బెడిసికొట్టిన వ్యాపారి కుమారుడి కిడ్నాప్ ప్రణాళిక
అయిదుగురు కలిసి ఓ వ్యాపారి కుమారుడిని అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా ఇద్దరు పరారీలో ఉన్నారు. కేపీహెచ్బీ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..
అయిదుగురిలో ఇద్దరు పథకం మార్చడంతో బహిర్గతం
కేపీహెచ్బీకాలనీ, న్యూస్టుడే: అయిదుగురు కలిసి ఓ వ్యాపారి కుమారుడిని అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా ఇద్దరు పరారీలో ఉన్నారు. కేపీహెచ్బీ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్నగర్లో ఓ ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీని నాగేశ్వరరావు నడిస్తున్నారు. ఇతని వద్ద ఏపీ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన చెంచినాడ నర్సింహస్వామి (29) పనిచేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన సింగలూరి సురేశ్(26), అదే జిల్లాకు చెందిన నాగరాజు దొంగనోట్ల కేసులో జైలుకి వెళ్లొచ్చారు. వీరిద్దరూ నర్సింహస్వామి స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు వెతికారు. తమ కంపెనీ యజమాని నాగేశ్వరరావు కుమారుడు భానుప్రకాశ్(20)ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేద్దామని నర్సింహస్వామి చెప్పడంతో సురేశ్, నాగరాజు ఒప్పుకొన్నారు. డబ్బు ఇవ్వకపోతే భానుప్రకాశ్ను చంపేయాలనుకున్నారు. నర్సింహస్వామి తనతోపాటే పనిచేస్తున్న బీదర్కు చెందిన ప్రశాంత్(31), పనిచేసి మానేసిన బాబును ఈ పథకంలో సాయం కోరాడు.
బయటపడిందిలా.. గత ఏడాది అక్టోబరులో అయిదుగురూ కలిసి భానుప్రకాశ్ను కిడ్నాప్ చేసేందుకు కంపెనీ వద్దకు వెళ్లగా జనం కదలికలు, సీసీ కెమెరాలు ఉండటంతో ప్రణాళికను వాయిదా వేశారు. తర్వాత పెనుగొండకు తిరిగి వెళ్లిపోయిన సురేశ్, నాగరాజు.. డిసెంబరు 26న హైదరాబాద్ వచ్చి నేరుగా కంపెనీకి వెళ్లి యజమాని నాగేశ్వరరావును కలిశారు. ‘మీ కుమారుడిని కిడ్నాప్ చేసేందుకు మీ కంపెనీలో పనిచేసేవారే ప్రణాళిక వేశారని, వారి పేర్లు చెప్పాలంటే డబ్బులివ్వాల’ంటూ బేరసారాలకు దిగారు. దీనికి ఒప్పుకొన్న నాగేశ్వరరావు ఆ ఇద్దరి వివరాలు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం ప్రణాళిక బయటపడింది. నర్సింహస్వామి, ప్రశాంత్, సరేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాబు, నాగరాజు పరారీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీ త్రిముఖం.. ప్రచారం బహుముఖం
[ 05-05-2024]
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ఈసారి పేరుకే 43 మంది బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, భాజపా, భారాసల మధ్యే ‘త్రిముఖ’ పోటీ నెలకొంది. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
కలిసికట్టుగా ‘కొండా’ను గెలిపిద్దాం: భాజపా
[ 05-05-2024]
ప్రతి ఒక్కరు ఐక్యతగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి కృషిచేద్దామని ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్ అన్నారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్ర మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రాణం తీసిన.. ఫొటో సరదా..
[ 05-05-2024]
క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్ క్వారీ గుంత వద్ద జరిగింది. -
ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది. -
శంషాబాద్లో చిక్కిన చిరుత అమ్రాబాద్కు తరలింపు
[ 05-05-2024]
శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాప్ బోనులో చిక్కిన మగ చిరుతను శనివారం హైదరాబాద్ నెహ్రూ జూపార్కు అధికారులు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోకి వదలి పెట్టారు. -
క్రిశాంక్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 05-05-2024]
భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ శనివారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు