గెలుపే లక్ష్యం.. వెన్నంటి ఉంటాం
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థుల విజయం కోసం వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.
లోక్సభ అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యుల ప్రచారం
కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థుల విజయం కోసం వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. అభ్యర్థులతోపాటు సమాంతరంగా ఆయా పార్టీల నేతలతో పర్యటిస్తున్నారు. అభ్యర్థులు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తుంటే వారి కుటుంబ సభ్యులు ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలంటూ మద్దతు కోరుతున్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లు, ప్రజలు చెబుతున్న సమస్యలను శ్రద్ధగా వింటున్నారు. అత్యవసరంగా చేయాల్సిన వాటిని ఒక పుస్తకంలో రాసుకుంటున్నారు.
వినతులు వింటూ... ఆకట్టుకుంటూ...
గడ్డం రంజిత్రెడ్డి సతీమణి సీతారెడ్డి
చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తరఫున గడ్డం రంజిత్రెడ్డి, సునీతా మహేందర్రెడ్డి పోటీచేస్తున్నారు. గడ్డం రంజిత్రెడ్డి భార్య జి.సీతారెడ్డి చేవెళ్ల లోక్సభ పరిధిలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధులను కలుసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతుల వద్దకు వెళ్లి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు, వయోధికులను కలుసుకుంటున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా... ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి ఉప్పల్, మల్కాజిగిరి, కంటోన్మెంట్, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా కలుసుకుని వారితో ముమ్మరంగా ప్రచారం చేయిస్తున్నారు.
కేంద్రంలో మళ్లీ మనమే అంటూ..
ఈటల కోడలు క్షమిత
భాజపా అభ్యర్థులు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాధవీలత పోటీచేస్తున్నారు. కిషన్రెడ్డి ప్రచార రథంలో పర్యటిస్తుండగా ఆయన సతీమణి కావ్యారెడ్డి అంబర్పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్ నాంపల్లి సెగ్మెంట్లలో ఇంటింటికీ వెళ్లి కిషన్రెడ్డికి మద్దతుగా ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి సతీమణి, అపోలో ఆసుపత్రుల గ్రూప్ జేఎండీ సంగీతారెడ్డి ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లు అత్యధికంగా ఉండే శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజవర్గాల్లో ఆమె ఇంటింటికీ వెళ్తున్నారు. మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున, కోడలు క్షమిత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటల క్షమిత యువ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలత తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్ కంచుకోటలను బద్దలు చేద్దాం.. మద్దతు ఇవ్వండంటూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఓటేస్తే పాతబస్తీలో మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.
కొండా విశ్వేశ్వర్రెడ్డి సతీమణి సంగీతారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మడతల చొక్కా వేసుకో.. పర్యావరణాన్ని కాపాడుకో
[ 19-05-2024]
ఎండలైనా, వానలైనా అసాధారణంగా ఉంటున్నాయి. ఎందుకిలా అని వాతావరణ శాస్త్రవేత్తలను అడిగితే పర్యావరణ మార్పుల ప్రభావం అంటున్నారు. తగ్గించేందుకు మన వంతుగా ఏమైనా చేయవచ్చా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు.. ఓవైపు ల్యాబ్ల్లో ప్రయోగాలు చేస్తూనే.. -
పట్టుదలతో చదివి.. సత్తా చాటి
[ 19-05-2024]
పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు. -
గంటలో కుంటలా...
