logo

అక్కను నిత్యం వేధిస్తున్నాడని బావ హత్య

అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి యోగేందర్‌(40)కు ఇద్దరు కుమార్తెలు.

Updated : 08 May 2024 05:51 IST

యోగేందర్‌ మృతదేహం

అల్వాల్‌, న్యూస్‌టుడే: అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి యోగేందర్‌(40)కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె వివాహమైంది. పలు నేరారోపణలతో జైలుకెళ్లిన అతను తిరిగొచ్చి.. భార్య జానకి,  చిన్న కుమార్తెను  వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి యోగేందర్‌ తాగొచ్చి భార్యపై దాడి చేయడంతో ఆమె తన సోదరుడు సుబ్రహ్మణ్యానికి చెప్పింది. అదే రాత్రి అతను వచ్చి ఆగ్రహంతో యోగేందర్‌ను బండరాయితో మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని