7 దశాబ్దాలు 10 మందే వనితలు
గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో మహిళలు ఉన్నా శాసనసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.
శాసనసభలోకి అడుగిడింది వీరే
ఈనాడు, హైదరాబాద్
గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో మహిళలు ఉన్నా శాసనసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 1952లో నియోజకవర్గాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 10 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు. పలు నియోజకవర్గాల్లో మహిళలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగినా అంతగా ప్రభావం చూపలేకపోయారు.
మేడ్చల్ నియోజకవర్గం 1967, 1972 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్గా కేటాయించారు. రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సుమిత్రాదేవీ గెలుపొందారు.
ముషీరాబాద్లో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఒకే ఒక్క మహిళ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని నర్సింహారెడ్డి 2008లో రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి.అంజయ్య సతీమణి మణెమ్మ గెలుపొందారు. ఆ తర్వాతి ఎన్నికలోనూ ఆమె విజయకేతనం ఎగరేశారు.
1952 శాలిబండ, 1957 పత్తర్ఘట్టి నియోజకవర్గాల్లో మసూమా బేగం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
1962లో ఏర్పడిన చేవెళ్ల నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1999 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో సబిత రాజకీయ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో.. 2009లో ఏర్పడిన మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబిత పోటీ చేసి ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డిపై విజయం సాధించారు. 2018లోనూ ఆమె విజయం సాధించారు.
ఇబ్రహీంపట్నం నుంచి 1999 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన కొండ్రు పుష్పలీల.. కాంగ్రెస్ అభ్యర్థి ఎ.గంగారాం కృష్ణపై గెలుపొందారు.
2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జయసుధ సమీప అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్పై గెలుపొందారు.
మలక్పేట్ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన బి.సరోజినీ పుల్లారెడ్డి విజయం సాధించారు.
సనత్నగర్ నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరగ్గా.. 1983 ఎన్నికల్లో తెదేపా నుంచి తరఫున పోటీ చేసిన కాట్రగడ్డ ప్రసూన కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
- 1972లో గగన్మహల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన టి.శాంతాబాయి 5వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.
- కంటోన్మెంట్లో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో ఈ స్థానం నుంచి వి.రామారావు గెలిచారు. ఆయన మరణించడంతో 1969లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య వి.మంకమ్మ కాంగ్రెస్ తరఫున బరిలో దిగి గెలుపొందారు. 1972 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
‘సిరా’ చుక్క కథ... తెలుసునా ఓటరూ..!
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!