Revanth Reddy: కుటుంబ తగాదాల పరిష్కారం కోసమే బీఆర్ఎస్ను తీసుకొచ్చారు: రేవంత్
భారత్ రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని చంపేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారశైలి ఉందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని చంపేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారశైలి ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆర్థికంగా బలోపేతం అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని కేసీఆర్ గ్రహించారని, ఇకపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్తో రుణం తీరిపోయిందని పేర్కొన్నారు. అందువల్లనే తెలంగాణ అనే పదం కనిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆర్ఎస్ను తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, ఆ పదాన్ని చంపేయాలనుకుంటున్న వ్యక్తి కేసీఆర్ అని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రస్తక్తే లేదని, ఒక తెలంగాణ బిడ్డగా తాను కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇకపై పోటీ చేయడానికి కూడా కేసీఆర్కు అర్హత లేదని.. రాష్ట్ర ప్రజలు ఈ విషయం ఆలోచించాలన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?