logo

కాంగ్రెస్‌, భారాసలకు కాలం చెల్లింది: కొండా

రాష్ట్రంలో కాంగ్రెస్‌, భారాసలకు కాలం చెల్లిందని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లో ఆయన సమక్షంలో మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ మమతప్రవీణ్‌ తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు.

Published : 08 May 2024 03:38 IST

పార్టీలో చేరిన వారితో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఫిల్మ్‌నగర్‌, మీర్‌పేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌, భారాసలకు కాలం చెల్లిందని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లో ఆయన సమక్షంలో మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ మమతప్రవీణ్‌ తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. చేవెళ్ల నియోజకవర్గం పాల్గుట్ట గ్రామానికి చెందిన పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, భాజపా సీనియర్‌ నాయకులు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో భాజపా 12 నుంచి 15 స్థానాల్లో విజయం సాధిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుయాదవ్‌, కొలన్‌ శంకర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని