ఒక్క వానకే.. వణికె
అకాలవర్షం నగరంపై విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో అస్తవ్యస్తం చేసింది. నిప్పుల కుంపటిలా మారిన నగరానికి వరుణుడు ఉపశమనం కలిగించినా.. విద్యుత్తు తీగలు తెగటం, చెట్లకొమ్మలు విరిగిపడడం.. ట్రాఫిక్ స్తంభించి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఉరుములు, మెరుపులతో విరుచుకుపడిన వరుణుడు
ఈదురుగాలులతో కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు
గంటల తరబడి విద్యుత్తుకు అంతరాయం.. నిలిచిన ట్రాఫిక్
ఎర్రగడ్డలో ప్రధాన రహదారిపై నిలిచిన వరద
ఈనాడు, హైదరాబాద్: అకాలవర్షం నగరంపై విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో అస్తవ్యస్తం చేసింది. నిప్పుల కుంపటిలా మారిన నగరానికి వరుణుడు ఉపశమనం కలిగించినా.. విద్యుత్తు తీగలు తెగటం, చెట్లకొమ్మలు విరిగిపడడం.. ట్రాఫిక్ స్తంభించి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రానికి రాజధాని వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన జల్లు మొదలైంది. పలుచోట్ల కుండపోతగా కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. మియాపూర్లో 13 సెం.మీ.లకు పైగా కురవగా.. చాలాప్రాంతాల్లో 6 సెం.మీల పైనే కుమ్మరించింది. భారీగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్తు తీగలు, స్తంభాలపై పడ్డాయి. తీగలు తెగిపడడంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది.
ఐకియా నుంచి బయోడైవర్సిటీ వెళ్లేదారిలో కిలోమీటర్ మేర స్తంభించిన ట్రాఫిక్
తారానగర్లో కారుపై కూలిన చెట్టు
శ్రీకృష్ణానగర్ డి-బ్లాక్ ప్రాంతంలో..
పాపిరెడ్డినగర్లో కూలిన ట్రాన్స్ఫార్మర్
ఖైరతాబాద్ పైవంతెన డివైడర్పై పడిపోయిన కుండీలు
వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి..
- బహదూర్పుర చౌరస్తా రామ థియేటర్ రహదారి పక్కన విద్యుత్తు స్తంభానికి చేతులు తగిలి షార్ట్సర్క్యూట్తో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు.
- పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన నాగబాల గంగాధరరావు(38), తూర్పు గోదావరి జిల్లా కడియంకు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం(40) నగరానికి వచ్చి కొంపల్లిలోని దేవేందర్ కాలనీలో ఉంటూ తాపీమేస్త్రీలుగాచేస్తున్నారు.మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్లోని ఫాంహౌజ్లో పని చేస్తుండగా వర్షం కురవడంతో ఓ గోడ పక్కన నిల్చున్నారు. అది కూలి వారిపై పడటంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.
- బాచుపల్లి ఠాణా పరిధి రేణుకాఎల్లమ్మ కాలనీలో అర్జన్ నిర్మాణ సంస్థ భారీ గృహ సముదాయాలను నిర్మిస్తోంది. ప్రాజెక్టు ఆవరణలో 10 అడుగుల ఎత్తుతో నిర్మించిన రక్షణ గోడను ఆనుకుని కార్మికులు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వర్షానికి గోడ కూలడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు.
- మియాపూర్ మెట్రో స్టేషన్లో ప్రధాన ప్రవేశం వద్ద షట్టర్కు ఏర్పాటు చేసిన రేకు డోమ్ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
న్యూస్టుడే, మియాపూర్, చార్మినార్, నిజాంపేట
ఫిర్యాదులిలా..
కూలిన చెట్లు 32
నీరు నిలిచిన ప్రాంతాలు 17
వణికించిన వరుణుడు
లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరద
ఈనాడు, హైదరాబాద్: ఎటుచూసినా రోడ్లపై నీరు.. కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు.. హారన్ల మోత.. మంగళవారం సాయంత్రం అకాల వర్షంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. కార్యాలయాల్లో పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే సమయంలో మొదలైన భారీ వర్షంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఐటీ కారిడార్లో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పలుచోట్ల ప్రధాన రహదారులపై మోకాలు లోతు నీరు నిలిచింది. భారీగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్తు తీగలు, స్తంభాలపై పడ్డాయి.
పోచమ్మ బస్తీలో ఇళ్లలోకి వచ్చిన వాన నీరు
కొట్టుకుపోయిన వాహనాలు.. కూలిన చెట్లు
- యూసుఫ్గూడలో వరద ఉద్ధృతికి ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.
- మల్లాపూర్, నాచారం ప్రాంతాల్లో రోడ్డుపై వరద చేరి ట్రాఫిక్ స్తంభించింది.
- పనామా వద్ద వరదతో జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. సిటీలో 7చోట్ల చెట్లు కూలినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి.
నిజాంపేట శిల్పా లేఅవుట్లో ట్రాన్స్ఫార్మర్పై కూలిన హోర్డింగ్
అధికారుల సమీక్ష.. డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్షించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి అర్ధరాత్రి వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.
ఖైరతాబాద్ గణేశ్ రోడ్డులో...
ట్రాఫిక్ నరకం.. సికింద్రాబాద్, బోయిన్పల్లి, అల్వాల్, ప్యారడైజ్, ప్యాట్నీ, ఎల్బీనగర్, కాప్రా, సుచిత్ర, మలక్పేట, ఎర్రగడ్డ, అమీర్పేట, యూసుఫ్గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, కేపీహెచ్బీ, బాచుపల్లి, ఈసీఐఎల్, మల్కాపూర్, నాచారం ప్రాంతాల్లో రోడ్లపైకి వరద చేరింది. ఐటీ కారిడార్ నుంచి బంజారాహిల్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి ప్రాంతాలకు చేరుకోవడానికి గంటన్నర పట్టింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకియా, ఖాజాగూడ చౌరస్తా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. సనత్నగర్, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి ప్రధాన రహదారుల్లో 2 కి.మీ. దూరానికి గంట సమయం పట్టింది. శిల్పారామం దగ్గర చెట్టు విరిగి రోడ్డుమీద పడడంతో వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు అస్తవ్యస్తంగా రోడ్లమీదకు దూసుకురావడంతో పరిస్థితి చేయిదాటింది. గచ్చిబౌలిలో సాయంత్రం తర్వాత గందరగోళం నెలకొంది.
లక్డీకాపూల్లో వరద పరిస్థితిని సమీక్షిస్తున్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్
వారాసిగూడలో విరిగి పడిన చెట్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
[ 19-05-2024]
భాజపా నేత, కార్పొరేటర్ శ్రవణ్ను ప్రభుత్వం కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. -
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
[ 19-05-2024]
రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. -
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
[ 19-05-2024]
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. -
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
[ 19-05-2024]
నీటి ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది. -
మడతల చొక్కా వేసుకో.. పర్యావరణాన్ని కాపాడుకో
[ 19-05-2024]
ఎండలైనా, వానలైనా అసాధారణంగా ఉంటున్నాయి. ఎందుకిలా అని వాతావరణ శాస్త్రవేత్తలను అడిగితే పర్యావరణ మార్పుల ప్రభావం అంటున్నారు. తగ్గించేందుకు మన వంతుగా ఏమైనా చేయవచ్చా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు.. ఓవైపు ల్యాబ్ల్లో ప్రయోగాలు చేస్తూనే.. -
పట్టుదలతో చదివి.. సత్తా చాటి
[ 19-05-2024]
పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు. -
గంటలో కుంటలా...
[ 19-05-2024]
వరుణుడు మరోసారి నగరంపై ఉరిమాడు. శనివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, హయత్ నగర్లో అరగంట నుంచి గంట వ్యవధిలో కుండపోతగా పడింది. అత్యధికంగా లింగంపల్లిలో 6.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
స్థానిక సంస్థలపై కాంగ్రెస్ గురి
[ 19-05-2024]
నార్సింగి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ దారుగుపల్లి రేఖ, వైస్ఛైర్మన్ వెంకటేశ్యాదవ్(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్రెడ్డి -
పుస్తకాలకు, బల్లలకు ఆకతాయిల నిప్పు
[ 19-05-2024]
జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, బల్లలకు ఆకతాయిలు నిప్పు పెట్టిన సంఘటన తాండూరు మండలం కరణ్కోటలో జరిగింది. శనివారం పాఠశాలలోకి ప్రవేశించిన ఆకతాయిలు సామగ్రి నిల్వ గదిలోకి వెళ్లారు. -
జూలో ఖడ్గమృగాల సంతతి వృద్ధి
[ 19-05-2024]
నగర నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల సంతతి క్రమంగా పెరుగుతోంది. వాటి ప్రదర్శన, విశ్రాంతికి మరో ఎన్క్లోజర్ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి వాటిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) దత్తత తీసుకొంటోంది. -
సెప్టెంబరుకు.. ‘సుంకిశాల’ అందేనా?
[ 19-05-2024]
నాగార్జునసాగర్ డెడ్స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి సమాయత్తమవుతోంది. -
చిన్న వర్షం.. అతలాకుతలం
[ 19-05-2024]
నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. -
మానసిక కుంగుబాటుతో చందు బలవన్మరణం
[ 19-05-2024]
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) అలియాస్ చందు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. త్రినయని సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న చందు శుక్రవారం మణికొండలో బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. -
సైబర్ నేరస్థులకు.. ‘మ్యూల్’ ఖాతాలు తెరుస్తూ..
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి ముమ్మర ఏర్పాట్లు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్శర్మ తెలిపారు. -
నాసిరకం ముప్పు.. కావాలి కనువిప్పు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ దగ్గర పడుతోంది. పొలాలను శుభ్రం చేసే పనులు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా నాసిరంక విత్తనాలు కూడా విపణిలోకి తెచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. -
పర్యవేక్షణ శూన్యం.. ఇసుక మాయం
[ 19-05-2024]
ప్రభుత్వ లక్ష్యానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నిర్మాణాలు సాగాలి. గుత్తేదారు దానికి తగినట్లుగా పనులు చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. -
12 శాతం రిజర్వేషన్ కోసం మాదిగ జన సభలు
[ 19-05-2024]
తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మాదిగ జన సభలు’ నిర్వహిస్తున్నట్లు మాదిగ ఐకాస ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
చెత్త కుప్పలు తొలగించేదెవరు?
[ 19-05-2024]
ఎన్ని చర్యలు తీసుకున్నా పారిశుద్ధ్యం పట్టాలెక్కడం లేదు. నగరవ్యాప్తంగా 23 లక్షల ఇళ్లు ఉన్నాయని అంచనా. వాటన్నింటి నుంచి నిత్యం చెత్త సేకరణకు ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలున్నాయి. -
అటవీ భూమి కేటాయింపులు సబబే
[ 19-05-2024]
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్ కంచ, సరూర్నగర్ మండలం మామిడిపల్లిలో అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు సమర్ధించింది. -
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో టోకరా
[ 19-05-2024]
కొంపల్లిలో ఖరీదైన ప్రాంతంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముగ్గురు మోసగాళ్లను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
[ 19-05-2024]
పలు విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని మహేశ్వరం ఎస్వోటీ బృందం, చైతన్యపురి పోలీసుల సహకారంతో అరెస్టు చేసింది. -
వారణాసిలో ప్రచారానికి భాజపా బృందం
[ 19-05-2024]
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి
[ 19-05-2024]
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
పోరాటయోధుల చరిత్ర గ్రంథస్థం చేస్తాం
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ -
రైల్వే, ఆదాయపన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం
[ 19-05-2024]
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ కథనం ప్రకారం.. -
క్యాన్సర్పై సమగ్ర పుస్తకం అభినందనీయం
[ 19-05-2024]
క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్ డా.రామకృష్ణ
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన