logo

ముమ్మరంగా నేతల ప్రచారాలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికస్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా అధికారం చేపడుతుందని టీపీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కీగౌడ్‌, భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల ఇంఛార్జ్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

Updated : 05 May 2024 06:19 IST

యాచారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిత్రంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూస్‌టుడే బృందం: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికస్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా అధికారం చేపడుతుందని టీపీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కీగౌడ్‌, భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల ఇంఛార్జ్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. యాచారంలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి కర్నార్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు.

  • మహేశ్వరం మండలం తుమ్మలూరు వద్ద కందుకూరు టీపీసీసీ కార్యదర్శి బోధమాదవరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బొక్క జంగారెడ్డి, మాజీ జడ్పీఫ్లోర్‌లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, జి.జానకిరామ్‌ ప్రచారం చేశారు.
  • బడంగ్‌పేట పరిధిలోని శ్రీకృష్ణ ఎంక్షేవ్‌, సాయినగర్‌, సాయిబాలాజీ కాలనీ, సీతహోమ్స్‌ తదితర కాలనీల్లో మేయర్‌ టీపీసీసీ ప్రధాన కార్యదర్శ పారిజాత ప్రచారం నిర్వహించారు.
  • తాటిపర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
  • కప్పపాడ్‌కు చెందిన వివిధ పార్టీల నేతలు ఎండీ మునీర్‌, లతీఫ్‌, చాంద్‌బాయ్‌ తదితరులు మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ గురునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

నందివనపర్తిలో ప్రచారం చేస్తున్న భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్‌ కుమార్తె ఆరోని

  • కొత్తగూడ, కొత్తూరు, బాచుపల్లి, జైత్వారం, పులిమామిడి, పెద్దమ్మ తండాలలో కేఎల్‌ఆర్‌ బూత్‌స్థాయి కమిటీలతోపాటు ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
  • ఆర్కేపురంలో శనివారం కాంగ్రెస్‌ నేత పున్న గణేశ్‌ ఆధ్వర్యంలో బూత్‌ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి మాట్లాడారు.
  • కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి... పోలేపల్లి గ్రామం, కడ్తాల్‌ మండలం కానుగుబావితండ, గానుగుమర్ల తండాల్లో ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి భీక్యానాయక్‌, యాట నర్సింహా పాల్గొన్నారు.
  • భువనగిరి భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌ తరఫున ఆయన కుమార్తె ఆరోని అనాజ్‌పూర్‌లో ప్రచారం నిర్వహించారు.
  • భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఓటు వేయాలని కోరుతూ ఎంపీటీసీ సభ్యులు సుదర్శన్‌యాదవ్‌, మల్లేష్‌, శ్రవణ్‌ మహేశ్వరంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ ప్రచారం నిర్వహించారు.
  • భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా కొత్తగూడ, తిమ్మాపూర్‌లో కందుకూరు ఎంపీపీ మంద జ్యోతి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • భువనగిరి ఎంపీ సీపీఎం అభ్యర్ధి జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ శనివారం మంచాల, లోయపల్లి, తిప్పాయిగూడ గ్రామాలలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని