన సభలు’ నిర్వహిస్తున్నట్లు మాదిగ ఐకాస ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
చెత్త కుప్పలు తొలగించేదెవరు?
[ 19-05-2024]
ఎన్ని చర్యలు తీసుకున్నా పారిశుద్ధ్యం పట్టాలెక్కడం లేదు. నగరవ్యాప్తంగా 23 లక్షల ఇళ్లు ఉన్నాయని అంచనా. వాటన్నింటి నుంచి నిత్యం చెత్త సేకరణకు ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలున్నాయి. -
అటవీ భూమి కేటాయింపులు సబబే
[ 19-05-2024]
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్ కంచ, సరూర్నగర్ మండలం మామిడిపల్లిలో అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు సమర్ధించింది. -
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో టోకరా
[ 19-05-2024]
కొంపల్లిలో ఖరీదైన ప్రాంతంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముగ్గురు మోసగాళ్లను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
[ 19-05-2024]
పలు విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని మహేశ్వరం ఎస్వోటీ బృందం, చైతన్యపురి పోలీసుల సహకారంతో అరెస్టు చేసింది. -
వారణాసిలో ప్రచారానికి భాజపా బృందం
[ 19-05-2024]
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి
[ 19-05-2024]
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
పోరాటయోధుల చరిత్ర గ్రంథస్థం చేస్తాం
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ -
రైల్వే, ఆదాయపన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం
[ 19-05-2024]
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ కథనం ప్రకారం.. -
క్యాన్సర్పై సమగ్ర పుస్తకం అభినందనీయం
[ 19-05-2024]
క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్ డా.రామకృష్ణ