[ 19-05-2024]
వరుణుడు మరోసారి నగరంపై ఉరిమాడు. శనివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, హయత్ నగర్లో అరగంట నుంచి గంట వ్యవధిలో కుండపోతగా పడింది. అత్యధికంగా లింగంపల్లిలో 6.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
స్థానిక సంస్థలపై కాంగ్రెస్ గురి
[ 19-05-2024]
నార్సింగి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ దారుగుపల్లి రేఖ, వైస్ఛైర్మన్ వెంకటేశ్యాదవ్(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్రెడ్డి -
పుస్తకాలకు, బల్లలకు ఆకతాయిల నిప్పు
[ 19-05-2024]
జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, బల్లలకు ఆకతాయిలు నిప్పు పెట్టిన సంఘటన తాండూరు మండలం కరణ్కోటలో జరిగింది. శనివారం పాఠశాలలోకి ప్రవేశించిన ఆకతాయిలు సామగ్రి నిల్వ గదిలోకి వెళ్లారు. -
జూలో ఖడ్గమృగాల సంతతి వృద్ధి
[ 19-05-2024]
నగర నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల సంతతి క్రమంగా పెరుగుతోంది. వాటి ప్రదర్శన, విశ్రాంతికి మరో ఎన్క్లోజర్ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి వాటిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) దత్తత తీసుకొంటోంది. -
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
[ 19-05-2024]
నీటి ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది. -
సెప్టెంబరుకు.. ‘సుంకిశాల’ అందేనా?
[ 19-05-2024]
నాగార్జునసాగర్ డెడ్స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి సమాయత్తమవుతోంది. -
చిన్న వర్షం.. అతలాకుతలం
[ 19-05-2024]
నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. -
మానసిక కుంగుబాటుతో చందు బలవన్మరణం
[ 19-05-2024]
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) అలియాస్ చందు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. త్రినయని సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న చందు శుక్రవారం మణికొండలో బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. -
సైబర్ నేరస్థులకు.. ‘మ్యూల్’ ఖాతాలు తెరుస్తూ..
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి ముమ్మర ఏర్పాట్లు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్శర్మ తెలిపారు. -
నాసిరకం ముప్పు.. కావాలి కనువిప్పు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ దగ్గర పడుతోంది. పొలాలను శుభ్రం చేసే పనులు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా నాసిరంక విత్తనాలు కూడా విపణిలోకి తెచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. -
పర్యవేక్షణ శూన్యం.. ఇసుక మాయం
[ 19-05-2024]
ప్రభుత్వ లక్ష్యానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నిర్మాణాలు సాగాలి. గుత్తేదారు దానికి తగినట్లుగా పనులు చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. -
12 శాతం రిజర్వేషన్ కోసం మాదిగ జన సభలు
[ 19-05-2024]
తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మాదిగ జన సభలు’ నిర్వహిస్తున్నట్లు మాదిగ ఐకాస ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
చెత్త కుప్పలు తొలగించేదెవరు?
[ 19-05-2024]
ఎన్ని చర్యలు తీసుకున్నా పారిశుద్ధ్యం పట్టాలెక్కడం లేదు. నగరవ్యాప్తంగా 23 లక్షల ఇళ్లు ఉన్నాయని అంచనా. వాటన్నింటి నుంచి నిత్యం చెత్త సేకరణకు ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలున్నాయి. -
అటవీ భూమి కేటాయింపులు సబబే
[ 19-05-2024]
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్ కంచ, సరూర్నగర్ మండలం మామిడిపల్లిలో అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు సమర్ధించింది. -
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో టోకరా
[ 19-05-2024]
కొంపల్లిలో ఖరీదైన ప్రాంతంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముగ్గురు మోసగాళ్లను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
[ 19-05-2024]
పలు విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని మహేశ్వరం ఎస్వోటీ బృందం, చైతన్యపురి పోలీసుల సహకారంతో అరెస్టు చేసింది. -
వారణాసిలో ప్రచారానికి భాజపా బృందం
[ 19-05-2024]
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి
[ 19-05-2024]
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
పోరాటయోధుల చరిత్ర గ్రంథస్థం చేస్తాం
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ -
రైల్వే, ఆదాయపన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం
[ 19-05-2024]
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ కథనం ప్రకారం.. -
క్యాన్సర్పై సమగ్ర పుస్తకం అభినందనీయం
[ 19-05-2024]
క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్ డా.రామకృష్ణ
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
-
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం