కొత్త కోర్సులు.. సరికొత్త అవకాశాలు
విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించి ఏడాదైంది. ఈ ఏడాదిలో వారు తీసుకున్న చర్యలేమిటి.? భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు.? కొత్త కోర్సులేం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. తదితర అంశాలపై బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతులతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు....
ఈనాడు, హైదరాబాద్
విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించి ఏడాదైంది. ఈ ఏడాదిలో వారు తీసుకున్న చర్యలేమిటి.? భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు.? కొత్త కోర్సులేం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. తదితర అంశాలపై బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతులతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు.
విద్యార్థులకు ప్రత్యేకంగా మొబైల్ యాప్
- కె.సీతారామారావు, ఉపకులపతి, బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
1. ఏడాదిలో యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొస్తున్నాం. న్యాక్ అక్రిడిటేషన్కు సంబంధించి ప్రక్రియ చేపట్టాం. అకడమిక్, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాం. ఈఎమ్మార్సీ, సీఎస్టీడీని ఆధునికీకరించాం. సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్ ఏర్పాటు చేసి రెండు కోర్సులు తీసుకొచ్చాం. ఫీజు చెల్లింపులన్నీ ఆన్లైన్లో చేశాం. రాష్ట్రవ్యాప్తంగా లెర్నర్ సపోర్టు సెంటర్లు(ఎస్ఎస్సీ) పెంచుతున్నాం. సెమిస్టర్ తరగతులు 70 శాతం ఆన్లైన్, 30 శాతం ఆఫ్లైన్లో బోధిస్తున్నాం.
2. ఆచార్యుల భర్తీ జరగకపోవడంతో బోధనపై ప్రభావం పడుతోంది. దీన్నెలా అధిగమిస్తున్నారు.?
రెగ్యులర్ ఆచార్యులు లేకపోయినా.. బోధనకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. పదవీ విరమణ చేసిన, ఒప్పంద ఆచార్యులను నియమించుకున్నాం.
3. ప్రభుత్వం నుంచి జీతాలకు మినహా ఇతరత్రా గ్రాంట్లు రావడం లేదు. నిధుల కొరతను అధిగమించే ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు?
గతంతో పోల్చితే ఈసారి ప్రభుత్వం నిధులు పెంచింది. ఇంకా పెరగాల్సి ఉంది. జీతాలు, పింఛన్లకు పూర్తిస్థాయిలో నిధులివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మిగిలిన వివిధ గ్రాంట్ల రూపేణా సొంతంగా సమకూర్చుకుంటున్నాం.
4. వర్సిటీ విభజన ఎంత వరకు వచ్చింది.?
విభజనపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కాకుండా అప్పుడప్పుడు చర్చిస్తోంది. దీనివల్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.
5. కొత్త కోర్సులు ఏమైనా తీసుకువస్తున్నారా.?
2022-23 నుంచి కొత్త కోర్సులు రానున్నాయి. మేనజ్మెంట్ విభాగంలో డిప్లొమా, సైకాలజీలో కౌన్సెలింగ్, బీఏలో ఇంటర్నేషనల్ స్టడీస్, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ తీసుకొస్తున్నాం. పీజీ స్థాయిలోనూ ప్రవేశపెట్టనున్నాం.
6. రానున్న రెండేళ్లలో మీ ప్రణాళికలు.?
వచ్చే విద్యా సంవత్సరం నుంచే పీజీలో సెమిస్టర్ విధానంతోపాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నాం. ఈ ఏడాది ఆఖరుకల్లా న్యాక్కు అవసరమైన పత్రాలు సమర్పించి.. వచ్చే ఏడాదిలో మంచి గ్రేడ్తో గుర్తింపు సాధిస్తాం. సైన్స్ కోర్సుల కోసం ల్యాబ్లు పీజీ స్థాయికి అప్గ్రేడ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్, లాంగ్వేజీ తీసుకురానున్నాం. వర్సిటీ మొబైల్ యాప్ తీసుకొస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలు యాప్లో లభిస్తాయి. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు అవసరమైన సిలబస్ స్టడీ మెటీరియల్ తీసుకొస్తున్నాం. దీన్ని నామమాత్రపు ధరలకే అందిస్తాం.
ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి చదువుకునే వీలు
- టి.కిషన్రావు, ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
1. ఏడాదిలో యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?
ప్రతి కోర్సులో సీట్ల సంఖ్యను మూడింతలు పెంచి ఆసక్తి కలిగిన ప్రతి విద్యార్థి చదువుకునే అవకాశం కల్పించాం. పేద విద్యార్థుల ఫీజులకు ఇబ్బంది లేకుండా దాతల సహకారంతో చెల్లిస్తున్నాం. పదేళ్ల తర్వాత ఎంఏ హిస్టరీ, కల్చర్ అండ్ టూరిజం తిరిగి పునరుద్ధరించాం. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు ప్రారంభించాం. ఎంఫిల్, పీహెచ్డీలో 160 సీట్లు భర్తీ చేశాం. ప్రాజెక్టు అసిస్టెంట్లు, ఇన్స్ట్రక్టర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా కల్పించి జీతాలు పెంచాం. 70 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశాం. ఎలాంటి రాజకీయ జోక్యం, పైరవీలు లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కవులు, రచయితలను ఎంపిక చేసి అవార్డులు అందించాం.
2. ఆచార్యుల భర్తీ జరగకపోవడంతో బోధనపై ప్రభావం పడుతోంది. దీన్నెలా అధిగమిస్తున్నారు.?
2. రెగ్యులర్ ఆచార్యులు లేకపోవడంతో ఇబ్బంది ఉన్నా.. బోధనకు లోటు లేకుండా చూసుకుంటున్నాం. పదవీ విరమణ చేసిన వారితోపాటు తాత్కాలిక అధ్యాపకులను నియమించుకున్నాం. దూరవిద్యపై కొంత ప్రభావం రెగ్యులర్ పీజీ కోర్సులు ఆగిపోయాయి. ఆ స్థానంలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తున్నాం.
3. ప్రభుత్వం నుంచి జీతాలకు మినహా ఇతరత్రా గ్రాంట్లు రావడం లేదు. నిధుల కొరతను అధిగమించే ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు?
ఏడాది కాలంలో నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. బాచుపల్లిలోని క్యాంపస్లో జరుగుతున్న భవన నిర్మాణాలు రూసా నిధులతో జరుగుతున్నాయి.
4. వర్సిటీ విభజన ఎంత వరకు వచ్చింది.?
విభజన విషయంలో ఏపీ ప్రభుత్వంలో అలసత్వం కనిపిస్తోంది. చర్చల దశలోనే ఉంది. అక్కడి పీఠాలలోని సిబ్బందికి జీతాలు సరిగా అందకపోవడంతో యూనివర్సిటీ నుంచే భరించాల్సి వస్తోంది.
5. కొత్త కోర్సులు ఏమైనా తీసుకువస్తున్నారా.?
బాచుపల్లికి మారిన తర్వాత కొత్త కోర్సులు తీసుకొచ్చే ఆలోచన ఉంది. లైబ్రరీ సైన్స్, డిజైన్ కోర్సులు ప్రారంభిస్తున్నాం.
6. రానున్న రెండేళ్లలో మీ ప్రణాళికలు.?
త్వరలోనే బాచుపల్లికి క్యాంపస్ను తరలించాలనుకుంటున్నాం. అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడ కేవలం పీజీ కోర్సులే నిర్వహిస్తాం. సర్టిఫికెట్, డిప్లొమాతోపాటు సాయంకాల కోర్సులు నాంపల్లి క్యాంపస్లో కొనసాగిస్తాం. ఈ ఏడాది జులైలో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత ఓటింగ్లో పాల్గొనేలా చేద్దాం: సంజయ్ ఉపాధ్యాయ
[ 04-05-2024]
విద్యా వంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. -
సివిల్స్ ర్యాంకర్లను సత్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
[ 04-05-2024]
భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు మాత్రమే లబిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. -
క్రషర్ క్వారీలో పడి మరో యువకుడు బలి
[ 04-05-2024]
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలోనే మరో యువకుడు క్రషర్ క్వారీలో పడి గౌతమ్ (21)మృతి చెందాడు. -
అబద్ధాల కాంగ్రెస్ను శిక్షించాల్సిందే: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
[ 04-05-2024]
సాయంత్రం సమయం.. అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
[ 04-05-2024]
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
[ 04-05-2024]
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మొదటి నుంచి స్థానికేతరులకే పట్టంకడుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు విజయం సాధించలేకపోయారు. -
గడప దాటిస్తే ... గండం గడిచినట్లే
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడటంతో బూత్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచారం ఒకెత్తయితే పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం చాలా కీలకం. -
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
[ 04-05-2024]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
[ 04-05-2024]
తక్కువ ధరకే ప్లాట్లు విక్రయిస్తామంటూ దంపతులు 15 మందికి రూ.12.35 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. తప్పుడు ప్రకటనలు, ఫోర్జరీ పత్రాలతో మోసగించిన వీబీజే క్యాప్స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కందుల వెంకట ప్రసాద్ గుప్తా, ఆయన భార్య అనురాధను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటనలో తెలిపారు. -
నగర ఓటరు.. తీర్పు ఎప్పటికప్పుడు మారు
[ 04-05-2024]
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో నగర ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నినెలల వ్యవధిలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. -
సైబర్సిటీలో భారీగా వాడకం
[ 04-05-2024]
ఐటీ కార్యాలయాలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలకు నిలయమైన సైబర్సిటీ సర్కిల్ పరిధిలో వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సిటీలోని తొమ్మిది సర్కిళ్లలో ఇక్కడే అత్యధిక వాడకం నమోదైంది. -
బంధాన్ని కాదని.. భర్తను బంధించి
[ 04-05-2024]
ఆస్తి కోసం భార్య ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. -
తరుణీ కరుణించు
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల కోసం రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. -
పట్టణ ఓటరుపై పట్టుకు..
[ 04-05-2024]
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గేటర్లో రాజకీయ వేడి మొదలైంది. మహానగరంలో 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. -
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
[ 04-05-2024]
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు బుద్ధిచెప్పాలని మజ్లిస్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
రంజిత్రెడ్డికి ఓట్లతో గుణపాఠం చెప్పాలి
[ 04-05-2024]
రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన భారాసకు ద్రోహం చేసిన రంజిత్రెడ్డికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లిలో శుక్రవారం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. -
తపాలా ఓటులో తడబాటు.. వెనుదిరిగిన ఓటర్లు
[ 04-05-2024]
రాజధానిలో కోటి పదిలక్షల మంది ఓటర్లుండగా.. సుమారు పది వేల పోలింగ్ కేంద్రాల్లో 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. భద్రతా సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిపితే మరో 20వేల మంది ఉంటారు. -
ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్ర
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారాస కుట్రలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పట్టణంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కౌన్సిలర్ భరత్ బృందం పార్టీలో చేరిన సందర్భంగా సభ నిర్వహించారు. -
మా అభ్యర్థులను గెలిపించుకుంటాం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్రావు ప్రకటించారు. -
నక్షత్రాలు,గ్రహాల గుట్టు తెలుసుకుందాం
[ 04-05-2024]
వినూత్న పరిశోధనలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు.. అంతరిక్ష పరిశోధనలపై ప్రోత్సహించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మినీ అబ్జర్వేటరీని ప్రారంభించింది. -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
[ 04-05-2024]
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాదబాటపై నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరిగుట్టకి చెందిన తుమ్మ భావన రుషి (35) రెండేళ్ల క్రితం సుజాత అనే ఉపాధ్యాయురాలిని ప్రేమ వివాహం చేసుకొని వెంకటగిరిలో నివసిస్తున్నాడు. -
ఎవరిదో పైచేయి
[ 04-05-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (టీఆర్ఆర్, గడ్డం ప్రసాద్కుమార్, బుయ్యని మనోహర్రెడ్డి), భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు (ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్) తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు సాధించడంపై దృష్టి నిలిపారు. -
భారాస విజయానికి వ్యూహ రచన
[ 04-05-2024]
తాండూరులో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తాండూరు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు