logo

‘అల్లాహ్‌ మీద ఒట్టు.. జీవితంలో ఎవరిపై జులుం చేయలేదు’

మతాల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ సర్కారును ఓడించేందుకు అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు.

Updated : 05 May 2024 06:24 IST

ప్రసంగిస్తున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ

కేశవగిరి, న్యూస్‌టుడే: మతాల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ సర్కారును ఓడించేందుకు అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. రజాకార్లు, చొరబాటుదారులని విమర్శిస్తున్న వారిని, హిజాబ్‌ బ్యాన్‌, బీఫ్‌ బ్యాన్‌, గడ్డం, వేషధారణ పేరుతో ముస్లింలను వేధిస్తున్న దుష్ట శక్తులను ఓడించాలంటే ఓటే సరైన ఆయుధమన్నారు. పాతబస్తీ ఉప్పుగూడ డివిజన్‌లో శనివారం సాయంత్రం అసదుద్దీన్‌ ఒవైసీ తరఫున ప్రచారం చేశారు. నసీబ్‌నగర్‌లో కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ‘అల్లాహ్‌ మీద ఒట్టేసి చెబుతున్నా నేను నా జీవితంలో ఎవరిపైనా జులుం చేయలేదు.. చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా’ అన్నారు. తన శరీరంలో అన్ని అవయవాలు పాడయ్యాయని.. ఏడాది క్రితం వైద్యులు 3 గంటలు శ్రమించి మృత్యుముఖంలోంచి కాపాడారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని